Posts

DEVAKAARYASAMUDBHAVA-SUMBHA NISUMBHA-maata KAUSIKI

Image
 శుంభస్యైచ నిశుంభస్య ధూమ్రాక్షస్య చ మర్దిని  రూపందేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి   శుంభ/నిశుంభులను ధూమ్రాక్షుని సంహరించి ధర్మమును కాపాడుచున్నతల్లి నా ఇంద్రియములను సైతము నిన్ను ఆరాధించుటకు సుముఖము చేసి నా అంతర్/బహిర్ శత్రువులనుండి నన్ను రక్షింపుము.    పరాశక్తి మధు/కైటభులను,మహిషాసురునికి సంబంధించిన అసురులను,వానిని,ధూమ్రాక్షుని,చండ/ముండులను ,రక్తబీజుని సంకేతనామములుగా నున్న ఇంద్రియముల బలహీనతలను నిర్మూలించినది.ఇక మిగిలిన వారు శుంభ/నిశుంభులు.నేను అను అహంకారము-నాది అను మమకారము.  వీటి గురించి వీటిచే ప్రభావితమైన ఇద్దరి గురించి మనము ఒకసారి మాట్లాడుకుందాము.    మార్కండేయ పురాణములో మహర్షి సురథుడు అను రాజు రాచరికమును కోల్పోయి వేట నెపముతో ఒంటరిగా గుఋఋఅము నెక్కి అడవులకు పోయెను.  పేరు సురథుడు.దశరథుడు మనకు దుర్తుకు వస్తాడు కద.మంచి ఇంద్రియములు కల శరీరము కలవాడు.గుర్రమునెక్కి ,మనసు మాట విని అడవులకు పోయెను.ఒక విధముగా బుద్ధిని పనిచేయనీయనిచోటు.  కనుకనే పరహస్తగతమైన తన రాజ్యముపై భ్రాంతిని వీడలేని పరిస్థిలో నున్నాడు.    వేరొక వ్యక్తి సమాధి.వైశ్యుడు.ధనము ...

DEVAKARYASAMUDBHAVA-RAKTABEEJA

Image
 

DEVAKARYASAMUDBHAVA

Image
 

DEVAKAARYASAMUDYATAA-SUMBHA/NISUMBHA

Image
 "యా చండీ మధుకైటభాది దైత్యశమనీ            యా మాహిషోన్మూలినీ   యా ధూమ్రేక్షణ చండముండ మథనీ          యా రక్తబీజాశనీ   శక్తిః శుంభనిశుంభదైత్య దమనీ యా సిద్ధిధాత్రీ పరా     సాదేవి నవకోటిమూర్తి సహితా మాంపాహి/మాంపాతు విశ్వేశ్వరీ "    పైశ్లోకము అనేక రక్కసులను తల్లి సంస్కరించినట్లు తెలుపుతున్నది.వారు  మధు-కైటభులు  మహిషాసురుడు  ధూమ్రేక్షణుడు  చండ-ముండుడు  రక్తబీజుడు  శుంభ-నిశుంభులు    వీరికి అమ్మతో యుద్ధము చేయవలసిన పరిస్థితి ఎందుకు కల్పించబడినది?    అసలు వీరెవరు?  కశ్యప ప్రజాపతి/దితి సంతానము శుంభ-నిశుంభులు.వారు పాతాళ లోకములో పెరిగి పెద్దవారైరి.భూలోకమునకు వచ్చి బ్రహ్మ గురించి ఘోరతపమాచరించిరి.భూలోకము తల్లడిల్లసాగెను.వారి తపమును నిలిపి వేయుటకు బ్రహ్మ వారి ముందు పెరత్యక్షమై వరము కోరుకొమ్మనెను.చిరంజీవులుగా వరము కోరుగానే బ్రహ్మ తాను సైతము కల్పాంతమున సమసిపోవు వానినని తనకు చావును గెలిచే వరమిచ్చే శక్తిలేదనెను.దానికి వారు ఒక్క స్త్రీ చేతదక్క చావులేని వరమును పొందిరి...

DEVAKAARYASAMDBHAVA-MAHISHASURAMARDINI-PART01

Image
దేవకార్య సముద్యతా-మహిషాసుర మర్దిని    *******************************  అమ్మా,  " మహిషాసుర నిర్ణాశి భక్తానాం సుఖదే నమః    రూపం దేహి జయందేహి యశోదేహిద్విషోజహి"   దేవకార్య సముద్యతా-మహిషాసుర మర్దిని-02   ******************************  ధనురనుసంగరణ-క్షణ-సంగ-పరిస్ఫురదంగ-నటత్కటకే    కనక-పిశంగ-పృషత్క-నిషంగ-రసద్భట-శృంగ-హతావటుకే |           కృత-చతురంగ-బలక్షితి-రంగ-ఘటద్-బహురంగ-రటద్-బటుకే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే     వరగర్వమొతో అహంకరించుచు ఇంద్రునిపై దండెత్తిన మహిషుని ధాటికి తట్టుకోలేని దేవతలు స్వర్గమును వీడి,అధికారమును కోల్పోయి భూలోకమున సామాన్యులవలె సంచరించసాగిరి.   "బుద్ధిః కర్మానుసారిణి" రాబోయే పరిణామములకు సూచనగా మహిషుని పాపకృత్యములు పరాకాష్ఠకు చేరుచున్న సమయమున వానిదగ్గర సద్దుమణిగిన సత్వము దేవతలను చేరినదా అన్నట్లు వారందరు తమను ఈ ఆపదనుండి రక్షింగలిగినది ఆ పరాశక్తియే అని అర్థముచేసుకొనగలిగిరి.రాజ్యముతో పాటుగా రజోగుణము కనుమరగైనదేమో వారు ముకుళిత హస్తములతో ,  యా దేవి సర్వభూతేషు...

DEVAKAARYA SAMUDYATAA-INTRO

Image
   పరమపావనమైన నీపాదరజకణము  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము  ఉండి,పోవునవి యేగ మానవ నాలుగుదశలు  ఉండి,పోవునవి యేగ మనిషి కోపతాపములు  ఉండి,పోవునవి యేగ ఋతువులు ఏడాదిలో  ఉండి,పోవు వారేగా రవిచంద్రులు  దినములో  ఉండి,పోవునవి యేగ మంచి చెడులు మనుగడలో  ఉండి,పోవునవి యేగ ఆకలిదప్పులు జీవికి  ఉండి,పోవునదియేగ జగతి ప్రతి ప్రళయములో  ఉండి,పోవు ఈ జీవి నీ పదముల ఉండిపోవుచున్న వేళ  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా  మానస విహారి ఓ సౌందర్య లహరి.   దేవకార్య సముద్యతా  **********************    ధర్మసంస్థాపనార్థాయా సంభవామి యుగేయుగే అని చెబుతున్నది భగవద్గీత.   శిష్టరక్షణ-దుష్ట శిఖణ అను రెండువిధానములు కూడియున్న ధర్మ పరిరక్షణకై నిర్వికార/నిర్గుణ/నిరంజన చిత్శక్తి కొత్త కొత్త రూపములను ధరిస్తుంటుంది.ధర్మమును పరిరక్షిస్తుంటుంది.ఆ ప్రక్రియ దుష్టత్వమును సం హరించుటకు ముందు సంస్కరిస్తుంది.వంధ విముక్తులను చేస్తుంది.   ఒక మంచి యొక్క గొప్పతనమును అర్థముచేసుకోవాలంటే దానికి అడ్దముగా నిలిచిన చెడు యొక్క అజ్ఞానమును కూడా తెలుసుకొనవలసిన...

SHADANGADEVATA MANDALAMU

Image
   షడంగదేవతా మండలము  ***************  " ఐశ్వరస్యచ సర్వస్య వీర్యస్య యశసః శ్రియం    జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా."    1.ఐశ్వర్యము  2.వీర్యము  3.యశము  4.శ్రీ  5.జ్ఞానము  6.వైరాగ్యము అను ఆరు పురాణోక్త గుణములే ...  1.హృదయదేవి  2.శిరోదేవి  3.శిఖాదేవి  4.కవచదేవి  5.నేత్రదేవి  6.అస్త్రదేవి  అను పేర్లతో పిలువబడుచున్న  న్యాస/అంగ దేవతలు/శక్తులు.      వీరిని పరమేశ్వరి సన్నిధానవర్తులుగా భావిస్తూ బిందువును ధ్యానించే సమయములో వీరిని కూడా భావిస్తూ ధ్యానిస్తారు.