SAUNDARYA LAHARI-52

సౌందర్య లహరి-51
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
అధిష్ఠాన దేవునిగ ఆ జీవుడుండగా
అచ్చులను అందముగ కంఠములో పొదవుకొని
పంచభూతములలోని ఆకాశతత్త్వముగా
పంచాక్షరి నామములోని "య"కారముగ నీవుమారి
సర్వలక్షణశోభిత స్వరములు పదహారింటిని
పదహారు దళములుగల పద్మములో ప్రకటించుచు
వాక్కును అందించుచున్న వశిన్యాది రూపములుగా
విశుద్ధ చక్రములో వింత కాంతులీను వేళ
నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
జగద్రక్షణార్థము మహేశుడు గరళమును తనకంఠమునందుంచి,దానిని శుద్ధిచేసి దోషరహితము గావించెను కనుక శుద్ధిచేయబడిన పద్మమును నీలకంఠ చక్రము అను కూడా కీర్తిస్తారు.అ-ఆ-ఇ-ఈ-ఉ-ఊ-ఋ-ౠ- ఎ-ఏ-ఐ-ఒ-ఓ-ఔ-అం-అః అను పదహారు అచ్చులను పదహారు దళములు గల పద్మములో పొదవికొని వాగ్రూపముగా ప్రకాశిస్తూ ఉంటుంది.అచ్చుల సహాయము లని హల్లులు అసంపూర్ణములు.పంచభూత సూక్ష్మరూపముగా మనలోనున్న అగ్ని సహాయముతో కుండలినీ శక్తి విశుద్ధము వరకు వచ్చి,మనము గుర్తించి సద్వినియోగపరచుకోలేకున్న తిరిగి మూలాధారములోనికి జారి నిరుపయోగమవుతుందని పెద్దలు చెబుతారు.కనుక జాగరూకతతో ఆ శక్తిని ఆజ్ఞా చక్రము వైపు మరలించుటకు సాధకుడు ఉద్యుక్తుడు కావాలి. విశుద్ధ చక్రములో వశిన్యాది వాగ్దేవతలు ప్రకటింపబడుతు కంఠస్వరముగ ప్రకాశించుచు,భక్తులచే పలువిధముల కీర్తింపబడుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)