Posts

HAPPY PONGAL-2024

Image
  మకర సంక్రమణ శుభాకాంక్షలు ************************************ శ్రీకరమని దినకరుడు మకరములో ప్రవేశించె సౌరమాన కళలతో సంక్రాంతిగ ప్రకాశించె భూమాత నింగిసాగు రంగవల్లులనే తిలకించె పుష్యమాస పులకింతను ఆ గాలి ఆలకించె భోగిమంటగా అగ్ని కంటకములను తొలగించె మంచుపూల అంచలా జలమేమో అంజలించె గాలిపటము సాక్షిగా గగనమే పులకించె పంచభూతములు సాక్షిగా పండుగ తానేగుతెంచె. సింగారపు ధర్మమై గంగిరెద్దు దీవించె ఏలిక పోలికనెరిగి హరినామము నర్తించె అంత రంగ నాథుని ఆరాధన ఫలించె లోక కళ్యాణముగా గోదా కళ్యాణము గావించె పండుగ తనతో పాటు పారమార్థికతను తెచ్చె కడుపునింప సిద్ధమయ్యి కర్షకుడు తరియించె బోసి పళ్ళను దీవింపగ భోగిపళ్ళు పండించె ఉమ్మడి సంపద విలువను గుమ్మడేమొ తెలియపరిచె కర్మ భూమి ధర్మపు మర్మమేమో వివరించె పొంగుచున్న సంతోషము పొంగలిగ రుచించె అణువణువు అర్పించిన పశుగణమును పూజించె వ్యవసాయముతో పాటు వస్తువ్యాపారము నేర్పించె గొబ్బెమ్మల కథలతో నిబ్బరాలు చూపించె ఉన్మాదము వదిలిన భువి స్వర్గమునె తలపించె చక్కటి మార్గము చూపుతు "సంక్రాంతి సంతసించె

AALO REMBAAVAAY-30

Image
    కళ్యాణ పాశురము-30   ***********  " ప్రతి ఒక మాతృమూర్తి సాక్షాత్తుగా కరుణతో గోదరక్షగా   ప్రతి ఒక్కరి ఆర్తి తీర్చి లక్ష్యము చేర్చు గోవిందుని సాక్షిగా."   ఇంతవరకు మనము తెలుసుకున్న విషయములన్ని కేవలము అమ్మ అనుగ్రహము వల్లనే తక్క  స్వయముగా సంపాదించుకొన్నది కాదని "అడియేన్" భావిస్తున్నది. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై తింగళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్రు ఇరెంజి అంగు అప్పరై కొండ అత్తై అణిపుదువై ప్పైంగమలత్తణ్ తెరియల్ పట్టర్ పిరాందై శంగత్తమిళ్మాలై ముప్పదుం తప్పామే ఇంగుం ఇప్పరిశు ఉరైపార్ ఈరిరండుమాల్ శెంగణ్ తిరుముగుత్తు చ్చెల్వత్తిరుమాలాల్ ఎంగుం తిరువరుళ్ పెత్తు ఇంబరువర్ ఎంబావై.  అంగు-అప్పుడు-ఇంగుం-ఇప్పుడు ఎప్పుడైన స్వామి పాలసముద్రమును చిలుకునపుడు సహాయముచేసినను,గోకులములో పెరుగు సముద్రము చిలుకునపుడు సహాయపడటమునకు కారణము కేవలము మనమీది అవ్యాజవాత్సల్యమే.  అదే విషయమును త్యాగరాజు "ఓడను నడిపే ముచ్చట గనరే" అని తాదాత్మ్యతతో దర్శించి ధన్యులైనారు.  అదే కరుణను గోదా రంగనాథులు మనపై వర్షిస్తున్నారనుటకు, ఓం నమో నారాయణాయ **********************- అనుగ్రహముగ నామది శ...

AALO REMBAAVAAY-29

Image
    శాత్తుమరై పాశురము-29  ******************  "ఆలకించనీయననదు నీ అనురాగపు ఆంతర్యము   ఆలసించగనీయదు  అనుమతింప నిత్యకైంకర్యము"     మంగళప్రదమైన పాశురములో ఇష్టప్రాప్తి-అనిష్ట నిర్మూలనము ను స్పష్టము చేయించి ఇటు ఏడుతరములను-అటుఏడు తరములను స్వామి అనుగ్రహప్రాప్తులను (మన పూర్వీకులను-ఉత్తర వంశస్థులను) ఉద్ధరించుటయే కాక,రంగనాధుని అనుగ్రహమును పొంది-కొత్త పెళ్ళికూతురుగా ముస్తాబవబోతున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,వారనుగ్రహించనంతమేరకు (వింజామర) పాశురమును అనుసంధానము చేసుకునేందుకు ప్రయత్నమును చేద్దాము.  ఇరువది తొమ్మిదవ పాశురం ********************** శిత్తం శిరుకాలే వందు ఉన్నై చ్చేవిత్తు ఉన్ పొత్తామరై అడియే పోత్తుం పొరుళ్ కేళాయ్ పెత్తం మేయ్ తుణ్ణం కులత్తిల్ పిరందు నీ కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు ఇత్తైపరై కొళివాన్ అన్రుగాణ్ గోవిందా ఎత్తెక్కుం, ఏళేళు పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తోమేయావోం; ఉనక్కేనాం,అత్చెయ్ వోం  మత్తైనం కామంగళ్ మాత్తు ఏలోరెంబావాయ్.   గోపికలు ప్రథమ పాశురము నుండి స్వామి పఱ ను తమకు అనుగ్రహిస్తాడని-దానిని స్వీకరించి నోమును ...

AALO REMBAAVAAY-28

Image
     పాశురము-28    ************ " కానల గోవుల మేపుతున్నది జ్ఞానసంబంధములేనిది మా ఉపాధి   కానిల గోకులమ్మను జననసంబంధము ఉన్నది ఓ దయానిధి"    "స్వధర్మో- నిధనం శ్రేయః" అన్న ఆర్యోక్తిని నిరూపిస్తూ,పరంధాముని ప్రసన్నునిగా చేసుకొను సిద్ధోపాయమును సైతము అందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ అమ్మ అనుగ్రహించిన మేరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.  నిన్నటి పాశురములో గోపికలు అర్థించినవాటిని స్వామి తప్పక అనుగ్రహిస్తాడన్న విశ్వాసముతో వారు భావనావీధులలో బాహ్యమును మరచి భగవదానుభవమును ఆస్వాదిస్తున్నారు. "కన్నని చూచునొక్కతె-కనుసన్నల దాచునొక్కతె బింకముపోవు నొక్కతె-బిగి కౌగిట దాచునొక్కతె జలమును చల్లు నొక్కతె-జలజంబును తురుమగ కోరునొక్కతె దరహాసము చేయుచు దాగునొక్కతె-దరిచేరగ పిలుచు నొక్కతె పరిహాసముచేయుచు నొక్కతె-పర్యంకమున పరుండబెట్టొకతె తనవాడే-తనవాడే -తనావాడేననుచును తాదాత్మ్యము తోడుగ పరవశులైన పడతులతో -పలు-పలు లీలల ప్రకటనములతో యదుకులభూషణుని పొదివిన యమునాతటి ఎంతటి భాగ్యశాలియో రసరమ్యతనొంది తరించెను రమణీరమణుల రాసలీలలన్."   ఇరువది ఎని...

AALO REMBAAVAAY-27

Image
       పాశురము-27       ************   "సమవర్తిత్వము సాధించునుకదా స్వామి నీదు తీర్మానము   సమాశ్రయణము అందచేసినది మాకదే పెద్ద సన్మానము."    మాలే మణివణ్ణా పాశురములో తమ నోమునకు కావలిసిన వస్తువులను అర్థిస్తున్నట్లుగా సాక్షాత్తుగా విభవోపేతుడైన స్వామిని అర్థించారు. ఇప్పుడు వారు కోరుకొనునది స్వామి సమాగమము.జీవాత్మ తన బాహ్యలక్షణములను విడిచి,పంచసంస్కారములను పొంది, పరమాత్మను సమీపించి స్వామి గుణవైభవములను అనుభవించగలుగుట.ఐహికములో తనలో సంకోచించుకు పోయిన శౌర్యం,వీర్యం,ధై ర్యం,చాతుర్యం,ఔదార్యం  ,మాధుర్యం,జాజ్వల్యం,ఔచిత్యం అను స్వామి అష్టగుణములను     ముక్తపురుషుడై వ్యాకోపింపచేసుకొని స్వామి సారూప్యమును-సాలోక్యమును-సాంగత్యమును అంతకు మించి సాయుజ్యమును చేరుటను మనకు అందించిన రామానుజ సోదరికి అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,గోవిందానుభూతినందించు, "అక్కార్ అడిసెల్" అను కూడారై అను విశేష పాశురమును అనుగ్రహించినంతమేరకు అనుసంధానము చేసుకుందాము.అమ్మ కూడి ఇరందు కుళిరేందో అని స్వామి సంపూర్ణ సమాగమ సావకాశమును కల్పించు సమాశ్రయణములను వివరించిన విధానమ...

AALO REMBAAVAAY-26

Image
         పాశురము-26      *************   " శరణార్థులు నీ సంశ్లేషమునే కోరువారని గ్రహించు    శంఖములు-దీపములు-కొలుచువారిని, అనుగ్రహించు"     స్వామి నీకు మాయందుగల వాత్సల్యము-మాకు నీయందుగల వ్యామోహము నీ నీలమణివర్ణ  పారదర్శకత పదేపదే చెబుతున్నది.అయినను మా మీది అనుగ్రహము నీతో పదేపదే "సంభాషించు భోగమును" ప్రసాదించుటకా యన్నట్లు" ఏమికావాలని ఏమీ తెలియనట్లు" ప్రశ్నించుచున్నావు  అని అంటున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,అనుగ్రహించినంతమరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము. ఇరువది ఆరవ పాశురం ********************* మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడు వాన్ మేలైయార్ సేవననగళ్ వేండువన కేట్టియేన్ ఞాలాత్తై యెల్లాం నడుంగ మురల్వన పాలన్న వణ్ణత్తున్ పాంజశన్నియమే పోలవన శంగంగళ్ పోయ్ ప్పాడు డయనవే శాలప్పెరుం పరయే, పల్లాండు ఇశైప్పారే, కోళ విళక్కే,కొడియే,వితానమే ఆలిన్ ఇలైయాం! అరుళ్ ఏలోరెంబావాయ్!  మాలే-ఆశ్రితవాత్సల్య స్వరూపమా!  మణివణ్ణా-మా మనసులోని భావములను గ్రహించినవాడా!  యాం వేండువన కేట్టియేల్-మాకు కా...

AALO REMBAAVAAY-25

Image
   పాశురము-25  *********** "అఖిలాండ రక్షణముగా చేసితివి మాకొరకై అజ్ఞాతము  అనవరతకటాక్షముగాద  అవతార రహస్యజ్ఞానము." ఇరవై ఐదవ పాశురం ***************** ఒరుత్తు మగనాయ్ పిరందు,ఓర్ ఇరవిల్ ఒరుత్తు మగనాయ్ ఒళిత్తు వళర తరుకిల్లానాంగి తాంతీంగు నినైన కరుత్తై పిళ్ళైపిత్తు క్కంజన్ వయిత్తిల్ నెరుప్పెన్న నిన్ర నెడుమాలే! ఉన్నై అరుత్తిత్తు వందోం ; పరై తరుదియాగిల్ తిరుత్తక్క శెల్వముం శేవగమం యాంపాడి వరుత్తముం తీరందు మగిళిందు ఏలోరెంబావాయ్!    ఏకము-అనేకముగా అనుగ్రహిస్తున్న వైనమును గోపికల ద్వారా మనకు తెలియచేస్తున్నది.వారు, 1.మగిళిందు వందోం-సంతోషముగా వచ్చారట 2.శెల్వముం-సేవగమం యాంపాడి-నీ యొక్క పరాక్రమము సంపదను పాడుతూ వచ్చాము.అంటున్నారు.  వారి సంతోషమునకు కారణము  ఓర్ ఇరవిల్ అంటున్నారు.  ఒక రాత్రి వారి సంతోషమునకు కారణమై ప్రకాశిస్తున్నదట.  బాహ్యమునకు విరుద్ధము. చీకటి తొలగితే కాని మనము ప్రకాశమును కాంచలేము.కాని వీరికి చీకటి ప్రకాశముగా భాసిస్తూ,ప్రమోదమును కలిగిస్తోందట.   పైగా మాకే కాదు ఆ ఒకే ఒక రాత్రి, 1.మధురా నగరమునకు సంతోషమును కలిగించినది జన్మస్థానమై. 2.దేవకీద...