CHIDAANAMDAROOPAA- ARIVAAL NAAYANAARU

  " న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
   న మంత్రో న తీర్థం నవేదా న యజ్ఞః
   అహంభోజనం  నైవ భోజ్యం  న భోక్తా
   చిదానంద రూపః శివోహం శివోహం."
 చిదానందరూపా--ఆరివాల్ నాయనారు

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 కేదారేశుని ఆరగింపుకు కేసరి బియ్యము ఆకు కూరలు
 చేసిన పాకము తోడుగ నంజుటకు మామిడి ఒరుగులు

 నిత్య నివేదనము చేసెడి ధన్యుడు ఆరివాల్ నాయనారు
 హరుడు హరించెనేమో సంపదను ,పరీక్షను చేయగ

 ముతకబియ్యపు అన్నము ఆకులు ఆహారముగా తిని
 నిత్యము నిర్మల భక్తితో ఎర్రబియ్యపు విందే ఈశునికీయగ

 నేలపాలైన నైవేద్యము కృంగదీయగ కొడవలితో తాను
 నేరముచేసితిననుకొని తన మెడను కోయుట కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.



  చోళదేశమున గల "గుణ మంగళ"పట్టణమందున్న తాయినారు వేదములయందు ప్రతిష్టితుడైన పరమేశ్వరునికి ఎర్రని బియ్యముతో వండిన అన్నమును ఆకు కూరలను,మామిడి ఒరుగులను నిత్యము నైవేద్యము చేయు నియమమును ఏర్పరచుకొనెను.ఈశ్వరానుగ్రహమును మించిన సంపదలు శివుని లీలగ తరిగిపోతినను,ఏ మాత్రమును చింతించక తాను కూలి పనికి వెళ్ళి,వచ్చిన సంపాదనతో స్వామి నైవేద్యమునకు మాత్రము లోటులేకుండా చూసుకొనేవాడు.ముతక బియ్యముతో,అవి లభించనపుడు ఆకులతో తమ ఆకలితీర్చుకొని,స్వామిసేవలో సంతసమునొందెడివారు.పరీక్షకు పతాక సన్నివేశముగా సదాశివుడు నైవేద్యమును నేలపాలు చేసినందుకు,ప్రాయశ్చిత్తముగ తనమెడను కొడవలితో కోసుకొన బోయెను.ఆత్మలింగమునకై రావణబ్రహ్మ భక్తితో తనశిరమును సమర్పించినట్లు.
సంతసించినసదాశివుడు నేలబీడులోనుంచి తన చేతిని ప్రకటిస్తూ,తన చేతలతో నాయనారును కరుణించినట్లు,దానికి కారణమైన( ఆరివాల్-కొడవలి)స్మరించుచున్న మనందరిని,సదాశివుడు రక్షించును గాక.

 ( ఏక బిల్వం శివార్పణం.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)