TANOTU NAH SIVAH SIVAM-25@SIVATANDAVASTOTRAMU


 


 నడుమవచ్చిన నానాలౌల్యములలో పడి

 ఇడుములలోతడుముకొనుచు నేనడిచే వేళ

 సడియైన లేక నీవు సాగితివేమూలనో

 కప్పిన అజ్ఞానంబున కాంచలేనిదిది

 ఇప్పటిదా సామి నీ నా సంబంధము

 నా పక్షంబుండి కరుణించుము నన్ను (శ్రీ సామవేదం వారు)


  కథానుసారముగా స్తోత్రకర్త ఇప్పటివరకు ,

 కిశోర చంద్రశేఖర,

 దిగంబర,

 భూత భర్తరి,

 కాలిమప్రభాకంఠ,

 తాండవ శివ అంటూ,తానుభక్తి యొక్క వివిధావస్థలలో మునుగుతూ,అనేకానేక రూపములను/స్వభావములను 

దర్శిస్తూ,క్రమక్రమముగా అన్నింటిలో పరమాత్మను దర్శించగలిగే సమస్థితిని పొందినాడు.

  కానీప్పుడొకచిక్కు వచ్చి పడింది.అదే,

 అతని చంచలనేత్రములుచంచలమైన మనసుకు సహాయపడుతూ బాహ్యము నుండి దృష్టిని మరల్చుటకు అడ్డంకులుగా మారుచున్నవి.

  మనసు యొక్క ఆలోచనలు అటు=ఇటు పరుగులు తీస్తు పవిత్రగంగాతీర పొదరిల్లు వంటి తనహృదయములో నుండి,

   కనుబొమలనడుమ మనసును నిలిపి ఏకాగ్రతతో శివనామమును పలుకనీయకున్నవి.




  మాయవల విసిరితివి మహిమగలజాలరి

  పాయగలేక  ఇక బద్ధులము ఐతిమి


  త్రిగుణములు చేరిచి తీర్చిదిద్దినది ఈ వల

  మా చేతలను మార్చి,విసిరేయి  ఆవల


    స్వామి నీకరుణతో,

 అహం-నేను,సుఖీభవం-సుఖస్థితిలో ఉండుట,

 కదా-ఎప్పుడో  అని స్వామి సేవానురక్తతచే పరవశుడఘుచున్నాడు రావణుడు.


  మంత్రముచ్చరన్ అంటూ-వాక్కును,

  లలాటభాలలగ్నక-అంటూ -మనసును

  నికుంజకోటరే విముక్త దుర్మతి అంటూ,


   త్రికరణములు త్రినేత్రుని సేవించుభాగ్యమును వేడుకొనుచున్న రావణుని అనుగ్రహించిన స్వామిమనలనందరిని అనుగ్రహించునుగాక.

     ఏక బిల్వం శివార్పణం.

  

  


  

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)