SAUMDARYA LAHARI-15

సౌందర్య లహరి-15
పరమపావనమైన నీపాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
ఆలియే సర్వస్వమ్మన్న వాడి దారి మళ్ళించింది
గొర్రెమేధ వానిని గొప్పకవిని చేసినది
కఠినబోయవానిని ఆదికవిని చేసినది
వివరము లేని వానిని వికట కవిని చేసినది
ఆనంద మయునిగా అన్నమయను చేసినది
మూక పంచశతి గ్రంథము నీ కృపచే వెలిసినది
ఉన్న పాటుగా వారిని ఉన్నతులుగ చేసినది
వారి వాంగ్మూలములు తాంబూలము అగుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ! ఓ సౌందర్య లహరి.
" తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమప్రియ"
తాంబూల చర్వణముతో ప్రకాశించే తల్లీ అని స్తుతించబడుతున్నది.తాంబూలము అంటే,
" పూగీఫలం సంయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం"
కొందరు కర్పూర చూర్ణమునకు ముక్తాచూర్ణము అని కూడ స్తుతిస్తారు.ఇందులో ఉన్న పదార్థములన్ని దైవత్వ ప్రత్యేకతను కలిగినవి.
నాకవల్లీ క్రమముగ నాగవల్లీ గా వ్యవహరింపబడుతోంది.నాకము అనగా స్వర్గము కదా.వల్లీ అనదా తీగ.ఇంద్రుని ఐరావతమును కట్టిన స్తంభమునుండి నాగవల్లి తీగ తనంత తాను ఆవిర్భవించినదట.ఆ నాకవల్లి తీగ నుండి వచ్చు ఆకులే నాగవల్లి దళములు.అవే తమలపాకులు.
పూగిఫలము వక్కపండు.చిత్రములను మనము అంతర్జాలములో చూడ వచ్చును. ఇప్పుడు తమలపాకులో పూగి ఫలమును పెట్టి (దీనినే భోగి ఫలము అని కూడ అంటారు)అందులో కర్పూర చూర్ణమును/ముత్యాల చూర్ణమును(పొడి) కలిపి,అనేక దివ్య సుగంధములు,(అవి దైవ ప్రసాదములు కాని మనవ సృష్టి కాదు ) వేసినది శుభకర సంకేతమైనది తాంబూలము.అన్ని శుభకార్యములమును విశిష్టత కలిగినది.ఆదిశంకరుల వారు అమ్మవారి తాంబూలములో, తత్కోలము 32 ద్రవ్య సంయుతమై యుండవలెనని,వీలుకాని పల్షమున కనీసము 5 ,ఏలకులు-లవంగము-జాజికాయ-జాపత్రి-పచ్చ కర్పురమూను పంచతిక్త భరితమై సురభిళమై ఉండవలెనన్నారు.
అ జగజ్జనని మహానైవేద్యానంతరము ,భకులు అర్పించినతాంబూల చర్వణమునుచేయుచు,ఎర్రనైన కరుణతో వారిని అనుగ్రహించుచున్నసమయమున,చెంతనేనున్న నా చేతినివిడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)