OM NAMA SIVAYA-65

మురుగ్గ నాయనారుతొండైనాడులోని తిరువెర్కాడులో జన్మించెను.చిన్నప్పటి నుండి శివ భక్తుడు.శివ భక్తులకు మధుర పదార్థములను వడ్డించి,వారు తృప్తిగా తినుటనుశివారాధనగా భావించెడివాడు. కపర్ది పరీక్ష అనగా కలిమిహరించుకుపోయినది.కాని కలిమి దూరమైనను శివ సంతర్పణల చెలిమిని వీడలేదు. శివభక్తులకు అన్నసంతర్పణలు ఆగిపోలేదు..మంచుకొండవానిమీద భక్తి ధనార్జనకు మంచిచెడుల విచక్షణను చేయనీయలేదు.అన్ని దానములలో అన్నదానము గొప్పదని ఆర్యోక్తి.
శివ సంతర్పణములకు కావలిసినధనమునకై చతుషష్టి కళలలో ఒకటైన జూదమును ఎంచుకొని,నిష్ణాతుడైనాడు.మంచు కొంద దేవుని మీది భక్తి మంచి-చెడుల విచక్షనను మరచినది.అందరిని జూదమాడుతకు పిలువసాగాడు.రానన్న వారినినిర్బంధముచేయసాగాడు.ఎక్కువ సొమ్మును పందెముగా ఒడ్డమనే వాడు.ఓడిన,ధనమును నిర్దాక్షిణ్యముగా తీసుకోసాగాడు.
ధనమును ఈశ్వరార్చనకు ఉపయోగించెడివాడు.తనకొరకు అసలు వినియోగించెడివాడు కాదు.జూదగాడిని మెచ్చిన శివుడుగా సుందరారుచే కీర్తింపబడినాడు.వేదపురీశ్వర ఆలయములోమూర్ఖ నాయనారు విగ్రహము కలదు.కార్తీక మూలా నక్షత్రమునందు భక్తులచే పూజలందుకొనుచున్న నాయనారును అనుగ్రహించిన నాగాభరణుడు మనందరినిరక్షించునుగాక.

( ఏక బిల్వం శివార్పణం.)

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)