SAUNDARYA LAHARI-67


8:00 AM (1 hour ago)

  సౌందర్యలహరి-సరస్వతి

 పరమపావనమైన  నీ పాద రజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 జిహ్వాగ్రమున వసించు సరస్వతి జ్ఞానశక్తిగా
 పలుకులే కావ్య-నాటక-అలంకారములుగా

 మీమాంస-పురాణములు తల్లి కంఠపు పైగీతగ
 ఆయుర్వేద-ధనుర్వేదములు కంఠపు నడిమి గీతగా

 చతుషష్టి కళల చతురత క్రిందనున్న గీతగా
 బాహువుల సంకల్పమే తంత్రాది రూపములుగా

 అంతర్వాహినిగా  మా ఆపాద మస్తకము బ్రహ్మజ్ఞానముగా 
 సురపూజిత  భాసురముగ ప్రవహించుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

"కేయూరాని న  భూషయంతి పురుషం హారాన చంద్రోజ్జ్వలా
 న స్నానం విలేపనం  న కుసుమం న అలంకృత మూర్ధజాః
 వాణ్యేక సమలం కరోతిపురుషం య  సంస్కృత ధార్యతే

 క్షీయంతే ఖలు భూషణని సతతం వాగ్భూషణం భూషణం"

 ఆభరణముల అలంకరించుకున్నను,విలేపనములు అలదుకొన్నను,పన్నీటి స్నానములు చేసినను,సుగంధ పుష్పమాలములను అలంకరించుకొన్నను విద్యావిహీనుడు వాక్కునే భూషణముగా గల పండితునితో సరికాలేడు.
    
      జలప్రవాహముగా సరస్వతి నదిగా,జ్ఞాన ప్రవాహముగా సరస్వతి మాతగా తల్లి ఆరాధింపబడుచున్నది.బ్రహ్మ వైవర్త పురాణ కథనము ప్రకారము మాఘశుద్ధ పంచమి ఉషోదయ శుభసమయమున మాత సరస్వతి గా అనుగ్రహించి,బ్రహ్మ జిహ్వాగ్రమున పలుకుగా మారి,బ్రహ్మచే మొదటిసారిగా పలుకుల తల్లి భావమునకు వాగ్రూపమున ఆవిర్భవించినది.పలుకు  చిగురించిన పంచమి శుభదినమును శ్రీ పంచమి-వసంత పంచమి అను పేరుతో సరస్వతీపూజలను జరుపుకుంటారు.సరస్వతీ అనుగ్రహముతో యజ్ఞవల్క్యముని కోల్పోయిన తన జ్ఞాపక శక్తిని తిరిగి పొందగలిగాడట.వాక్కు-బుద్ధి-విద్య-వివేకం-జ్ఞానం ఇలా శాఖోపశాఖలుగా విస్తరించిన సరస్వతీ మంత్రమును ఆదికవి వాల్మీకి వ్యాసుల వారికి ఉపదేశించినారట.మంత్రబలమేమిటో జగద్విదితమే.

 "శ్రీ సరస్వతీ నమోస్తుతే వరదే" అంటూ వాక్ప్రవాహమై తల్లిని వర్ణించుచున్న 
సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.
       





Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)