TANOTU NAH SIVAH SIVAM@ SIVATANDAVA STOTRAM

 


  వారిఎదలోశంభుదేవుడుప్రకాశించునునిరతము

  వారిపలుకు శైవమంత్రము పరవశమ్మునమ్రోగును

  వారె శంకరచరణ దాసులు వారి  దీవెన చాలును


  కథానుసారముగా సమదృష్టినిపొంది సుఖమైన మనసుతో శంకరభజనమును చేయగలిగిన రావణునికి ఆ తారక మంత్రమును పదిమందికీందచేయాలనే న= అన్యథా గతి అని 


 'ఇమం హి నిత్యమేవ ముక్త ముక్తమోత్తమం

  పథన్ స్మరన్ బ్రువన్నరోవిశుద్ధిమేతి సంతతం

  హరే గురౌ సుభక్తిమాశు యాతి "నాన్యథాగతిం"

  విమోహనం విదేహినాం "శు శంకరస్య"చింతనం

  పూజావసాన సమయేదశవక్త్రగీతం 

  తస్యస్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాం

  లక్ష్మీ సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః


  శివ అంటే చైతన్యం-ప్రాణం-స్పందన-శుభం-మంగళం.శివ తాందవం అంటే ప్రాణస్పందనకు ప్రతిరూపం.


  ఆ తాండవంతిలకించుటకై ప్రకృతి వేయికన్నులతోఎదురుచూస్తు రంగం  సిద్ధం చేసుకుంటుంది.గాలులు పిలకింతలతో చల్లగావీవెనలు వీస్తుంటాయి.ఆకాశం బంగరువర్ణంపులుముకుని గుడుగుగుగా మారి స్వామిని సేవిస్తుంటుంది.పక్షుల కిలకిలలు వేదనాదము చేస్తుంటాయి.తుమ్మెద ఝంకారము సన్నాయినూదుతుంటుంది.గంగమ్మ వేదికను పునీతము చేస్తుంటుంది.నాగులు ఎప్పుడెప్పుడు బ్రహ్మ తమను స్వామికి అలంకారములుగా అమరుస్తాడా అని ఎదురుచూస్తుంటాయి.వాయిద్యముల తహతహ చెప్పనక్కరలేదు.అన్నింటికిమించి కుసుమములు అమ్మమెళలో పరిమళహారములై పరవశిస్తూ స్వామి తాండవమును దర్శించవచ్చని ముచ్చటపడుతుంటాయి.స్వామి నృత్యపాద దర్శనమునకై జింకలు చెంగుచెంగున ఎగురుతు పొంగిపోతుంటాయి.

  రంగము సిద్ధము కాగానే హరి-హరులు ఒకరినొకరు చూచుకొనుచు 

 సృష్టి వికసనమును సలుపుతుంటే సముద్రములు పొంగినట్లు,కైలాసము కదిలినట్లు,భ్రంగి,వ్యాఘ్రపాద,నంది మొదలగువారుతమనుతాము మరిచి త్వమేవాహం గా మారుతున్నట్లు దర్శింపచేస్తూ,

   సకలచరాచరములను ఆశీర్వదిస్తుంది.

 తాందవ స్రోత్ర పథనము రథ-గజ-తురగ-లక్ష్ములను అనుగ్రహిస్తుందట.

  సదాశివునికరుణతో వాటిగురించి తెలుసుకుందాము.

      ఏక బిల్వం శివార్పణం.



Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)