దూరీకర్తుం వాంఛసి కిం-మనీష-01

  "సత్యాచార్యస్య గమనే 'కదాచిత్" ముక్తిదాయకం

  కాశీక్షేత్రం ప్రతి సహ గౌర్యా మార్గేతు శంకరం."


  ఇది పాఠము.

 ద్వంద్వము నిర్ద్వందమని గ్రహించగలుగుట మనీషా.

  పై  వాక్యములలోని పదములు,


 1.గౌరీశంకరులు

 2.కాశీక్షేత్రము  మనము విచారణను,"ఆచారస్య/సత్యాచార్యస్య" అన్న పదముతో ప్రారంభిద్దాము.

 ఒకరు కాలడి శంకరులు-ఆచారస్య


 ఒకరు ఉపాధి-మరొకరు ఉనికి

 ఒకరు ద్వైతి-మరొకరు అద్వైతి

 ఒకరు ప్రకటిత చండాలుడు-మరొకరు పండిత బ్రాహ్మణుడు

   ఇద్దరు శంకర నామముతోవ్యవహరింపబడుతున్నారు.

2.కాశీ క్షేత్రము

     రెండును ప్రకాశ సంకేతములే అయినప్పటికిని

  ఒకటి క్షత్రము-మరొకటి హృదయము

  ఒకటి ఉపాధినీనుగ్రహించునది -మరొకటి ఉనికిని అర్థముచేయించునది

  

 3.కదాచిత్

     ఒకానొకప్పుడు-కాలమునకు ప్రతీక

 ఒకటి శాశ్వతము-మరొకటి అశాశ్వతము

 ఒకటి భ్రమణము-మరొకటి నిశ్చలము/అమరము

 4.మార్గము-ప్రతిమార్గము


    గమ్యమునకు చేర్చు గమనమును అనుసంధానము చేయునది.

  ఒకటి కాశీక్షేత్ర వీధి మార్గము-మరొకటి పరమాత్మను అందించగల హృదయ కవాట మార్గము.

  ఒకటి పరిమితము-మరొకటి అపరిమితము.

  ఒకటి  బోధనము-మరొకటి అవగాహనము.

ఆత్మజ్ఞానమును అర్థముచేసుకొనుటకు "ఉపాధి ఒక ఆసరా మాత్రమే కాని అది ఆత్మ స్వరూపముకాదు"అని తెలిసికొనుటయే "మనీషా"

సర్వం శివమయం  జగత్

   ఏక బిల్వం శివార్పణం.


 మరొకరు కైలాస శంకరులు-సత్యాచార్యస్య.

మనకు కనబడుతున్న వ్యత్యాసము ఒకరు సత్యబోధకులు-మరొకరు సత్యగ్రాహకులు.వీరిద్ధరికి అనుసంధానము సత్యము.


 3.ముక్తిదాయకము


 4.మార్గ-ప్రతిమార్గములు

 5.సత్యాచార్యులు

      

  పదార్థము-యథార్థము/ఉనికి-ఉపాధి అను రెండింటికి ప్రతీకలుగా  ప్రకటితమగుతూ,పరమాత్మను దర్శింపచేయుటకు పూనుకొనినవి.



Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)