TANOTU NAH SIVAH SIVAM-25@SIVATANDAVASTOTRAMU
నడుమవచ్చిన నానాలౌల్యములలో పడి
ఇడుములలోతడుముకొనుచు నేనడిచే వేళ
సడియైన లేక నీవు సాగితివేమూలనో
కప్పిన అజ్ఞానంబున కాంచలేనిదిది
ఇప్పటిదా సామి నీ నా సంబంధము
నా పక్షంబుండి కరుణించుము నన్ను (శ్రీ సామవేదం వారు)
కథానుసారముగా స్తోత్రకర్త ఇప్పటివరకు ,
కిశోర చంద్రశేఖర,
దిగంబర,
భూత భర్తరి,
కాలిమప్రభాకంఠ,
తాండవ శివ అంటూ,తానుభక్తి యొక్క వివిధావస్థలలో మునుగుతూ,అనేకానేక రూపములను/స్వభావములను
దర్శిస్తూ,క్రమక్రమముగా అన్నింటిలో పరమాత్మను దర్శించగలిగే సమస్థితిని పొందినాడు.
కానీప్పుడొకచిక్కు వచ్చి పడింది.అదే,
అతని చంచలనేత్రములుచంచలమైన మనసుకు సహాయపడుతూ బాహ్యము నుండి దృష్టిని మరల్చుటకు అడ్డంకులుగా మారుచున్నవి.
మనసు యొక్క ఆలోచనలు అటు=ఇటు పరుగులు తీస్తు పవిత్రగంగాతీర పొదరిల్లు వంటి తనహృదయములో నుండి,
కనుబొమలనడుమ మనసును నిలిపి ఏకాగ్రతతో శివనామమును పలుకనీయకున్నవి.
మాయవల విసిరితివి మహిమగలజాలరి
పాయగలేక ఇక బద్ధులము ఐతిమి
త్రిగుణములు చేరిచి తీర్చిదిద్దినది ఈ వల
మా చేతలను మార్చి,విసిరేయి ఆవల
స్వామి నీకరుణతో,
అహం-నేను,సుఖీభవం-సుఖస్థితిలో ఉండుట,
కదా-ఎప్పుడో అని స్వామి సేవానురక్తతచే పరవశుడఘుచున్నాడు రావణుడు.
మంత్రముచ్చరన్ అంటూ-వాక్కును,
లలాటభాలలగ్నక-అంటూ -మనసును
నికుంజకోటరే విముక్త దుర్మతి అంటూ,
త్రికరణములు త్రినేత్రుని సేవించుభాగ్యమును వేడుకొనుచున్న రావణుని అనుగ్రహించిన స్వామిమనలనందరిని అనుగ్రహించునుగాక.
ఏక బిల్వం శివార్పణం.
Comments
Post a Comment