PAEYAALWAR

 అదివో-అల్లదివో-పేయ్  ఆళ్వారు

 సంభవామి యుగే యుగే -సాక్ష్యములు  హరి ఆయుధములు
 ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు

 మైలాపురమున మణికైరవ బావిలోని ఎర్ర కలువ పుష్పములో
 ప్రకటింపబడినది నందకము మైలపురాధీశునిగ

 పిచ్చిభక్తికి సంకేతమైన మహాయోగి  ముక్తిని అందీయగ
 'తిరండాల్ తిరువందాది" ని తీరుగ అందించెనుగ

 జోరైన వర్షమున తలదాచుకొనుటకు తిరుక్కవలూరులో
 అరుగుపైనముగ్గురితో పాటుగ చేరెను  నారాయణుడు

 భక్తి వెలిగించిన దీపమనే  భగవంతుని రూపమును
 దర్శించిన పొంగినవి కొంగు బంగారు స్తుతులు కరుణగ

 నిత్య-నిర్గుణ-నిరంజనుని నిరతము మది నిలుపుకొని
 పరమార్థముచాటిన పేయ్ ఆళ్వారు పూజనీయుడాయెగ.


  హరి నందకాంశము మైలాపూరులోని మణికైరవ బావిలోని,ఎర్రకలువ పుష్పములో పూదత్తాళ్వారు అవతరించిన మరునాడు ప్రకటితమాయెను.మహాద్భుతము.ఒకరి తరువాత ఒకరు,ఒకరోజు తరువాత ఒకరు.పేయ్ అను పదము తమిళభాషలో పిచ్చి అను అర్థమును తెలియచేయునది.మితిమీరిన హరిభక్తి తన్మయత్వపు చేష్టలతో నున్న వీరిని, అజ్ఞానులు పిచ్చివానిగా తలచి,పిలిచెడివారు.

 వీరి ముగ్గురిని పెరుమాళ్ళు కరుణించిన విధము పరమాద్భుతము.విని మనము తరించుటకు ప్రయత్నిద్దాము.

 స్వామి సంకల్పముతో వారు ముగ్గురు తిరుక్కోవలూరు  వెళ్ళవలసి వచ్చింది.కుండపోత వర్షము.అక్కడ వారికి ఒక ఇంటిముందు అరుగు సూత్రధారిగా మారినది.దాని వైశాల్యములో,ఒక వ్యక్తి శయనించవచ్చును.ఇద్దరు కూర్చుండవచ్చును.ముగ్గురయితే నిలబడగలుగుదురు.విశాలహృదయ సంస్కారముగల ఆళ్వారులు ఒకరి తరువాత మరొకరు అరుగును సమీపించి,నిలబడి,ఇరుకుగా నున్నను.సాటివానికి సహయముచేసి,హరి సంకీర్తనలతో ఆదమరచిపోవుచుండిరి,క్రమముగా వారికి మరింత ఇరుకుగా తోచసాగెను.మానవ స్పర్శ తగులుట లేదు.స్వామి వారికి జ్ఞానదృష్టిని ఇచ్చి,సాక్షాత్కరించెను.ధన్యోస్మి నారాయణ ధన్యోస్మి.ముదల్ ఆళ్వార్లలు ఇరుకును కలిగించిన పరంధాముని గుర్తించి,కీర్తించి,తరించిరి,అదే ఇరుకును పరమాత్మ మనలకు కలిగించి,కరుణించును గాక.
  పెరుమాళ్ తిరువడిగళే  శరణం.

  ( జై శ్రీమన్నారాయణ.)


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)