SOMASIRA NAAYANAR
చిదానందరూపా--సోమశిర నాయనారు
***************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
***************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
పావన సోమయజ్ఞమును పాయక చేసెడివాడు
తిరువెంబూరులోని శివభక్తుడు సోమసి మార నాయనారు
తిరువెంబూరులోని శివభక్తుడు సోమసి మార నాయనారు
పురహితమును కోరువంశమున పుట్టిన బాపడు
పరహితమును కోరు అనిశమును పూజను మానడు
పరహితమును కోరు అనిశమును పూజను మానడు
గురువని తలచెను సుందరారును,తిరువూరును చేరెను
భుజియింపగ యాగ హవిస్సును శివునే కోరెను
భుజియింపగ యాగ హవిస్సును శివునే కోరెను
చండిక తోడుగ శివుడు చండాలుడిగ వచ్చెగా
సదాశివుని కరుణను పొందగ సమానత్వమే కారణమాయెగ
సదాశివుని కరుణను పొందగ సమానత్వమే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక .
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక .
యజ్ఞం అగ్నివద్ద వేదమంత్ర సహితముగా జరుగుపవిత్ర అర్చన.దేవతలకు ప్రీతిని కలిగించడం యజ్ఞలక్ష్యం.అగ్నిహోత్రమనేదియజ్ఞంలో ముఖ్యమైన అంశము.
ఒకసారి ఆది శంకరాచార్యులవారికి ఎదురైన పంచమ కులజుడు,వారిచే పవిత్ర మనీష పంచకమునే ప్రసాదింపచేసినాడు. పంచమ దంపతుల ప్రత్యక్షముగ తామే సోమ శిర(శిరమందు చంద్రుని ధరించిన వాడు) నాయనారు దివ్య చరితము. మంచి-చెడులు ఎంచి చూడగ మనుజులందున రెండు కులములు ....మంచి నేనౌతా అన్నారు గురజాడ వారు.అదేవిధముగా చండాల రూపము-అచంచల కరుణాప్రవాహమైన స్వామి అనేక రూపములలో,అనేక విధములుగ ప్రకటింపబడుతు మనలను మూఢత్వమునుండి ముముక్షుత్వము వైపుకు మరలించుటకు బయలుదేరుచున్నాడు
తిరువాంబూరులోని సోమశిర నాయనారు ఉత్తమ సంస్కారుడు.పరమ శివభక్తుడు.త్రిగుణాతీతుడై,త్రినేత్రున్ పొందినవాడు. పరిసరములు,.బ్రాహ్మణులు అగ్రకులజులమను అపోహలో ప్రభావితముచేయుచున్న సమయమునందు, కుల వివక్షను మరచి సర్వజనులను సదాశివుడే అనుకొనుచు,శివభక్తులను త్రికరశుద్ధిగ కొలిచేవాడు.
2. యజ్ఞం అగ్నివద్ద వేదమంత్ర సహితముగా జరుగుపవిత్ర అర్చన.దేవతలకు ప్రీతిని కలిగించడం యజ్ఞలక్ష్యం.అగ్నిహోత్రమనేదియజ్ఞంలో ముఖ్యమైన అంశము. ఎటువంటి ఫలితములను ఆశించక నిస్స్వార్థముగా చేయు యజ్ఞమును శివపూజగా భావించి,సంతృప్తితో నుండెడివాడు.
3.గురువుగారైన సుందరమూర్తి యందు అనన్య సామాన్యమైన భక్తి ప్రపత్తులను కలిగియుండెడి వాడు.గురుసేవకై తిరువూరు చేరిన సోమశిర నాయనారును పరీక్షించాలనుకున్నాడు.యాగ హవిస్సును స్వీకరించమని ప్రార్థించు సోమశిర ను పరీక్షించుటకై పంచమ దంపతులుగా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు.పరమానందముతో వారిని సేవించి,హవిస్సును సమర్పణము చేసి,పులకించాడు నాయనారు.సమయము ఆసన్నమైనపుడు సద్గతి కలుగుతుందని దీవించి,అదృశ్యమయ్యారు ఆదిదంపతులు.అతిపవిత్ర మనసుతో అనుగ్రహించిన ఆదిదేవుని నిర్హేతుక కృపా కటాక్షము మనలందరిని అనుగ్రహించుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)
Comments
Post a Comment