tiruvembaavaay-10

  తిరువెంబావాయ్-10

 *****************

 పాదాళం ఏళినుంకేళ్ శొర్కళియు పాదమలర్
 పోదార్ పునైముడియం ఎల్లా పొరుల్ ముడివే

 పేదై ఒరుప్పాల్ తిరుమేని ఒన్రల్లన్
 వేదముదల్ విణ్ణోరం మణ్ణుం తుదితాళం

 ఓద ఉళవ ఒరుతోళన్ తొండరుళున్
 కోదిల్ కులత్తరంతన్ కోయిర్ పిణ్పిళ్ళైగళ్

 ఏదవన్ ఊర్ ఏదవన్ పేర్ ఉట్రార్ అయళార్
 ఏదవనై పాడుం పరిశేలో రెంబావాయ్.


 విశ్వరూపాయ పోట్రి
 ***************



 పాదాళం-కీడ ఏడు లోకంబులు

 భూమీకీడ-కింద నున్న ఏడులోకములను దాటి-అతల పాతాలమును దాటి,
 కీడన్ కీడన్-కిందకు కిందకు వెళ్ళి ఇక్కడున్నదని చెప్పలేక ఉన్నది.

 పోదుల్-పోయినప్పటికిని, ఎక్కడికి?
 పునై పునై ఇంకొంచము ముందుకు-ముముకు పోయి

 తెలిసికొనుటకు సాధ్యముకానిది స్వామి పాదము.
 ఎల్లా పొరుల్-అన్ని రూపములు తానుగా నున్నది.స్వామి వ్యాపకత్వము చెప్పరానిది.

 అంతేకాదు,

 పేదై ఒరుప్పాల్-శరీరములో సగము అమ్మకిచ్చియును,
 తిరుమేని-పవిత్ర స్వరూపముతో,
 ఒన్రల్లన్-ఒక్కరుగా/అర్థనారీశ్వరుముగా శోభిల్లు,
 వేదముదల్-వేదమూలమును/స్వరూపమును,
 విణ్ణోరం-దేవతా సమూహములు,
 మణ్ణన్-మానవులు,
 ప్రయత్నించి చివరకు,
 ఒరుత్తోళన్-ఇది ఒకే స్వామి స్వరూపమని,
 ఓద ఉళవ-వీడొక్కడే ఇదిగో అని ప్రత్యేకముగా,
 చెప్పలేక పోయారు.దానికి కారణము స్వామి,
 తొండ-ఉళన్-మనలోనే అంతర్యామిగా ఉన్నాడుకదా.
 స్వామినిది
ఏదవన్-ఊర్? ఏవూరు అని ప్రశ్నిస్తే?ఇది అని చెప్పనలవికానిది.
ఏద వన్ పేర్? అని ప్రశ్నిస్తే? ఇది అని చెప్పనలవికానిది.
 ఏది పెణ్ పిళ్ళైగల్? ఏది కుటుంబము? అని ప్రశ్నిస్తే చెప్ప నలవి కానిది.
 అంతే కాదు
 యారు ఉట్రావ? యార్ అయిళార్?
 ఎవరు కావలిసినవారు? ఎవరు కానివారు స్వామికి అని ప్రశ్నిస్తే?
 అరంతన్-హరి అంతయు యుండి.అందరిని తనవారిగా రక్షిస్తాడని స్వామిని గురించి,
ఏది అవనై పాడం-ఏమని కీర్తించగలవారలము,
మున్ను ఎందరోకీర్తించినప్పటికిని అది పరిపూర్ణముగా లేదు కనుక అది అసాధ్యము.


 ఈ పాశురములో తిరుమాణిక్యవాచగర్ స్వామి సర్వతర్యామితత్త్వమును నిర్గుణ్ నిరాకార నిరంజనత్వమును ప్రస్తుతిస్తూనే మనలను అనుగ్రహించుటకు మనకై సుందరేశునిగా మన దగ్గరకు వచ్చినాడు.

 ఏదవన్ ఊర్?
 సర్వాంతర్యామి నీది ఏవూరు అని అడుగలేము 
 ఏదవన్ పేర్?
 నీ పేరిమిటి? అని కూడ అడుగలేము.
 
 ఎందుకంటే స్వామి ఒక్కక్క క్షేత్రములో ఒక్కొక్క పేరుతో వారణాసిలో విశ్వేశ్వరునిగా,శ్రీశైలములో మల్లికార్జునిగా,చిదంబరములో నటరాజుగా కీర్తింపబడుచున్నాడు.మనలను అనుగ్రహించుటకు నానా నామములతో,నానా రూపములతో నానా ప్రదేశములలో మనకు అనుకూలముగా సేవించి అనుభవించుటకు ఆవిర్భవించుచున్నాడు.

  పోనీ ఊరును తెలుసుకొందామంటే స్వామి పాదపద్మములు పాతాళములు కంటే కిందకు కిందకు చొచ్చుకొని ప్రకాశిస్తున్నాయి.ముఖారవిందము హరకేశునిగా విస్తరించి పైకి పైకి పాకుతూ ఆకాసమును ఆక్రమించి అధిగమించి సకల రహస్యములను తన జటలలో బంధించుకొని అవసరమైనప్పుడు మాత్రమే కొంచము కొంచము ప్రకటిస్తు, మనలను కరుణించు శివనోమునకు కదిలి వెళదాము.

 అంబే శివ దివ్య తిరువడిగళే శరణం.
 

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)