ALO REMBAVAY-28

 ఇరువది ఎనిమిదవ పాశురం

  *********************
కరవైగళ్ పిన్శెన్రు కానం శేరిందు ఉణ్ణోం
అరివొన్రుం ఇల్లాద అయ్ కులత్తు ఉందన్నై
ప్పిరవి పిరందననై పుణ్ణియం నుం ఉడైయోం
కురైవొన్రుం ఇల్లాద గోవిందా! ఉందన్నోడు
 ఉరవేల్ నమక్కు ఇంగు ఒళిక్క ఒళియదు!!
అరియాద ప్పిళ్ళైగళోం! అంబినాల్ ఉందన్నై
చ్చిరుపేర్ అళైత్తనవుం శీరి అరుళాదే
ఇరైవా! నీ తారాయ్ పరై ఏలోరెంబావాయ్.


 ఎంతటి ధన్యులో గదా వారు.
 ****************************

 కన్నని చూచునొక్కతె-కనుసన్నల దాచునొక్కతె
 బింకముపోవు నొక్కతె-బిగి కౌగిట దాచునొక్కతె
 జలమును చల్లు నొక్కతె-జలజంబును తురుమగ కోరునొక్కతె
 దరహాసము చేయుచు దాగునొక్కతె-దరిచేరగ పిలుచు నొక్కతె
 పరిహాసముచేయుచు నొక్కతె-పర్యంకమున పరుండబెట్టొకతె
 తనవాడే-తనవాడే -తనావాడేననుచును తాదాత్మ్యము తోడుగ
 పరవశులైన పడతులతో -పలు-పలు లీలల ప్రకటనములతో
 యదుకులభూషణుని పొదివిన యమునాతటి ఎంతటి 

      భాగ్యశాలియో
 రసరమ్యతనొంది తరించెను రమణీరమణుల రాసలీలలన్.

 అవ్యాజకరుణా సాగరాయనమః
 ****************************

 ఈ పశురములో గోదమ్మ మనకు నాలుగు విశేషములను వివరించుచున్నది.

1 మొదటిది-

 కురై ఒన్రుం ఇల్లాదె గోవింద-

 ఓ అంబినాల్-ఓ మూర్తీభవించిన ప్రేమ స్వరూపమా-స్వామి ఇప్పుడు మాలే-వ్యామోహము కాదు.దానిని దాటిన ప్రేమమయమ ప్రసాదగుణము.

  గోపికలు కిందటి పాశురములో స్వామిచే అనుగ్రహింపబడిన ఆభరణములు-వస్త్రములు ధరించి దేవభ్రాంతిని తొలగించుకొని పరిణితిచెందిన ప్రాభవముతో పరమాత్మతో మమేకమవుతున్నారు.

 వారు స్వామియే ఉపాయము-ఉపేయముగా భావించినారు.

  ఉపాయములను రెండు విధములుగా,

 1సిధ్ధోపాయము
 2. సాధ్యోపాయము అని రెండు విధములుగా వర్గీకరిస్తారు పెద్దలు. ఇక్కడ గోపికలు స్వామితో వారి దినచర్యను వివరిస్తు,

  గోవులే మా గురువులు.కనుక మేము వాటివెనుక నడుస్తు అనుసరిస్తాము.అలా అడవులలోనికి వెళ్ళి,అక్కడ మేత మేస్తున్నాప్పుడు,మేమును మా చద్దిమూటను విప్పి ఉణ్పోం-తింటాము.అంతే కాని స్నానజపతపములు అనుష్ఠానములు మాకు తెలియవు.

" కరవైకల్-గోవుల వెనకాల
  కానం సేరిందు-అడవికి చేరుతాము.వెళ్ళి 
  ఉణ్వోం-చద్దిని తింటాము.

  ఇది బాహ్యార్థము.కొంచము పరిశీలితే గోవులు-వేదములు వానిని అనుసరించుట , అలా అనుసరిస్తూ అరణ్యమును చేరుట వేదాంతసారమును-ఉపనిషత్తులను తెలిసికొనుట.అక్కడ చద్దితినుట అనే "ఉణ్పోం" వాటి సారగ్రహణమును చేయుట.

 గోపికలు అకారత్రయమును అనుసరించుచున్నవారు.

 అనన్య శరణము-అనన్య  ఉపాయము-అనన్య భోగము.మన గోపికల పరిస్థితి.
  వారికి కావలిసినవి స్వామి ఒక్కడే అందీయగలడని శరణువేడారు.వారి వ్రతమునకు కావలిసిన వస్తువులు-మనుషులు-వాయిద్యములు స్వామియే అందీయగలడని,
స్వామిని  ఉపాయముగా అనుకున్నారు.భక్తి పరి పక్వమై స్వామిని ఉపేయముగా  పొందకోరుతున్నారు.వారికి కావలిసినది,వారి కోరిక తీరుటకు కావలిసినది,వారిని సంపూర్ణ సంతుష్టులను చేయగలిగినది స్వామి యని తెలియచేయుటయే "అకార త్రయము".


 స్వామి మీరు మమ్ములను మీకు నేను పఱను అనుగ్రహించాలంటే మాకున్న ఏ అర్హతను అనుసరించి అనుగ్రహించగలను అంటావా స్వామి.

 మీరు అడవికి ఆవులను తీసుకుని వెళ్ళేటప్పుడు ఏమైన దేవాలయములను-ముని ఆశ్రమములను దర్శించిం సేవించారా అని అడుగుతావేమో? లేదా ఏదైనా మంత్రమును జపించారా? అని అడుగుతావేమో? లేదా యంత్రములను స్థాపించారా? అని అడుగుతావేమో.అవన్నీ సాధ్యోపాయములు.అవి కొందరికే సాధ్యములు.మేము కేవలము మా కులవృత్తిగా ఆవులను మేపుట పాలుపితుకుట మా జీవనమునకు చేస్తాము కాని ఇంకేమి శాస్త్రములు-స్తోత్రములు మాకు రావు.ఎందుకంటే మేము,


  అరియాద పిళ్ళైగళుం-లోకజ్ఞానము లేనివారలము

   అనగానే స్వామి వారితో ఏదైనా/కనీసము ఒకటైనా/ఒకే ఒక అర్హత లేనివారిని  నేనెలా అనుగ్రహించగలను అని అన్నాడట.

  దానికి వారు స్వామి మా దగ్గర సాధ్యోపాయము లేదన్నాము కాని అసలు అర్హతే లేదనలేము.
  మేము,

  ఒన్రు అరిన్ర-ఏ ఒక్క జ్ఞానము 
  ఇల్లాదై-లేనివారమైనప్పటికిని
  ఉందన్-నీవు జన్మించిన/నీదైన
  ఆయిర్ కులత్తిల్-గొల్ల కులములో/గోకులములో
  పిరవి-పుట్టినవారలము.(సిధ్ధోపాయము)

   పైగా మన బాంధవ్యము
 ఉన్ ఉరవేల్-మన మధ్య నున్న బంధము/అర్హత
  ఇక్కడ-ఇప్పుడు-ఎప్పడు
 ఒళిక్క-ముందెవరు విడదీయలేదు
 ఒళియాత్తు-ఇక ముందు విడదీయబోరు.

  అదితప్ప మాదగ్గర ఇంకేమి అర్హతలేదు.

 అర్థులుగా మా అర్హత సరిపోదేమో కాని,

 అంబేనాల్-ప్రేమమూర్తి,

 నీ అనుగ్రహమునకు ఎటువంటి పరిమితులును లేవుకద.

 మేము తెలియక, మా అజ్ఞానముతో నిన్ను చిన్న చిన్న పేర్లతో పిలిచినామని కోపగించుకొనక
 ఓ ఇరవై- ఓ ఇహపరదాయకా
 నీ తారై పఱై-పర(ము) ను అనుగ్రహింపుము అని అర్థించుచున్న గోపికలను ఉధ్ధరిస్తున్న గోదమ్మ చేతిని పట్టుకుని మనము పఱ(ము) ను అనుగ్రహించమని వేడుకుందాము.

   ఆండాళ్ దివ్య తిరువడిగళే  శరణం.

 
 
 


 
 
 


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)