SAUNDARYA LAHARI-71

 సౌందర్య లహరి-మహిషాసుర మర్దిని


 పరమపావనమైన నీ పాదరజ కణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 మధుకైటభులను సంహరించితివి మాధవ సోదరి
 భండాసురుని వధించి భువన భాండము రక్షించితివి

 రక్తబీజుని అంతమొందించిన శక్తిస్వరూపిణివి
 విషంగ విశుక్రులం విషమును అరికట్టితివి

 మహిషాసురుని మర్దించిన మహిమాన్వితవి
 అవనీ పాలనకై ఎన్నో అవతారములెత్తితివి

 అంతః-బహిర్ముఖములలో  చింతలను కలిగించు
 అసుర సంహారమే నీకు అమితానందమైన వేళ

 నీ మ్రోలనేనున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.


 " జయజయహే మహిషాసుర మర్దిని"
 పై వాక్యములో ధర్మమునకు ప్రతిరూపమైన అమ్మవారు-అధర్మమే ఊపిరి యైన రంబ పుత్రుడు మహిషుడు ,ధర్మమునకు లభించిన జయము దాగియున్నవి.


  సకలదేవతా శక్తుల సమాహారమునకు-సకల దేవతలు అనుగ్రహించిన ఆయుధములు తోడై'రిపవోపి శస్త్రపూతా" (తల్లి ఆయుధముల స్పర్శ వలన శత్రువులు పునీతులగుదురు)
 అన్నట్లు మహిషాసుర సంహారమునందు ఆయుధము-వాహనము అరివీర భయంకరములైనవి.




 1.ఆయుధము.

   మహిషునిలోని అజ్ఞానము అను చీకటి (తమోగుణము),ఆడదానితో యుద్ధము అను అహంకారముతో(రజో గుణముతో) చేయి కలిపి,ఆదిశక్తి అను విచక్షణను( సత్వ గుణమును)మరగున పడునట్లు చేసినది.ఫలితముగా త్రిగుణాతీతమైన త్రిశూలముతో నిహతమైనది మహిషుని అసురత్వము.

2.వాహనము.

  మహిషుని సంహరించుటకు తల్లి సింహవాహినియై ఏతెంచినది. ఆకలియైనపుడే వేటాడు ధర్మము కలది సింహము.అధర్మము అను ఆకలియైనపుడు అసురత్వము అను ఆహారమును వేటాడినది.


    పరాకాష్ఠతనొందిన పాపములను పైకెగిరి పట్టుకొని తీసివేయుట తల్లిపైకెగురుట.తన పిల్లలను సంస్కరించుటకు తాను దిగివచ్చుట క్రిందకు దిగి,మహిషుని
హృదిపై తనపాదమును మోపుట.కొందరిని సంస్కరించి,మరి కొందరిని సంహరించి ముక్తిని ప్రసాదించుతల్లి పాదములకు అంటిన అసుర రక్తము పావన పారాణియై ప్రకాశించుచున్నదనిన,ధూర్జటి కవి పలుకులు  స్మరించుకొనుచు,పరవశించుచున్న సమయమున చెంతనే  నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.



 

 

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)