ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAM NIJABODHA-02
జగద్గురువులు కాశీపంచక స్తోత్ర రెండవ శ్లోకమును "యస్యాం ఇదం కల్పితం" అంటూ ప్రారంభించి నిజబోధరూపా అంటూ ముగించారు.
ఈ కల్పితములో దాగి ప్రకాశిస్తున్నది సత్+చిత్ రూపము.శాశ్వతమైన తాను అంతర్యామిగా ఉన్నట్లుగా మనము భావించనీయనిది మన మనస్సు.అది లేనిదానిని ఉన్నట్లుగా/ఉన్నదానిని లేనట్ల్యుగా మనలను భ్రమింపచేస్తుంది.అదేకాదా "ఇంద్రజాలం"
లేని నీరు ఉన్నట్లుగా ఎడారిలోనిమృగతృష్ణ ,తిరుగుచున్న భూమి నిశ్చలముగా నున్నట్లు,సూర్యుడు ఉదయాస్త్తమయములు చేస్తున్నట్లు,కేవలము శరీరమే "నేను" అని అనుకునేలా చేస్తుంది ఆ ఇంద్రజాలం.
ఇంద్రియాతీతము/ఇంద్రియాధీనము అను రెండు అంసములను గమనిస్తేజీవులు/వారి మనోభావములుఇంద్రియాధీనములు.వారు కాశిని క్షేత్రముగా మాత్రమే భావించగలరు కాని తమ హృదయ స్థానముగా గమనించలేరు.గంగను తీర్థముగాను దేవతామూర్తులను మాత్రమే దర్శించగలరు కాని వానిలో దాగి ప్రకాశిస్తున్న పరమాత్మను " ఏకం సత్" గా భావించలేరు.నేను-నీవు అనే ద్వంద్వములకు బందీలు వారు.
పంచభూతములకు-పంచేంద్రియమూలకు సైతము గల అవినాభావ సంబంధము ప్రపంచముగా ఉన్నట్లుంటుంది.
పంచభూతములలో ఒకటైన వాయువు ఎక్కువమోతాదులో నున్న మన మనస్సు తన సహజమైన చంచలత్వమునకు ప్రతిరూపమై అనేకానేక ఆలోచనలకు ఆలంబనమవుతుంది.ఇంద్రియములకు లొంగిపోతుంది.లేనిదానిని ఉన్నట్లుగా నమ్ముతుంటుంది.
భగవద్గీత ఆత్మసంయమన యోగములో చెప్పినట్లు జీవులు విజితేంద్రియులుగా మారాలంటే,
" జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః"
ఆ సిద్ధిని పొందిన జ్ఞానికి,
" యోమాం పశ్యంతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి
తస్యాహం న ప్రణశ్యామి సచ మే వ ప్రణశ్యతి"
సర్వం శివమయం జగత్
ఏక బిల్వం శివార్పణం.
Comments
Post a Comment