Posts

TIRUPPAAVAI-PAASURAMU-09

Image
. తిరుప్పావై-పాశురం09 ******************* " మాతః సముత్థితవతీ మది విష్ణుచిత్తం విశ్వోపజీవ్య మమృతం వచసా దుహానాం తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతః పయోధి దుహితః సహజాంవిదుస్త్వాం." పూర్వపాశుర ప్రస్తావనము ******************* ఆశ్రయణము-ఆశీర్వచనము నకు నిదర్శనముగా త్రికరణ ములతో స్వామిని సంకీర్తించి-సంసేవించి,స్వామి ఇస్తానన్న "పఱ" ను తెచ్చుకుందామని గోదమ్మ వ్రతఫలమును ప్రస్తావించినది. ప్రస్తుత పాశురము పరమాద్భుతము.ఈపాశురములో మనకు నిదురిస్తున్న గోపికతో పాటుగా ,మేల్కొని యున్న గోపిక తల్లిని పరిచయము చేస్తుంది గోదమ్మ. ప్రస్తుత పాశురములోనిగోపిక పరిశుద్ధ మణులున్న (నవవిధ బంధములు స్వామితో నున్న మనసనే) మందిరములో,ప్రకాశిస్తున్న దీపములు- (జ్ఞానము) పరిమళిస్తున్న ధూపములతో (అంతర్ముఖ తాదాత్మ్యముతో) ,తన ఉపాధి సహజత్వమును మరచి,అంతర్ముఖియై,తనకు రక్షణము భగవంతుడే అన్న గట్టి నమ్మకముతో నున్న ప్రపన్న. గోపిక శయనమందిరములో శ్రీకృష్ణునికై దీపములు వెలుగుచున్నవి.ధూపపరిమళములు సైతము అస్వామికై ఎదురుచూచు చున్నవి.తల్పము సంగతి సరేసరి.స్వామి స్పర్శకై తహతహలాడ...

TIRUPPAAVAI-PASURAMU-08

Image
      తిరుప్పావై-పాశురం 08     *****************  " మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం    విశ్వోప జీవ్యమమృతం వచసా దుహానాం    తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం    సంతః పయోధి దుహితః సహకాం విదుస్త్వాం".   పూర్వ పాశుర ప్రస్తావనము   *******************  శబ్దము-శ్రవనము అను అంశములతో పక్షులను-భారధ్వాజ పక్షులను సంకేతించి,తెల్లవారుచున్నదనుచు,ఇద్దరు జ్ఞానమూర్తులను తన వెంట తీసుకుని,మూడవ గోపికను నిదుర లేపుటకై,ప్రస్తుత పాశురములో  "దృశ్యము-నయనము" ను తూరుపు దిక్కు-తెల్లదనమును సూచిస్తున్నది గోదమ్మ.   ప్రస్తుత పాశుర ప్రాభవము   *****************  ప్రస్తుత పాశురము బయటనున్న గోపికలు తమతో మాట్లాడుతున్నట్లు భావిస్తూ,సంభాషణా చతురతతో సాగుతుంది.   మూడవ గోపిక-నోముపై కుతూహలము కలది-కోగులం ఉడయ.    స్వామిని త్రికరన శుద్ధిగా ఆశ్రయించుట-స్వామి అనుగ్రహించుట అను రెండు విషములను ప్రస్తావించినది గోదమ్మ అరుళ్ అన్న పదముతో.   శబ్దము-శ్రవనము అన్న అంశముతో పక్షులు-భారధ్వాజ పక్షులను స్తోత్రములను,శంఖనాదములను సంకేతిస్తూ శ్ర...

TIRUPPAAVAI-07 PAASURAM

Image
     తిరుప్పావై-పాశురము07    ******************  "మాతః సముత్థైతవతీ మదివిష్ణుచిత్తం   విశ్వోపజీవమమృతం వచస దుహానాం   తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం   సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం"   పూర్వపాశుర ప్రస్తావనము   *********************   మనము శుద్ధి వ్రతమును పూర్తి చేసుకుని,ఆందాళమ్మచేతిని పట్టుకుని రెండవ భాగమైన 'మేల్కొలుపు వ్రత భాగములో మొదటి గోపికను మనతో కలుపుకుని,రెండవ గోపిక ఇంటికి వెళ్ళుచున్నాము"  ప్రస్తుత పాశురములో శబ్దమును మరింత స్పష్టము చేస్తూ,భారధ్వాజ పక్షుల "కృష్ణ నామ సంకీర్తనమును" గొల్ల భామల చల్ల చిలుకు శబ్దములను,కేశి అను రక్కసుని సంహరించిన కేశవ నామ సంకీర్తనమును శబ్దమును-అందులో దాగిన పరమార్థమును తెలిసికొనుటకు శ్రవనమును సాధనములుగా నోము సాధనకు వివరించుచున్నది గోదమ్మ.  ఆండాళ్ తల్లికి-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,మనము పాశురములోనికి ప్రవేశిద్దాము. ఏడవ పాశురము **************** కీశు కీశెన్రెంగుం ఆనైచ్చాత్తు కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో? పేయ్ పెణ్ణే కాశుం పిరప్పుం కలగల ప్పక్కై ప్పేర్తు వాశ నరుం కుళ...

TIRUPPAAVAI---PASURAM06

Image
     తిరుప్పావై-పాశురం06    *****************   " మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం    విశ్వోప జీవ్యమమృతం వచసా దుహావాం    తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం    సంతః పయోధి దుహితః సహజాంవిదుస్త్వాం."   పూర్వ పాశుర ప్రస్తావనము.   ********************  మొదటి ఐదు పాశురములలో గోదమ్మ శుద్ధివ్రతమును తెలియచేసినది.స్వామి పర-వ్యూహ-విభవ-అంతర్యామి-అర్చా మూర్తి తత్త్వమును వివరించినది.చ్గేతనులకు సులభసాధ్యతనూందించుటకై స్వామి శ్రీకృష్ణావతారమును అర్చావైభవమును వివరించి,దానిని ప్రత్యక్షముగా పొందుట               కేవలము ద్వాపర యుగమునందలివారికే పరిమితమైనందున శ్రీవిల్లిపుత్తూరును రేపల్లెగను,తననొక గోపికను భావించుకుని,తన తోటిగోపికలను వ్రతమునకు మేల్కొలిపే 10 పాశురములను ప్రారంభించుచున్నది.ఇది రెందవ భాగముగా వైష్ణవ సంప్రదాయము పరిగణిస్తుంది.    ప్రస్తుత పాశురములో అమ్మ శృఅణ భక్తికి సంకేతముగా "శబ్దము-శ్రవనము" అను రెండు అంశములను ప్రస్తావిస్తోంది.   "పది గోపికలు" తపోనిద్రలో నున్న వారు కాని తమో...

TIRUPPAAVAI-05

Image
   తిరుప్పావై-పాశురము05  ***************** " మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం  విశ్వోపజీవ్యమమృతంవచసా దుహానాం  తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం  సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం."   పూర్వ పాశుర ప్రస్తావనము   *************************  పర అవతారమైన నారాయణుని చేరుట అత్యంత దుర్లభము కనుక స్వామి పాలకడలిపై తన వ్యూహరూపమును ప్రకటించినాడు.పాలకడలిచేరుటయును పరమదుర్లభము కనుక స్వామి లీలావతారముగా"వామనమూర్తిని" ప్రస్తుతించినప్పటికిని అవతార సమయము చాలా స్వల్పము.చేసిన కార్యము ఘనమే అయినను ఒక్కటియే.అట్టి లీలావతారమునుప్రత్యక్షముగా కొలుచుట  చేతనులకు అసంభవము..నాల్గవ పాశురములో పరమాత్మ వరుణదేవుని రూపమున అంతర్యామియై ఆశీర్వదించినాడు.అంతర్యామిని పట్టుకొనుట అత్యంత దుర్లభము సామాన్యులకు.కనుక స్వామి తన అర్చారూపమును ప్రకటించుచు అందరికి సులభసాధ్యుడగుచున్నాడు.  అర్చా రూప విశేషము కదా తాను తల్లితన ఉదరమునకు కట్టినదామమునకు కట్టుబడి యుండుట.   బందీగా ఉన్న పరమాత్మ నలకూబరుల బంధవిమోచనమును కావించుట మరింత విశేషము.ఒక పక్క అవతార ధర్మపాలన చేస్తూనే-ఆశ్రిత రక్షణా పాలనమునుచేస్త...

TIRUPPAAVAI-04

Image
    తిరుప్పావై-నాల్గవ పాశురము   *********************  "మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం   విశ్వోప జీవ్యమమృతం వచసా దుహానాం   తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం   సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం."  పూర్వ పాశుర ప్రస్తావనము.  *******************    మొదటి పాశురములో మార్గళి గ్రించి,రెందవ పాశురములో నోము నియమముల గురించి,మూడవ పాశురములో వర్ష ప్రాశస్త్యమును వివరిస్తూ,ఆచార్య వైభవమును పెరుం పశుక్కళ్ అంటూ జ్ఞానమను గోక్షీరమును పుష్కలముగా అనుగ్రహించుచున్నారని తెలిపినది.అమ్మకు సంతృప్తి కలుగలేదు ఆ పరమాత్మ-ఆచార్య వైభవమును మరికొన్ని సంకేతములతో స్పష్టము చేస్తున్నది.    స్వామిని-గురువును నల్లని కరుణామృత మేఘముతో పోలుస్తూ,ఏ విధముగా సముద్రపు ఉప్పునీటిని సూర్యకిరణములవేడితో పైకి గ్రహించి,వానిలోని దోషములను హరించి,మంచినీటిని వర్షించునట్లు,గురువు సైతము అజ్ఞానమనే శిష్యుల ఉప్పునీటిని తన విద్వత్తు అనే సూర్యకిరణముల వేడితో పైకి తీసుకుని,శుభ్రపరచి జ్ఞానమనే మంచినీటిని వర్షిస్తాడు.అంతేకాదు  మేఘము అన్నిచోట్ల సమముగానే వర్షిస్తుంది.గురువు సైతము తన శిష్యుల...

TIRUPAAVAI-03

Image
 తిరుప్పావై-మూడవ  పాశురము  *********************  "మాతః సముత్థితవతీ మది విష్ణుచిత్తం   విశ్వోపజీవ్యమమృతం వచసా దుహానాం   తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం   సంతఃపయోధి దుహితః సహజాం విదుస్త్వాం."    పూర్వ పాశుర ప్రస్తావనము     ********************         రెండవ పాశురములో కృత్యాకృత్య  వివేకమును   బోధించిన గోదమ్మ ప్రస్తుత పాశురములో పరమాత్మ            "లీలావతారమైన "    వామన మూర్తి (మత్స్య-కూర్మ-వరాహ-నారసింహ-వామన-    ధర్మసంరక్షనము ఒక్కపర్యాయము అవతరించి-సమస్యను    పరిష్కరించి అవతార సమాప్తిని గావించుట) అనుగ్రహమును    సోదాహరణముగా చెబుతూ ,కృత్య విభూతిని స్మరిస్తూ ,ఏ    విధముగా వామనమూర్తి మూడు అడుగులతో ధర్మమును    రక్షించినాడో-అదేవిధముగా మన బాలకృష్ణుడు సైతము మనలను       ఉద్ధరించగలడు కనుక సందేహమును వీడి నోమునకు       ఉద్యుక్తులమగుదామని ,సత్ఫలితములు కలుగుతాయని      ...