CHIDAANAMDAROOPAA-MAYIPOERUL NAAYANAARU.

"వార్ధక్యే చేంద్రియాణాం విగతగతిమతిశ్చాధిదైవాదితాపైః
పాపై రోగైర్వియోగైస్త్వనవసితవపుః ప్రౌఢహీనం చ దీనమ్ |
మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం
క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో"

 చిదానందరూపా-మయిపోరుల్ నాయనారు
*************************************

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా

 మయిపోరుల్ నాయనారు మహారాజు-శివభక్తుడు
 చిక్కుజడలు-విబూది-రుద్రాక్షల  అనురక్తుడు

 కొండకోన సేతి ప్రజల అండనున్న శివయోగి
 ధర్మముతో గెలువలేని శత్రువైనాడు  కపటయోగి

 మంత్రొపదేశమంటు రాజమందిరమును  ప్రవేశించె
 కుతంత్రమును చూడమంటు కత్తిదూసి హతమార్చె

 శత్రువును పొలిమేర దాటించగ రాజు శాసించె
 కైవల్యమును పొంద కపటయోగి సేవ కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది  చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

  సేతి (కొండజాతి) ప్రజల రాజు మయిపోరుల్ నాయనారు.ధర్మయుద్ధములో గెలువలేని శత్రువు కపటముతోనైనా గెలవాలని నిశ్చయించుకొని శివయోగి రూపములో ద్వారపాలకుడు ధూతను వలదని వారిస్తున్నా వినకుండా అంత:పురములోనికి ప్రవేశించి,రాజును కత్తితో పొడిచాడు.చూసిన ధాతను  వలదని వారిస్తున్నా, వినకుండా అంత:పురములోనికి ప్రవేశించి, నాయనారును కత్తితో పొడిచెను.చూసిన ధాతను పట్టిబంధించబోగా వలదని వారించి,శత్రువును క్షేమముగా పొలిమేర దాటించమని తన పెద్ద మనసును వ్యక్తపరచిన నాయనారును అనుగ్రహించిన పెద్ద దేవుడు,మనందరిని అనుగ్రహించుగాక.

అపకారికి సైతము నెపమెంచక ఉపకారముచేసే సంస్కారము కలవాడుమెయిపోరల్ నాయనారు.మెయిపోరల్ అనగా భగవంతుడొక్కదే "సత్యము" అని నమ్మేవాడు.మిలాడ్ నాడు ప్రాంత సైన్యాధ్యక్షుడు.తిరుక్కొయిలూరు విరాటేశ్వర స్వామి భక్తుడు.భగవంతునియందు భగవద్భక్తుల యందు సమదృష్టి కలవాడు.పొరుగు రాజైన ముత్తునాథన్ శౌర్య ప్రతీకలైన మెయిపోరల్ సైన్యమును ధర్మయుద్ధమున జయించలేక కపటయోగి రూపమున ముత్తునాథన్ తిరుక్కొయిలూరు ప్రవేశించి,అంతః పురములోనికి ప్రవేశించబోవగా ధాతన్ అను ద్వారపాలకుడు అడ్డుకొనెను.వేదవిద్యను రహస్యముగా బోధించుటకు వెళ్ళవలెనని అసత్యమాడి
లోనికి వెళ్ళెను.మెయిపోరల్ ఆ యోగిని ఉన్నతాసనముపై కూర్చుండబెట్టి పూజించుచుండగా కత్తితో నిర్దాక్షిణ్యముగా దునుమాడెను.గమనించిన ధూతన్ బంధించబోగా మెయిపోరల్ నివారించి క్షేమముగా పొలిమేర దాటించి రమ్మని ఆనతిచ్చెను.అతను తిరిగివచ్చువరకు వేచియుండి,తన కుటుంబమునకు రాజ్యము శివసామ్రాజ్యముగా భాసిల్లాలని కోరిన నాయనారును రక్షించిన సదాశివుడు మనందరిని రక్షించుగాక.

  ( ఏక బిల్వం శివార్పణం.)

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)