Posts

NAH PRAYACHCHAMTI SAUKHYAM-07

Image
  నః ప్రయచ్చంతిసౌఖ్యం.-07   ************************   " ప్రళయ పయోధి జలే కేశవ ద్రుతవానసి వేదం    విహిత వహిత్ర కరిత్రమఖేదం    కేశవాద్రుత మీనశరీర జయజగదీశ హరే"  చేపరూపమును దాల్చి చేవతో సొమకుని నుంది వేదోధ్ధరణను గావించిన కేశవ నమస్కారములు.  భవసారమున పడి బయటకు రాలేని మాపై నీ కరుణాజాలమును విసిరి కడతేర్చు గొప్ప జాలరి వైన శివా ప్రణామములు.  నమో ప్రతరణేభ్యో ఉత్తరణేభ్యశ్చవ నమో నమః.  స్వామిని దర్శించిన సత్యవ్రతుడెంత ధన్యుడో స్వామికి మత్స్య నైవేద్యమును సమర్పించిన ఆదిపత్త నయనారు అంతే మహనీయుడు. చిన చేపను-పెద్ద చేప,చిన మాయను-పెనుమాయ  ఇది స్వాహా-అది స్వాహా అని అంటున్నాడు పెద్దజాలరి మనకు ఒక జాలరి కథ చెబుతూ,  విషయవాసనలనే ప్రవాహములో పడి,వల పట్టుకొని యున్నమాయ అనే ఆపదను గుర్తించలేని మనలను రక్షించుస్వామికి నమస్కారములు..శివోహం.  భ గవంతుడు-భక్తుడు ఇద్దరు జాలరులే  జలము-జలచరము-జాలరి ఈశ్వరచైతన్యమే.  " ఓం నిషాదేభ్యశ్చవ నమోనమః".  చేపలను సమూహముగ పట్టి చంపునట్టి నిషాదుల రూపమున నున్న రుద్రునకు నమస్కార...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-06

Image
    నః ప్రయచ్చంతి సౌఖ్యం-06     ************************  భగవంతుడు-భక్తుడు ఇద్దరు వేటగాళ్ళే. ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా తల్లి పార్వతి మారె తాను ఎరుకతగా  ఎరుక కలిగిన-జ్ఞాని.....ఎరుకగా..వేటగానిగా  మారుటయే  శివలీల.  ఎనలేని వాత్సల్యము ఎరుకరూపమును దాల్చినది.ఎదురుదాడికి దిగినది.  వేట నాది-వేటునాది-వేటాడే చోటు నాది-ఏటి తగవు ? అని మాటలాడినది.కరుణతో కరిగి పశుపతమును ప్రసాదించినది.ఏలినవాని లీలలను ఏమని వర్ణించగలను?మాట కరుకు-మనసు చెరుకు మన శివయ్య.  పరమేశ్వరుని వేట జీవుల పాపకర్మములను చేయించు అరిషడ్వర్గములు.వానిని అరికట్టుటకు వేసిన దెబ్బ యే వేటు.వేటాదే చోటు ఎక్కడ వేటాడ వలెనో ఆ ప్రదేశము.అదే మన మనస్సులు.అతి చంచలమై బుధ్ధినివిస్మరింపచేసి మూఢులను చేస్తుంది.అదే జరీఅది ఈ కిరాతార్జునీయములో .అర్జునుని అహంకారము అను వేట.దానిపై పడిన వేటుయే పినాకము శిరమును ముద్దాడుట.ఎంతటి చమత్కారమో మనవేటూరిగారిది.వేట ఫలితమేఅహంకారము తొలగి స్వామీనుగ్రహమునకుపాత్రతను కలిగించి,పాశుపతాస్త్రమును ప్రసాదించినది.నమోనమః.  |" నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే ...

NA: PRAYACHCHAMTI SAUKHYAM-05

Image
 నః ప్రయచ్చంతి  సౌఖ్యం-08  ************************* " గో" శబ్దమునకు పవిత్రము-ధర్మము అను అర్థములను పెద్దలు చెబుతారు.ధర్మమును రక్షించు పరమేశ్వరుని గోపాలునిగా,ధర్మ సంరక్షకునిగా భావిస్తే ,శివుడు-శివుని కొలిచే భక్తులు గోపబాలురే కదా.శివోహం.  కార్తిక సోమవార శుభకామనలతో నేటి కథను ప్రారంభిద్దాము పరమేశ్వరానుగ్రముతో.  భగవంతుడు-భక్తులు ఇద్దరు గోపబాలురే  " నమః శంగాయచ-పశుపతయే నమో నమః"   "శం" అనగా సృష్టించి,సృష్టించిన దానియందు జీవులకు తాదాత్మ్యమును కలిగించి,అన్యము ఏదియును లేదనిపించి,ఆత్మార్పణను చేయించే శక్తి.ఆ శక్తియే " ఈశ్వర చైతన్యము." నమోవాకములు.   సస్వరూపమును తెలిసికొనలేని జీవులు పశువులు.వారిని పాలించే ఏకైక నాయకుడు పశుపతి.ఓం పశూనాం పతయే నమః."  పశుపాలకులు ఈశ్వరతత్త్వమును గ్రహించిన ధన్యులు.కనుకనే వారు పశువుల కొట్టములో పశుపతిని దర్శించగలిగారు." ఓం నమో గోష్ఠాయచ."వారికా దివ్యత్వము లభించుటకుకారణము రుద్రుడే సుమా.ఇది చదివితే కాదనగలరా?  సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం.   " ఉతైనం గోపా అదృశ నదృశ నుదాహార్యః" తన కిరణముల...

NA: PRAYACHCHAMTI SAUKHYAM-04

Image
 నః ప్రయచ్చంతి సౌఖ్యం-07   " ఓం తస్కరాణాం పతయే నమః"   ********************************  ఒక్కడే! దిక్కొక్కడే ! పెద్ద దొంగ ఒక్కడే  అదుపుతప్పుచున్న అరిషడ్వర్గములను దోచు  దొంగ ఒక్కడే  దేవుడు-జీవుడు ఒక్కడే  ధర్మము-మర్మము తానొక్కడే.  లోకాన దొరకాదు దొంగవని చాటాను  నా పాపరాశులన్నీ దొంగల్లే దోచేశావు  అని స్తుతింపబడిన మహేశ్వరుని చోరకళా విశేషములను తెలిసికొనుటకు ప్రయత్నిద్దాము.ఓం నమః శివాయ.   చోరాన్  మారయ మారయ   ------------------------   " భగవంతుడు-భక్తుడు ఇద్దరు దొంగలే"      దొంగలరూపములో నున్న ఈశ్వరచైతన్యమునకు నమస్కారము.ఈశ్వర చైతన్యము చర్మచక్షువులకు కానరాకుండా,సకలచరాచర జీవరాశులయందు దాగియుండి వాటిని శక్తివంతముగా ప్రకటించు చున్నది.ఎందుకంటే , రుద్రుడు "స్తేనానం పతి". గుప్తచోరుడు.మనకు దొరకకుండ రహస్యముగా మనలోనే దాగియున్నాడు.నమో నమః.  ఏ వికారములేని పరమాత్మ అనేక చోరులరూపములలో ప్రకటింపబడుతు పాపములను దోచుకొనుచు ప్రాణులను సంస్కరిస్తుంటాడు.బహురూపములైన భగవత్తత్త్వమును భజించరాదే ఓ మనసా! 1....

NA: PRAYACHCHAMTI SAUKHYAM-03

Image
   నః ప్రయచ్చంతి సౌఖ్యం-04    *****************************   " ద్రాపే అంధసస్పతే దరిద్రన్ నీలలోహిత"    భగవంతుడు-భక్తుడు ఇద్దరు ఈశ్వరచైతన్యమే. అన్నాద్ భవంతి భూతాని-పర్జన్యాద్ అన్న సంభవః. అన్నము వలన జనులు మేఘముల వలన అన్నము ఉత్పత్తి అగుచున్నవి ( శ్రీమద్భగవద్గీత )   కరుణతో అన్నమును ప్రసాదించుచు ఆదిదేవుడు,భక్తితో అన్నమును ఆరగింపుచేయుచు అరివట్టాయ నయనారు పరమపూజ్యులు.హర హర మహాదేవ శంభో శంకర.  ద్రాపే-ఓ శివా నీవు అఘోరరూపివై భక్తుల అన్నమును పాలిస్తావు.అదేవిధముగా ద్రాపే ఓ శివా ఘోర రూపివై పాపులను శిక్షిస్తావు.పాపము-పుణ్యము అనునవి,ఘోర-అఘోర రూపములు మేము చేసిన -చేయుచున్న పనుల ఫలితములే కాని అన్యము కాదు అను తెలివిని మాకు అనుగ్రహించు తండ్రీ అని వేడుకొను,   అగస్త్య కమండలజలము నేలపై జారి,కావేరి నదిగా రూపాంతరమును పొంది, ప్రవహించుచున్న "గణమంగళ" పట్టణమున తాయినార్ అను సంపన్న గృహస్థుడు ధర్మపరాయణుడై యుండెను.  " యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతే జవాన్" " తే పథాం పథి రక్షయ ఐలబృదాయ వ్యుధః."    ఐలము అనగా అన్న సముదాయము అను అర్థ...

NAH PRAYACHCHAMTU SAUKHYAM-02

Image
  నః ప్రయచ్చంతు సౌఖ్యం.-5  **************************   "వణిగృహ్ నంతిపరే పశ్యతోహరః."  పశ్యతోహరులు అంటే మనము చూస్తుండగానే అపహరించేవాళ్ళు.వర్తకులు అను భావముతో వాడబడినది.  భగవంతుడు-భక్తుడు ఇద్దరు వర్తకులే.ఓం నమః శివాయ.   " మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమః"    స్వామి మనకు కావలిసినవిమనకు అందచేయుట కొరకు,చొరలేని గుబురుపొదలలో నున్న వాటికొరకు ఆలోచనచేసి దానిని తెచ్చి విక్రయించు వ్యాపారి రుద్రుడు.ఈశ్వర చైతన్యమే వృత్త్తుల నైపుణ్యము.భక్తుల యోగము ద్వారా భగవత్తత్త్వము ప్రకటితమవుతుంది.శివజ్ఞానము,శి వభతి,శివ ధ్యానము,శివార్చన,శివవ్రతము అను ఐదు శివ యోగములు. " ఓం నమః శివాయ".          భగవంతుడు-భక్తుడు ఇద్దరు వర్తకులే   భక్తుడు     .శివనేస-జ్ఞానకళ దంపతులకు శ్వేతర్నయర్ నోముల పంట.తిరువెంగడర్ గా ప్రసిద్ధిచెందెను.చిన్నతనములోనే తండ్రిని కోల్పోయిన,ను,"మాతాచ పార్వతీదేవి-పితాదేవో మహేశ్వర" అను నమ్మకము. తన సంపదను శివభక్తులకై ఖర్చుచేసి అమితానందమును పొందెడివాడు. " నమో గణేభ్యో-గణపథిభ్యశ్చ వో ...

NA: PRAYACHCHAMTI SAUKHYAM.

Image
 నః ప్రయచ్చంతుంసౌఖ్యం-09        ***********************       ఓం కులాలేభ్యః నమోనమః.   _____________________________  మృత్తిక-కుమ్మరి చక్రము-మట్టిపాత్రలు-కుమ్మరి అన్ని తానైన పెద్ద కుమ్మరికి నమస్కారములు.  ముజ్జగములను మృత్తికను,కాలభ్రమణమనే చక్రమున బంధించి,తన హిరణ్య బాహువులతో బహు సుందర పాత్రధారులుగా మలచి,ప్రాణశక్తి అను అగ్నితో దానిని కాల్చి,లీలా వినోదమును తిలకించు గొప్ప కుమ్మరి ఆ గౌరీపతి.ఏ కుండకు ఎంత జీవనమో తెలిసినను ఏమితెలియనట్లుండు బహు చమత్కారి.ఏ జీవి రూపము ఎన్నేళ్ళో,ఏ కుండ పనితనము ఎన్నాళ్ళో.ఎవరు చెప్పగలరు?  క్షీరసాగర మథనంబున జనించెను హాలహలము అతి భీకరమై  క్షీర లింగేశ్వరుడు తన గళమున ధరించెను అది శ్రీకరమై.  గరళ ధరుని కరకమలములు కొలిచిన వారి కరతలామలకములు.  అని నిరంతర నామస్మరణతో సంతుష్టుడై ఉండెడివాడు.   చిదంబర ప్రాంతములో ఒక కుమ్మరి శివభక్తుడు ఉండేవాడు.నిరంతర శివనామ స్మరణము పలుకుచు,స్వామి హాలాహల భక్షణము గురించి,తన్మయత్వముతో తనతోటి వారికి వివరించుచు తరించుచుండెడివాడు ...