Posts

Showing posts from March, 2025

HAPPY VISVAVASU UGADI-2025

Image
  ఉగాది శుభాకాంక్షలు.  *****************   వసుధను వసుమయం గావించు   సమయమాసన్నమయినదని  ,అరవై వత్సరముల తరువాత, అరుదెంచుచున్నావా  "విశ్వావసు వత్సరమా"         "ఆత్మీయ స్వాగతము."  గ్రహముల గుణదోషములను  ఆగ్రహానుగ్రహములను గణన   ఉన్న ఉండొచ్చును కాని,       అసలు,   అతిమెల్లగ కదులుటచే ముప్పది సంవత్సరాల   సమయము పట్టుతుంది శనికి చుట్టడానికి     పన్నెండు రాశుల చక్రాన్ని.  మెల్లగ కదులుటచే పన్నెండు సంవత్సరాల  సమయము పట్టుతుంది గురువు చుట్టడానికి     పన్నెండు రాశుల చక్రాన్ని 30:12 సంవత్సరాల కనిష్ఠ సామాన్య గుణిజమే 60 అందుకే తెలుగు సంవత్సరాలు అరవై.   ఓరుపు నేర్పిస్తాయి నేరుపుగ ఈ గ్రహములు,  , అరవై సంవత్సరములు,  జాబిలి కూతురులో లేదా నారద కుమారులో  వాటిపేర్లు ప్రభవ నుండి అక్షయ అని  వరాహమిహిరుడు అన్నాడు భృగుసంహితలో  వారించబడక కొనసాగుతున్నాయి కాల గతిలో   గురువు-శని తమ  గమనములో ప్రతికూలమో/అనుకూలమో    కదులుతూనే ఉన్నారుగా.   గుణ-దోష భూఇష్...

దూరీకర్తుం వాంఛసి-మనీష-05

దూరీకర్తుం వాంఛసి కిం-05

Image
    " బ్రహ్మైవాహమిదం జగఛ్చ సకలం చిన్మాత్ర విస్తారితం     సర్వం చైతదవిద్యయా త్రిగుణయాం శేషం  మయా కల్పితం     ఇత్థం యస్య దృడామతి సుఖతరే నిత్యే పఠేనిర్మలే     చందాలో   పద విభజనము  అహం-ఏవ-బ్రహ్మం  ఇదం జగత్-అవిద్యయ-త్రిగుణయం-శేషం  ఇదం జగత్ చిన్మాత్ర విస్తారితం  ఇదం జగత్ మయా కల్పితం  ఇదం జగత్ త్రిగుణమయం  ఇదం జగత్ అవిద్యామయం  ఇదం జగత్ శేషం బ్రహ్మం  ఇదం జగత్ బ్రహ్మం   మరియును  అహం బ్రహ్మం  అహం నిత్యం  అహం పరం  అహం నిర్మలం  అహమేవ బ్రహ్మం మయా మాత్రా/చిన్మాత్రా విస్తారితం జగం.  బ్రహ్మం స్వతంత్రం-జగం అస్వతంత్రం  బ్రహ్మం పరం-జగం ఇహం  బ్రహ్మం తనలో జగమును నిక్షిప్తము చేసుకొనినప్పటికిని స్వతంత్రముగా ఉండగలదు.కాని జగము బ్రహ్మము లేకుండా మనలేదు.   ఏ విధముగాచేతనుడు తన స్వప్నములో కొన్నిపాత్రలను-సన్నివేశములను-ప్రదేశములను కల్పించుకుంటాడో పరబ్రహ్మము తన నుండి ప్రపంచమును కల్పించి తనలో లీనము చేసుకుంటుంది.   జగత్తు బ్రహ్మ/పరబ్రహ్మ కల్పితము.స్వప్నము చేతన అవస్థాకల్పితము. ...

దూరీకర్తుం వాంఛసికిం-మనీష-04

Image
    చీమలో-బ్రహ్మలో శివకేశవాదులలో   ప్రేమమీర తెలుసుకుంటే--అన్నారు త్యాగరాజు.       ఈ విషయమునే మనీషా పంచకము,  " యా బ్రహ్మాది పిపీలకాంత తనుషు" అనికీర్తిస్తున్నది.  ఒకవిధముగా ఈ వివరనము "అహం బ్రహ్మాస్మి"అను మహావాక్య వివరనముగాను భావించవచ్చును.సూక్ష్మ-స్థూల ఉపాధిలో నిక్షిప్తముగా నుండి/సాక్షీభూతముగా నున్న పరమాత్మ ఏ విధముగా   అహం నే-నాది-నావలన-నానుండి అను పరిమిత భావనను తొలగించుకొనిన అంతయు బ్రహ్మ+అస్మి= బ్రహ్మమై యుండును.అంతే అపరిమితము నుండి పరిమితమును తొలగించుకొనగలుగుట;  నేను ఎవరు? అన్న పేశ్నకు  శరీరము+ మనసు+ఆత్మ సమాధానమనుకొనినప్పుడు దాని నుండి కాలపరిమితమైన-కాలముతో పాటుగా పరిణామములను చెందుచున్న శరీరమును లెక్కించ నప్పుడుమిగిలిన ,మిగిలిన కాలమునకులొంగని/మార్పుచెందని/నామరూపములు లేని చైతన్యమే-"బ్రహ్మము."   ఉదాహరణమునకు మనము వెలుతురులో మన శరీరమును పూర్తిగా చూసుకొనగలము.కాని చీకటిలో సైతము మన శరీరము అదేవిధముగా ఉంటుంది అన్న భావనను కోల్పోము దానిని మనము సరిగా చూడలేకపోయినప్పటికిని.దానికి కారనము అనుభవ జ్ఞానము.ఆ అనుభవజ్ఞానమే "మనీష"   ...

దూరీకర్తుం వాంఛసి కిం-04

Image
   ' జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్ఫురుతరా యా సంవితుజ్జన్యంబతే    యా బ్రహ్మాది పిపీలికాంత తనుషుప్రోత్సా జగత్సాక్షిణి    సైవాహం (స+ఏవ+అహం) న చ దృశ్యవస్త్వితి 'దృఢప్రజ్ఞాపీయస్యాస్తి చేత్    చండాలోస్తు సతు ద్విజోస్తు గురుః ఇతి "ఏషా మనీషా మమ"   ఆదిసంకరులు ఎవరు గురువో తెలియచేస్తూ అన్నమయాత్ అన్నమయం శ్లోకములో కదలలేని జడ శరీరము గురించి-కదులుటకు వీలులేనంతగ సర్వమును వ్యాపించియున్న చైతన్యమును గురించి తెలియచేసినారు.   ప్రస్తుత శ్లోకములో బ్రహ్మము మొదలు చీమ వరకు అంతర్యామిగా నుండినప్పటికిని,వాటి మూడు అవస్థలతో ఏ మాత్రము ప్రభావితముకాని పరమాత్మ ప్రకాశమును కీర్తిస్తున్నారు.   పద విభజనము  సం విత్ జృంభతే-జాగృత్-స్వప్న-సుషుప్తి  సం విత్-యా -ప్రోతా-బ్రహ్మ-ఆది-పిపీలికాంత-తనుషు  సాక్షిణీ (అయినప్పటికినీ)  స ఏవ యో-వస్తు ఇతి న చ దృశ్య  అపి దృద్థ ప్రజ్ఞ న చ దృశ్య  వస్తు ఇతి (వస్తువుగా ఎంత ప్రజ్ఞావంతునికైనను కానరానిది)  యంప్రోతా-అది మనలోవిడదీయరానిదిగా ఉన్నప్పటికిని  వస్తుఇతి న చ దృశ్యా-వస్తువు వలె కానరానిది.(అవిభాజ్యము) ...

దూరీకర్తుం వాంఛసి కిం-మనీష-03

Image
   " మనసు ఎగురుతున్నదో    హాయిని వెతుకుతున్నదో    బ్రతుకు నైజం ఎరుగ రానిదై    అల-అల-అల-అల   ఆ అలలన్నీ కడలికి పైపైనేగా   లోపల ఉండే చేపను వల చేరలేదుగా   ఆశలు మొత్తం మనసుకు పైపైనేగా   గుండెల్లోన  ఆనంద తాండవమేగా   అది తెలిసిందంటే ఆనందం నీదే (ఇష)   నిజమునకు ఉపాధులు అన్ని పడిలేచే కెరటములు.దేనినో అందుకోవాలంటూ తనమూలమును గుర్తించక పరుగులు తీస్తుంటాయి.   అది మనసు స్వభావము.  పుడుతది చేపలాగ  ఆశ    ఆ ఆశ  తిమింగలమవుతుందిర ఈశ   విచిత్రం  తిమింగలం  నీ వలలో పడినా  నువు మళ్ళీ చేపకేసి చూస్తావుర      చేప-జన్మ పరంపర     తిమింగలము-మోక్షము    పరమాత్మ నీకు మోక్షప్రాప్తి /తురీయమును అందించాలనుకుంటే కూడ ఓ మనసా నీవు జన్మలనే కోరుకుంటుంటావు.    అలలతో పడిలేచే సముద్రమే అందమైనదని భ్రమపడతావు.అలల రూపమును చూస్తూ మురిసిపోతావు కాని వానిలో దాగియున్న అంతర్యామి జలమును చూడలేవు.  ఉపాధి భేదములను గమనిస్తూ వానిలోని చైతన్యమును చూడలేక పోతున్నావు.   " "...

దూరీకర్తుం వాంఛసి కిం-03

Image
    "కిం గంగాబుంధి బింబితే అంబర మణౌ చాండాలవీధీ పయః    పూరేవమంతర్మస్తి కాంచనఘటీ మృత్కుంభయోవ2హ్ అంబరే    ప్రత్యక్ వస్తుని నిస్తరంగ సహజానంద అవబోధాంబుధౌ    విప్రోయం శ్వపచోయం ఇత్యపి మహాన్ "కోయం" విభేద భ్రమః."   పద విభజన     అంబరమణి-బింబితే గంగాంబుధి     అంబరమణి బింబితే చాండాల వీధీ పయః  అంబర మణి -సూర్యబింబము.   ఇక్కడ సూర్యునికి శుభ్ర-అశుభ్ర వ్యత్యాసములు లేవు.కనుకనే తన కిరనములను శుభ్రమైన గంగాజలములపై వ్యాపింపచేసినను,   అశుభ్రముగానున్నఛండాల వీధిజలములో వ్యాపింపచేసినను వాటి స్థితిచే ఏ మాత్రమును ప్రభావితము కావు.       అంబర పదమునకు ఆకాశమునకు అన్వయించుకుంటే ఆకాశము యొక్క ప్రతిబింబము మట్టికుండ యందైనాను/స్వర్ణకుంభమునందైనను వాటి లోహ ప్రభావమును స్వీకరించక ఒకే విధముగా ఉన్నట్లుగా పరమాత్మ చైతన్యము పరిమితముగా మారినప్పట్కిని అది అపరిమితమే.   మృత్ కుంభము-మట్టికుండ    పాత్రలలోనికి ప్రవేశించిన జలము పరిశుద్ధము.పాత్రలు జలమును ప్రభావితము చేయలేదు.  సూర్యకిరణములు-జలము చైతన్యమునకు ప్రతీకలుగాను,  ...

దూరీం కర్తుం వాంఛసి కిం-మనీష-02

Image
 " అన్నమయాత్ అనమయం అథవా చైతన్యమేవ చైతన్యాత్    "ద్విజవర" దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛేతి"      అన్నది  పాఠము.  అన్నమయ-చైతన్యమయ/దృక్-దృశ్య వివేక సముపార్జనము పాఠ ఉద్దేశ్యము.  1.అన్నమయాత్ అన్నమయం   అద్ అను ధాతువు నుండి జనించిన పదము అన్నము.   మనము తినునది /మనలను తినునది.మయాత్-విభజింపబడి ఉండి ప్రకాశించునది.   భగవద్గీత సైతము పరమాత్మను ' అన్నమన్నాద ఏవచ " అని కీర్తిస్తుంది.అన్నము/అన్నమును భుజించువాడు ఆ చైతన్య స్వరూపుడు.  అద్ ధాతువు నుండి పరిణామము చెందిన అద్యతే అను పదము తినుట అను క్రియా సూచకమైతే,  అన్నము నుండి పుట్టి,  అన్నముతో పెరిగి,  అన్నములో లీనము చెందు ఉపాధి అన్నమయ శరీరము/క్షేత్రము.       ఉపాధులు ఆకారములలో,వృత్తులలో,వేషభాషలలో,ఆహార వ్యవహారములలో భిన్నముగా కనపడుతుంటాయి.  ఈవిషయమునే రుద్ర చమకము,  "కృష్ట పచ్యంచమే-అకృష్ట పచ్యంచమే ' అంటూ దున్న్న క్షత్రము/దున్నని క్షేత్రము అంటు సంకేతిస్తాయి.అజ్ఞానమనే కలుపును తీసివేస్తే క్షత్రజ్ఞుడు కనపడతాడు/వినబడతాడు.  కాని స్థితి స్వానుభవముతో తెలుసుకోవ...

దూరీకర్తుం వాంఛసి కిం?-02-MANISHA PAMCHAKAM-02

Image
 " అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యం ఏవ చైతన్యాత్   'ద్విజవర! "దూరీకర్తుం వాంఛసి కిం ? బ్రూహి గఛ్చేతి."   పద విభజనము  కిం/-ఎందులకు  గఛ్చేతి బ్రూహి-తొలగమని పలుకుచున్నావు?  కిం-ఎందులకు/దేనిని  వాంఛసి-దేనినికోరుకుని  గఛ్చేతి బ్రూహి/-దేనినికోరుకుని నన్ను తొలగుమంటున్నావు?  నీవు సామాన్యుడివికాదు  ద్విజులలో శ్రేష్ఠుడివి/ద్విజవర    కింబ్రూహి గఛ్చేతి-ఎందుకు తొలగుమంటున్నావు నన్ను.   నేను ఛండాలుడుని.కనుక ఒక సందేహము.   అథవా -నేను తొలుగుదామని అనుకున్నానే అనుకో,అప్పుడు  ఏవ గచ్ఛతి దేనిని తొలగించాలి నేను  1.ఏవ అన్నమయ-అన్నమయ ఉపాధిని తొలగించమంటావా/        లేక  2.ఏవ చైతన్య మయ -ఉపాధిలో దాగియున్న ఉనికిని తొలగుమంటున్నావా?   కిం గఛ్చేతి బ్రూహి?    సర్వం  శివమయం జగత్.  ఏక బిల్వం శివార్పణం.

దూరీకర్తుం వాంఛసి కిం-మనీష-01

Image
  "సత్యాచార్యస్య గమనే 'కదాచిత్" ముక్తిదాయకం   కాశీక్షేత్రం ప్రతి సహ గౌర్యా మార్గేతు శంకరం."   ఇది పాఠము.  ద్వంద్వము నిర్ద్వందమని గ్రహించగలుగుట మనీషా.   పై  వాక్యములలోని పదములు,  1.గౌరీశంకరులు  2.కాశీక్షేత్రము  మనము విచారణను,"ఆచారస్య/సత్యాచార్యస్య" అన్న పదముతో ప్రారంభిద్దాము.  ఒకరు కాలడి శంకరులు-ఆచారస్య  ఒకరు ఉపాధి-మరొకరు ఉనికి  ఒకరు ద్వైతి-మరొకరు అద్వైతి  ఒకరు ప్రకటిత చండాలుడు-మరొకరు పండిత బ్రాహ్మణుడు    ఇద్దరు శంకర నామముతోవ్యవహరింపబడుతున్నారు. 2.కాశీ క్షేత్రము      రెండును ప్రకాశ సంకేతములే అయినప్పటికిని   ఒకటి క్షత్రము-మరొకటి హృదయము   ఒకటి ఉపాధినీనుగ్రహించునది -మరొకటి ఉనికిని అర్థముచేయించునది     3.కదాచిత్      ఒకానొకప్పుడు-కాలమునకు ప్రతీక  ఒకటి శాశ్వతము-మరొకటి అశాశ్వతము  ఒకటి భ్రమణము-మరొకటి నిశ్చలము/అమరము  4.మార్గము-ప్రతిమార్గము     గమ్యమునకు చేర్చు గమనమును అనుసంధానము చేయునది.   ఒకటి కాశీక్షేత్ర వీధి మార్గము-మరొకటి పరమాత్మను అం...

దూరీకర్తుం వాంఛసి కిం.-01

Image
   "సత్యాచార్యస్య గమనే 'కదాచిత్" ముక్తిదాయకం   కాశీక్షేత్రం ప్రతి సహ గౌర్యా మార్గేతు శంకరం."   పద విభజనము   కదాచిత్-ఒకసారి,ముక్తిదాయకం+కాశీక్షత్రం-అవిముక్తమైన /మోక్షపురి యైన కాశీక్షత్ర,   మార్గే-వీధులలోని మార్గము నందు,(పరిమిత ఆలోచనలు/అవగాహనము కల హృదయక్షత్ర /మనస్సు యొక్క ఆలోచనలకు   'శం"  కరోతి ఇతి శంకరం శుభములను చేకూర్చే విలక్షణనామము కల శంకరుడు     సహగౌర్యా-గౌరీదేవినితో కూడి (ప్రకాశము/తెలుపువర్ణము-శుద్ధసత్వమును)    ప్రతి-ఎదురుపడ్దాడు   మన జగద్గురువులకు.

దూరీకర్తుం వాంఛసి కిం? మనీషా పంచకం-ఉపోద్ఘాతము

Image
    " బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే     తందనాన భళా తందనాన"     పరమాత్మ తత్త్వమును ప్రపంచమునకు సులభముగా అర్థమగుటకు/ఆనందించుటకు సులభమార్గముగా అనుగ్రహించిన పరమేశ్వర లీలా విశేషమే 'మనీషా పంచకమను" స్తోత్ర రాజము.    ఈ స్తోత్ర ఆవిర్భావమునకు కాశీక్షత్రము లోని మార్గము వేదికగా మారినది వాచ్యపరముగా.     కాశీపంచక స్తోత్రములో తెలియచేసినట్లు శరీరమనే కాశిలో/ప్రకాశమునకు అడ్డుగా నున్న చీకట్లు తొలగించబడినవి స్తోత్ర ఫలితముగా. ద్    జీవాత్మ-పరమాత్మ సంవాదము ఏ  మాత్రము వివాదములేని చిత్సత్ వివరణము.  సకల జీవులకు సంకేతముగా జగద్గురువులు-సకల జీవులకు సంస్కరణముగా జగత్పాలకుల మధ్యన జరిగిన సంభాషణా చాతుర్యము.  " నమశ్శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః " రుద్రనమకము.  విలాసముగా వివిధరూపములను ధరించు విశ్వేశ్వరుడు ,  శ్వభ్యః-కుక్కలరూపముగాను,  స్వపతిభ్యః-కుక్కలపాలకుని రూపముగాను,సర్వమంగళతో,నాలుగు కుక్కలను నడిపిస్తూ,క్షత్రపాలకుడైన కాలభైరవుని సంకేతిస్తూ,సాక్షాత్కరించాడు కాశీవీధుల మార్గములో.   అవి బాహ్యమునకు/ఆంతర్యమునకు చాలా ఇరుకుగా కనిపిం...

ASYA ASTI ITIKASI @ KASIPAMCHAKAM GURUBODHA-05

Image
    " కలిగినదిదియె కాశీయోగము    కలనైనను బాయని ఘనశివయోగము    వేలతీర్థములు విదితోత్సవములు    శూలి నగరిలో కోలాహలములు     సతతము గంగా స్నానపుభాగ్యము     వ్రతముగ విశ్వేశ్వర సమార్చనము."   జగద్గురు  ఆదిశంకర "కాశీ పంచక" స్తోత్రము లోని మొదటి శ్లోకము మానవ ఆలోచనలైన వృత్తుల  రాకపోకల గురించి కాశీదర్శన భాగ్యమును పొందాలంటే  మనోనివృత్తి ఎంత ఆవశ్యకమో తెలియచేసింది.    రెండవ శ్లోకము ఆలోచనలకు కారణమైన ఇంద్రియములగ్యురించి-ఇంద్రజాలము గురించివివరించినది.    మూడవశ్లోకము  పంచకోశ గేహములో ప్రకృతిరూపముగా ప్రకాశించుచున్న భవానీ తత్త్వమును బోధపరచినది.    నాల్గవ శ్లోకము సాకాశికాహం అంటూ కాశిలో ఇండియున్న కాశికను  చూపిస్తూ తురీయము యొక్క ఉన్నతత్త్వమును కన్నులకు కట్టినట్లు చూపిస్తూ,చేతనుని,   కరువుతీరగ కాశీ వీధులలో హరహర యనుచు తిరిగెడి సౌఖ్యమును ప్రసాదిస్తుంది.     అంతేకాదు,  నిలకడగ  ఇది  నిత్యనివాసము అని గ్రహింపచేస్తుంది.మరుక్షణము నుండి,   చేతనుని శరీరము కాశీక్షత్రముగ...

ASYA ASTI ITIKASI @ KASIPAMCHAKAMNIJABODHA 05

Image
   కాశీక్షేత్రం  శరీరం  త్రిభువన జనని వ్యాపినీ జ్ఞానగంగా  భక్తిశ్రధ్ధః గయేయం నిజగురుచరణ ధ్యానయోగః ప్రయాగః  విశ్వేశోయం తురీయం సకల జనమనః సాక్షి భూతోంతరాత్మా  దేహే సర్వం మదీయే  యదివసతి పునః తీర్థమన్యత్కిమస్తి.   పదవిభజన     మదీయే  దేహే సర్వం     మదీయే  దేవే కాశీక్షత్రం     మదీయే దేహే జ్ఞానగంగా     మదీయేదేహే  గయ     మదీయే  దేహే  ప్రయాగ     మదీయే  దేహే విశ్వేశః     మదీయే  దేహే సాక్షిభూత              యది-ఏది/వసతి-ఉన్నదో అదే తురీయమైనది.శాశ్వతానందమునుఇచ్చునది.    ఆవిషయము నేనూర్థముచేసుకున్నప్పుడు నేను దర్శించుకోవలసిన  తీర్థము  అన్యత్-వేరుగా   కిం-ఏది/అస్తి-ఉన్నది   అంతర్భావనలో నేను కాశీక్షత్రమునే దేహముగా భావిస్తూ గంగాతీర్థము అను జ్ఞానములో ప్రవహిస్తూ,భక్తిశ్రద్ధలను గయాక్షత్రమున నివసిస్తూ,గురుచరణ ధ్యానమను గురుపాదములందు  అంతర్లీనముగా  నాబుద్ధిని మేళవిస్తూ విశ్వేశ్వరుని సాక...

ASYA ASTI ITIKASI @ KASIPAMCHAKAM-05

Image
   "  కాశీక్షత్రం  శరీరం త్రిభువన జనని వ్యాపినీ జ్ఞానగంగా   భక్తిః శ్రధ్ధా గయేయం నిజగురుచరణ ధ్యానయోగ ప్రయాగః   విశ్వేశోయం తురీయం సకలజన మనఃసాక్షిభూతోంతరాత్మా   దేహే సర్వం  మదీయే యది వసతి పునః తీర్థ మన్యత్కిమస్తి".    పదములవిభజన   సరీరం-కాశీక్షత్రం   జ్ఞానం-గంగా (వ్యాపినీ)   భక్తి+శ్రద్ధ-గయ అహం   గురుచరణ ధ్యానం-ప్రయాహ   ఇయం విశ్వేశ-తురీయం   మనఃసాక్షి-అంతరాత్మ   మదీయ దేహే వసతి-సర్వం   పునః-తిరిగి     నానుండి వేరుగా /పవిత్ర తీర్థముగా   అస్తి-కిం -ఏదిఉన్నది.    నా శరీరముకాశీక్షత్రముగా భాసించుచున్నది.అందులకు కారనము పవిత్ర గంగానది నా జ్ఞానముగా ప్రవహించుచున్నది. అందువలన నాలోని భక్తిశ్రద్ధలు గయ క్షత్రముగా పరిణితిని పొందినవి.నా శరీరమనే క్షత్రములో విశ్వేశ్వరుడు ఆత్మగా/అంతరాత్మగా ప్రకాశిస్తున్నాడు.అందువలన నాబుద్ధి ప్రచోనమై గురుపాదానురక్తి/గురుపాదభక్తి ప్రయాగ క్షేత్రముగా పవిత్రమొనరించుచున్నది.నేను కాశిగా ప్రకాశించుచున్న వేళ తిరిగి తిరిగి దర్శించవలసిన బాహ్య తీర్థములేమున్నవి.నా ...

ASYA ASTI ITI KASI @NIJABODHA-04

Image
   " గత సంగస్య ముక్తస్య జ్ఞానవస్థిత చేతసః    యజ్ఞాయా చరితః కర్మ సమగ్రం ప్రవిలీయతే"     దేహాభిమానము -మమకారము ఏ మాత్రము లేనివాడు ప్రకాశమనే పరమాత్మ జ్ఞానము నందే మనసును లగ్నముచేయగలడు.తత్ఫలితముగా కర్మఫలితముల విముక్తుడై కాశిగా ప్రకాశించగలడు.  "నమాంకర్మాణి లింపతే-కర్మలు-కర్మఫలితములు నన్ను తాకవు" చేతనుడు,    అట్టిస్థితిని చేరాలంటే,  ఏది చూసినను-విన్నను-మనసునకు పట్టించుకొనక-వాటిని ఒకదానితో ఒకటి కలువనీయక ,  ఉదాహరణమునకు,   ఒకమాటను(నచ్చను) చెవి వినిపించినది.వెంటనే మన నోటితో వారికి బదులీయకౌండా నియంత్రించుట,   ఒక కన్ను ఏదో సుందర దృశ్యమును చూపించినది-వెంటనే మోహముతో దానిని స్పృశించకుండా,    ఇంద్రియ సంయమనములను చూస్తున్న రూపములను నిగ్రహ యజ్ఞమునందు ఆహుతి చేయుటమొదటి స్థితి.    ఇంద్రియ ప్రలోభమునకు కారణమగుచున్న విషయములను నిశ్చల  యజ్ఞమునందు కారణములను ఆహుతిచేయుట రెండవస్థితి.  శబ్దాదివిషయములు ఎదురుగా ఉన్నప్పటికిని లేనప్పటికిని వాటివలన ప్రభావితుడు కాని చేతనులు కర్మలను చేస్తున్నప్పటికిని,  న కర్తృత్వం న కర్మాణి లోక...

ASYA ASTI ITI KASI @ KASIPAMCHAKAM-04

Image
     కాశ్యాహి  కాశ్యత కాశీ సర్వప్రకాశికా  సా కాశీ విదితాయేన  తేన  ప్రాప్తాహి కాశికా".   పదవిభజన   అహికాశ్యా-అహి  కాశ్యతా-అహి   సర్వప్రకాశికా   కాశ్యత కాశి   స్వభావము.కాశి  కాశ్యత  నామము    తేన-ఈవిషయమును  యేన-ఎవరు    విదిత-గ్రహింతురో  వారికి   కాశిగా  నేను/ప్రకాశముగా  నేను ప్రాప్తిస్తాను/లభిస్తాను.   కాశి కాశి నామముతో  క్షేత్రముగాను,ప్రకాశ అంతర్యామిగా జీవునిలోను సాఉన్నది ప్రకాశముగా.అటువంటి కాశి స్వరూప స్వభావములను తెలుసుకొనినవాడు కాశిగా మారును.       చేతనుడు కాశిని చూడవలెనన్న తెలుసుకొనవలెనన్న ,  'కర్మణ్యోపి బోద్ధవ్యం   బోద్ధవ్యంచ వికర్మణః   అకర్మణశ్చ బోధవ్యం   గహనా కర్మణో గతిః"  కర్మయందు అకర్మను,అకర్మయందుకర్మను దర్శించు స్థితికి రావలెను.    ఎందుకంటే కర్మలు  1.కామ సంబంధములు  2.జ్ఞాన సంబంధములుగా భావిస్తే    ఇంద్రియ ప్రేరితమైన కామసంబంధ కర్మలు బంధములను అందిస్తేర్,ఇంద్రియ ప్రేపితములు కాన...

ASYA ASTI ITI KASI @KASIPAMCHAKAM TATVABODHA-03

Image
    "విశ్వేశేయం తురీయః    సకలజన  మనస్సాక్షి భూతోంతరాత్మ"     భూతము  అనగా ఉన్నది/కనులకు కనబడుతున్నది.నింగి-నేల-నీరు-నిప్పు-గాలి అనుపంచభూతములుగా  విశ్వములో/జీవునిలో నిండియున్నవి.నిజమునకు అవిచేతములుగా  అనిపించే అచేతనములు.వానిలో దాగిన చిత్శక్తి వాటిని చైతన్యవంతముచేస్తుంది.కాని కొంతకాలము మాత్రమే.ఆ కొంతకాలములో  జీవిస్తున్న శరీరములు కోశములు అను నామముతో ఐదు విభాగములుగా /తొడుగులుగా  ఉండి  జీవులచే ఐదు తప్పులను/ఒప్పులుగా  భావింపచేస్తుంటాయి.    కానివిచిత్రము వానిలో పరిమితముగా-పరిమిత కాలము సంచరిస్తున్నప్పటికిని వాని ప్రభావమునకు లోనుగాక సత్+చిత్ శక్తివాటిచర్యలను గమనిస్తున్నప్పటికిని వాటి కర్మలను-కర్మఫలితములను పట్టించుకోదు.కనుకనే  సాక్షీభూతము అని కీర్తింపబడుచున్నది.       " ఆట కదద్వైతంబు-ఆట  అద్వైతంబు       ఒకటి-రెండు ఒకటే-ఆటనీకు.(తనికెళ్ళ భరణిగారు)   పంచకోశములుగా నిర్మితమైన ఐదు తొడుగులు చీకటిలో  నుండి తమను చేతనులుగా భావింపచేస్తున్న చిత్ప్రకాశమును కాంచలేవు. 1.మొదటిదైన అన్నమ...

ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAM-03

Image
      "కోశేషు పంచ్ర్హస్వధిరాజమానా   బుద్ధిర్భవానీ ప్రతి దేహ గేహం   సాక్షీ శివః సర్వగతోంతరాత్మా   సా కాశికాం నిజబోధరూపా."  పదవిభజనము   ప్రతి దేహగేహం-ప్రతి దేహమనే ఇంటిలో   కోశేషు పంచః- అన్నమయ-ప్రాణమయ-మనోమయ-విజ్ఞానమయ-    ఆనందమయ అని ఐదు ప్రత్యేక స్వభావములు గల తొడుగులలో    అదిరాజ మాన-విరాజమానమై యుండియును   వానిచర్యలను గమనిస్తున్నప్పటికిని   సాక్షీ శివః-వాటిని పట్టించుకోకుండా   సాక్షిగా చూస్తున్న శివుడే/ ఆ ప్రకాశమే తత్త్వబోధను తెలియచేయుచున్న ప్రకాశము.    పరమాత్మ కర్తృత్వము-భోక్త్వత్తమును ద్ధ్తానేనిర్వహ్పిస్తున్నప్పటికిని  రెండుగా ప్రకటితమగుచున్నాడు.ఒక్కదానిని అర్థముచేసుకొనుటకు రెండు స్వరూప-స్వభావములు సహాయపడుతుంటాయి.   అవే, 1. భవాని-దేహము-----భవుడు   ఆత్మ 2.భవాని-జీవాత్మ-భవుడు-పరమాత్మ 3.భవాని-విభాజ్యము (పంచకోశములు-పంచేంద్రియములు-పంచతన్మాత్రలు -భవుడు-అవిభాజ్యము 4.భవాని-సగుణము-భవుడు నిర్గుణము 5.భవాని-సాకారము-భవుడు నిరాకారము 6.భవాని-ఇంద్రియసహితము-భవుడు ఇంద్రియ రహితము 7.భవాని క్షత్రము...

ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAM NIJABODHA-02

Image
     జగద్గురువులు కాశీపంచక స్తోత్ర రెండవ శ్లోకమును "యస్యాం ఇదం కల్పితం" అంటూ ప్రారంభించి నిజబోధరూపా అంటూ ముగించారు.    ఈ కల్పితములో దాగి ప్రకాశిస్తున్నది సత్+చిత్ రూపము.శాశ్వతమైన తాను అంతర్యామిగా ఉన్నట్లుగా మనము భావించనీయనిది మన మనస్సు.అది లేనిదానిని ఉన్నట్లుగా/ఉన్నదానిని లేనట్ల్యుగా మనలను భ్రమింపచేస్తుంది.అదేకాదా "ఇంద్రజాలం"    లేని నీరు ఉన్నట్లుగా ఎడారిలోనిమృగతృష్ణ ,తిరుగుచున్న భూమి నిశ్చలముగా నున్నట్లు,సూర్యుడు ఉదయాస్త్తమయములు చేస్తున్నట్లు,కేవలము శరీరమే "నేను" అని అనుకునేలా చేస్తుంది ఆ ఇంద్రజాలం.       ఇంద్రియాతీతము/ఇంద్రియాధీనము అను రెండు అంసములను గమనిస్తేజీవులు/వారి మనోభావములుఇంద్రియాధీనములు.వారు కాశిని క్షేత్రముగా మాత్రమే భావించగలరు కాని తమ హృదయ స్థానముగా గమనించలేరు.గంగను తీర్థముగాను దేవతామూర్తులను మాత్రమే దర్శించగలరు కాని వానిలో దాగి ప్రకాశిస్తున్న పరమాత్మను " ఏకం సత్" గా భావించలేరు.నేను-నీవు అనే ద్వంద్వములకు బందీలు వారు.  పంచభూతములకు-పంచేంద్రియమూలకు సైతము  గల    అవినాభావ సంబంధము ప్రపంచముగా ఉన్నట్లుంటుంది. ...

ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAM-02

Image
  " యస్యామిదం కల్పితమింద్రజాలం   చరాచరం భాతి మనోవిలాసం   సచ్చిత్ సుఖైకా పరమాత్మరూపా   సాకాశికాహం నిజబోధరూపా."  పద విభజన  యస్యాం-ఇదం-కల్పితం+ఇంద్రజాలం+ భాతి+చరాచరం_ మనోవిలాసం+ పరమాత్మరూపా+సుఖ=ఏక సత్+చిత్+అహం+స+కాశికా+రూపా+నిజబోధ.  " ఎవ్వనిచే జనించు,జగమెవ్వని లోపలనుండు " అన్నారు మహాకవి పోతన.ఎందుకు పరమాత్మను ఎవ్వడు అన్నాడో ఆలోచిస్తే అపరిమిత మూలశక్తికి పరిమిత నామరూపములతో సంబోధించలేము కనుక."  దిక్కెవ్వరు ప్రహ్లాదుకు?దిక్కెవ్వరు పాండు సుతకు? దీనులకెపుడున్,  ఆనిర్వచనీయ పరమాత్మ ఇంద్రజాల ప్రసక్తి/ప్రశస్తియే ప్రస్తుత శ్లోకము.  యస్యాం ఇదం-ఇద్గా/దీనిగా/ప్రపంచముగా చెప్పబడుతున్న చరాచరము   స+ పరమాత్త్మ= ప్రపంచము. ఈ ప్రపంచము, 1.యస్యాం సః ఇదం పరమాత్మ నిర్మితం 2.యస్యాం సః ఇదం చరాచరమయం 3.యస్యాం సః ఇదం మనోవిలాస కల్పితం 4. యస్యాం సః ఇదం (భాతి)ప్రకాశం 5. యస్యాం ఇదం సః కాశికా నామం 6.యస్యాం సః ఇదం తత్త్వ బోధా రూపం 7. యస్యాం సః సత్+చిత్  ఇంద్రజాలం.   జగద్గురువులు మొదటి శ్లోకములో జీవుల మనో ప్రవృత్తి-నివృత్తుల ఫలితములను విశ్లేషించిన తదుపరి,ప్రస...

ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAMU -NIJABOEDHA-01

Image
   జగద్గురువులు "కాశీపంచక" స్తోత్ర రాజమును మనోనివృత్తిః అంటూ  ప్రారంభించి,కిం అస్తి అనిపూర్తిచేశారు.ఇదే విషయమును శ్రీకృష్ణభగవానుడు సైతము "శ్రీమద్భగవద్గీట"లో చివరిదైనమోక్ష సన్యాస యోగములో,  " ప్రవృత్తించ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే    బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః"     అంటూ సకల చరాచర బంధ-మోక్షములకు కారణము వారి మానసిక ఆలోచనల ప్రవేశము-నిష్క్రమణము (ప్రవృత్తి-నివృత్తుల) పేరిట చేయున్న వింతాసములు.   ప్రవృత్తులు అసత్తులో దాగియున్న సత్తును చూడనీయదు.దానికి కారనమును గుణత్రయవిభాగ యోగము  ' అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహమేవచ,తమస్యేతాని జాయంతే'  చీకటితోనున్న మనసులో ప్రవృత్తులు చేరి ప్రమాదకరమైన మోహమును కలిగిస్తూ,ప్రకాశమును చూడనీయవు.   ఆ చీకటి తొలిగించేందుకు ,వెలుతురునుచూపించేందుకు ఒక సహాయము కావాలి.ఆ సహాయము స్వఛ్చమైనదిగా-సారవంతమైనదిగా ఉండాలి.అదియే తీర్థరాజమైన జ్ఞానగంగా ప్రవాహము. ఆ ప్రవాహము నిన్ను మణికర్ణిక శ్రవనభాగ్యమునందించునదైన-శత్రువులను దహించగలిగినదైన మణికర్ణిక నుచేర్చుతుంది.  ఇదిమొదటి మజిలీ.  ఆ మణికర్ణిక మనచీకట్లను త...

ASYA ASTI ITI KASI@ KASI PAMCHAKAM-01

Image
 " మనో నివృత్తిః పరమోపశాంతిః సా తీర్థవర్యా మణికర్ణికాచ    జ్ఞాన ప్రవాహా విమలాది గంగా సా కాశీకాచ నిజబోధరూపా"    పదవిభజనము    మనోనివృత్తి-పరమ-ఉపశాంతి-సా-తీర్థవర్యా-మణికర్ణికాచ-జ్ఞానప్రవాహ-విమలాది గంగా-నిజబోధ రూపాచ-సా కాశికా.      సా-దేనినైతే ఇది అని వర్ణించలేమో/ఏదైతే నామరూపములు లేనిదానిగా    కాశికా-కాశ/ప్రకాశ స్వభావముతో నున్నదో     అది- ఆ మూలపదార్థము  నిజబోధ రూపా-తన గురించి మన బుద్ధికి తెలియచేసే స్వభావముతో ఉన్నది.  ప్రకాశము దాని రూపము  ప్రబోధము దానిలక్షణము.ప్రవాహ రూపముగా  ప్రకటనమగుచు జ్ఞానమును  ప్రబోధనము  చేయుట దాని  ప్రత్యేకత. చూడగలిగిన ఒక పుణ్య   క్షేత్రము  చూపిస్తూ అందులో సాక్షిగా నున్న మూలపదార్థమును దర్శింపచేయుట దాని ధ్యేయము.     ఆ బోధనము ఐదు ప్రయోజనములను జీవులకు కలిగిస్తున్నది.  1.మనో నివృత్తి  2.ఉపశమనము  3.మణికర్ణిక గట్టు పరిచయము  4.ఉపశమనము  5.ఆత్మబోధనము.         బాహ్యమునకు కాశీపట్తనము మానసిక అలజడులను తగ్గిస్తు...

ASYA ASTI ITI KAASI @ KAASI PAMCHAKAM

Image
     ఓం నమః శివాయ   **********  " దేహో దేవాలయః ప్రోక్తో సనాతనః    త్యజేద జ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్"          (లక్ష్మీనారయణ సంహిత)    ఇదే వ్షయమును సులభశైలిలో కాశిపట్టనముతో పోలుస్తూ,పుణ్యక్షత్రముగా/పరమాత్మ నివాసముగా సమీక్షిస్తూ, జగద్గురు  ఆదిశంకరులు "కాశీ పంచకము" అను శీర్షికతో మనలను అనుగ్రహించారు.    ప్ర+ఉక్తః-ప్రకృష్టముగా చెప్పుచున్నది    సనాతనము ఏమని?   సః+అహం -పరమాత్మగానేనే నీదేహములోఉన్నాను అన్న సత్యమును.ఆవిషయం అర్థమయితేనే జీవుడు సోహం/అద్వైత భావముతో పరమాత్మను గమనించగలడు/దర్శించగలడు/సంస్కరింపబడగలడు.    కాని ఆ స్థితిని చేరనీయకుండా ఒక అవరోధము,అదే  దేహమేనేను అన్న భ్రాంతి హృదయము నిండా యుండి,  నేను దేహము కాదు-నాలో దాగి యున్న పరమాత్మయే నేను అన్న భావన కలగాలంటే ,ఏమి చేయాలో కూడా చెబుతోంది శ్లోకము.    నీ మనసులోఇన్నాళ్ళు నిలిచియున్న భావనలనే అజ్ఞానమును  త్యజేద-విడిచిపెట్టు.తత్ఫలితముగా క్నానము,ప్రకాశము,దైవము నీకు దర్శనమిస్తుంది.   ఐదు శ్లోకములతో ఆవిషకర...

FALASRUTI@ SIVATANDAVA STOTRAMU@ SIVATANDAVASTOTRAMU

Image
     స్తోత్ర పథనము-స్మరణము-లేఖనము అసేషఫలప్రదము.  "శివతాండ స్తోత్రము" అందులకు మినహాయింపు కాదు.   నర్మగర్భముగా దశవక్త్రగీతం అని ప్రస్తావించారు.పది ఇంద్రియముల ప్రార్థనమే పది నాలుకల ప్రార్థనము.  ఇంద్రియములను జయించినవారలు ఈ "శివతాందవ స్తోత్రము"ను పఠించిన/ధ్యానించిన వారికి "స్థిరముగా" రథములు-గజములు-తురగములు కూడియున్న లక్ష్మీదేవి సుముఖత్వముతో బహుప్రీతితో శంభుని ఆనగా దదాతి -ఇస్తుంది-ప్ర దదాతి-విశేషముగా ఇస్తుంది.  ఇది కథను అనుసరించి.      ఛందస్సు గురించి ఒక్క సారిప్రస్తావించుకుందాము.అతిముఖ్యమైన  "పంచ చామరవృత్తము"పదహారు అక్షరములు"పదహారుకళలు.పదహారు ఉపచారములు."  ఒక లఘువు+ఒక గురువు   శివశక్తులు-జీవుడు+దేవుడు+ వరము+ప్రదానము  పునరపి+పునరావృత్తి రహితము.    ఆ గురులఘువులలోని ఆంతర్యము.  ఇక్కడ స్థిరనివాసము చేసుకొన వలసిన గుఋఋఅములు-ఏనుగులు-రథము మనముచూసేవి కాదు.ఇవిసంకేతములు.ఇదేవిషయము "శ్రీసూక్తము"లో సైతము ప్రస్తావించబడినది.  "అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం" అంటూ.    స్థిరముగా మనహృదయమనే రథములో లక్...

TANOTU NAH SIVAH SIVAM@ SIVATANDAVA STOTRAM

Image
    వారిఎదలోశంభుదేవుడుప్రకాశించునునిరతము   వారిపలుకు శైవమంత్రము పరవశమ్మునమ్రోగును   వారె శంకరచరణ దాసులు వారి  దీవెన చాలును   కథానుసారముగా సమదృష్టినిపొంది సుఖమైన మనసుతో శంకరభజనమును చేయగలిగిన రావణునికి ఆ తారక మంత్రమును పదిమందికీందచేయాలనే న= అన్యథా గతి అని   'ఇమం హి నిత్యమేవ ముక్త ముక్తమోత్తమం   పథన్ స్మరన్ బ్రువన్నరోవిశుద్ధిమేతి సంతతం   హరే గురౌ సుభక్తిమాశు యాతి "నాన్యథాగతిం"   విమోహనం విదేహినాం "శు శంకరస్య"చింతనం   పూజావసాన సమయేదశవక్త్రగీతం    తస్యస్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాం   లక్ష్మీ సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః   శివ అంటే చైతన్యం-ప్రాణం-స్పందన-శుభం-మంగళం.శివ తాందవం అంటే ప్రాణస్పందనకు ప్రతిరూపం.   ఆ తాండవంతిలకించుటకై ప్రకృతి వేయికన్నులతోఎదురుచూస్తు రంగం  సిద్ధం చేసుకుంటుంది.గాలులు పిలకింతలతో చల్లగావీవెనలు వీస్తుంటాయి.ఆకాశం బంగరువర్ణంపులుముకుని గుడుగుగుగా మారి స్వామిని సేవిస్తుంటుంది.పక్షుల కిలకిలలు వేదనాదము చేస్తుంటాయి.తుమ్మెద ఝంకారము సన్నాయినూదుతుంటుంది.గంగమ్మ వేదికను పునీతము చేస్తుంటుంది.నాగు...

TANOTU NAH SIVAH SIVAM=26@SIVATANDAVASTOTRAMU

Image
      "వాగర్థావివసంవృక్తౌ  వాగర్థప్రతిపత్తయే   జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"   కథానుసారముగా స్తోత్రకర్త సుకృతమో సదాశివ అనుగ్రహమో ఒకదానిని మించి మరొకటి పోటీపడుతు,   ప్రతి సుఖమునకు కారనము తమ సామర్థ్యమే అన్న దేహ భ్రంతితొలగి న-మః నేనుకాదు నాలోదాగియున్న ఈశ్వరచైతన్యమే మూలకారణమన్న విషయము బోధపడినది.  " కదా నిలింపనిర్ఝరీ నికుంజ కోటరే వసన్    విముక్త దుర్మతి సదా శిరస్థమంజలిం వహన్    విముక్త లోలలోచనో లలాట ఫాలలగ్నక    "శివేతి" మంత్రముచ్చ్రేత్ సదా సుఖీభవామ్యహం"      జీవుని రెండువిషయములు సర్వం శివమయము అన్న భావనలో రమించుటకు అడ్డుపడుతున్నాయి.అవి,  చంచల నేత్రములు నిశ్చలత్వమును వీడి బాహ్యదర్శనము వైపునకు పరుగులు తీస్తున్నాయి.    దానికితోతోడుగా ,  చంచలమైన మనస్సు శిరసానమామి ఈశ్వరదివ్యతేజం అననీయుటలేదు.    ఈ రెండింటికి ఏకాగ్రత వస్తేకాని శివ మంత్రమును వాకునకు ఆభరనముగా,సవినయ శివచైతన్య దర్శనమునకు మనస్సునకు శిరసా నమామి అను ఉపచారముగా సమర్పించుటకు ఫాలనేత్రమున్న అజ్ఞాచక్రమున పరమాత్మనునిలిపి తురీయావ...