PASURAM-14

తిరు చిట్రంబలం-పాశురం-14 ***************************** కాదార్ కుడైయాడ పైపూం కళాలాడ కోదై కురళాడ వండిన్ కులామాడా సీద పునలాడి చిట్రంబలం పాడి వేదపొరుళ్ పాడి అప్పొరుళ్ ఆమా పాడి శోది తిరం పాడి శూట్కొండ్రై తార్పాడి ఆది తిరం పాడి అందం ఆమా పాడి పేదిత్తునమ్మై వళర్తెడిత్తు పే వళిదన్ పాదత్తిరం పాడి ఆడేలో రెంబావాయ్. ....... నామ సంకీర్తనం యస్యా సర్వ పాప ప్రణాశనం ప్రణమో దుఃఖ శమనం తం నమామి హరి పరం. యుగధర్మముల ప్రకారము భగవంతుడు భక్తసులభునిగా తన కరుణా వీక్షణములతో కైవల్యమును అనుగ్రహిస్తున్నాడో, ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు వివరిస్తున్నారు. కృత యుగములో పాటించబడిన కఠోర నియమములను కొంతవరకు మినహాయించి,త్రేతయుగములలో యజ్ఞ-యాగాదులతో కఠిన నిబధ్ధతతో భగవదనుగ్రహమును పొందిన మహాత్ములగురించి మనకు వివరించబడినది. అదే భగవదనుగ్రహము ద్వాపర యుగమునకు అన్వయించుకుంటే వారు భగవంతుని చెలికానిగా /సఖునిగా భావిస్తూ ఆడుతూ-పాడుతూ,చల్దులారగిస్తూ,ఛలోక్తులను విసురుకుంటూ చరణసేవా సౌభాగ్యమును పొందిరనుటకు ఉదాహరనము మ్నకు లభించుచున్నవి. కాని కలిపురుషుని ప్రభావమేమని చెప్పగలము.ఇంతకు ముందు యుగములలో సులభసాధ్యమనుకున్న అగ్నికార్యములు-ఘోర తపములు ఆచరించుట కడు దుర్లభమైన తరుణమున,నిర్హేతుక కృపతో పరమాత్మ తనను తలచినంతనే తరలి వచ్చి మనలను తరింపచేయుచున్నాడనుటకు నిదర్శనమే చెలులు స్వామిని గురించి చేయుచున్న సంకీర్తనమే. దీనికి ఆచార-వ్యవహారములు లేవు.ఆసన నియమము-ఆహార నియమము అసలే లేదు.పాండిత్య ప్రకర్ష కు ప్రాముఖ్యత లేనే లేదు. మనము ఈ సంకీర్తనమును సర్వకాల సర్వావస్థలయందును చేసుకొని సద్గతిని పొందవచ్చును. అదియే - 1) సో-హం అని మనలోని శ్వాసలు చేయుచున్న అజపామంత్రము. 2) లబ్-డబ్ అని మన గుండె చేయు నాద జపము. 3) స్తోత్రాణి సర్వం గిరో-నా వాక్కులన్నియును నీ స్తోత్రములో అన్న భావనను మనము అన్వయించుకుంటే, సర్వము సంకీర్తనమయమే-సకలార్థ సాధనమే.స్వామి చరణాశ్రితమే-సకల సౌభాగ్యప్రదమే. తిరుమాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో రెండు విషయముల గురించి నొక్కి వక్కాణించారు. అవి ఒకటి-పాడి అన్న పదమును పదే పదే ప్రయోగించారు. రెండవ్ది ఆడి అన్న పదమును పదే పదే ప్రయోగించారు. పాడి అన్న పదము సంకీర్తనా భక్తి విభాగమైన భక్తునకు అన్వయించుకుంటే, ఆడి అన్న పదమును సంంఓహనా అనుగ్రహరూపమైన పరమాత్మకు అన్వయించుకోవచ్చును. అంటే పరమాత్మ పట్టువిడుపు అన్న ఆటను మనతో ఆడుచున్నాడు. మనము పరమాత్మ పాదములను పట్టుకోవాలంటే ఇంకొక దానిని విడిచివేయాలి. ఒకసారి పరమాత్మ పాదములను పట్టుకోలేకపోయినామనుకోండి నిర్హేతుక కృపతో మనౌ మరొక ఉపాధిని ఇచ్చి మరల దాని ద్వారా తనను పట్టుకోమంటాడు. తిరుమాణిక్య వాచగరు మనకు ఈ పాశురములోని చెలుల ద్వారా, స్వామి చిట్రంబలం నుండి, సకల జగములను తనలో నిక్షిప్తము చేసుకొనిన ఆకాశ తత్త్వము నుండి (నిరాకారమునుండి) మనలను అనుగ్రహించుటకు తనను తాను విస్తరించుకొనుచు,ఒక్కొక్క భూతమును సృష్టించి,దానిని తనకు సహాయము అని మనము భావించుకొనునట్లు,పంచభూతములను పంచ తన్మాత్రలను,పంచేంద్రియములను సమ్మిస్రితము చేసుకుంటూ, ఇందుగలడందులేడను సందేహము వలదు-పోతనామాత్యుడు వివరించినట్లు, తనకు అవసరములేక పోయినప్పటికిని ఆకాస,వాయు,అగ్ని,జల,పృధ్వీ తత్త్వములుగా తనను ఆదిగా-అంతముగా /సాకారముగా , ఆర్తా పిరవి నుండి జీవులను అనుగ్రహించుటకు, శూట్కొండ్రై తార్పాడి అని తుమ్మిపూల మాలాంకృతుదైన సాకారునిగా కీర్తించారు. ఇదంతయును స్వామి లీలా వైభవ విశేషములు.ఆటలు. స్వామి ఈ ఆతలోని అంతరార్థమును కనుక మనము పరిశీలించగలితే ధన్యులమే. భగవదనుగ్రహమైన ఉపాధిని ,ఏ విధముగా మనము నదిని దాటుటకు మాత్రమే నావను ఉపయోగిస్తామో అదే విధముగా సంసారజలధిని దాటుటకు మాత్రమే ఉపయోగించాలి.మన ధ్యేయము స్వామి చరణములను శరణుకోరుట.మన పట్టు స్వామి చరణాశ్రయమును పొందిన ఎంటనే ఉపాధిని విడిచిపెట్తగలిగి/దానిమీది ప్రీతిని విడిచిపెట్తగలగాలి. మనకు ఈ ఉపాధి ఒక సాధనము మాత్రమే కాని సర్వస్వము కాదు. ఈ తత్త్వమును తెలిసిన/ఆచరిస్తూ అనుభవిస్తున్న చెల్లులు మడుగులో జలకములాడునపుడు, వారి కుండలములు,ఆభరనములు,కేశములు,కేశములలో అలంకరించుకొనిన పుష్పములు,పుష్పములపై వాలిన తుమ్మెదలు సకలము సంకీర్తనములై స్వామి పాదములను పొందకలిగినవి. మనము ఆడుతు-పాడుతు పాదములను పట్తుకోగలిగితే అమ్మ తన కంకణముల కరములతో మనలను ఉధ్ధరిస్తుంది. పేయ్వళిదన్-కరుణ అనే కంకణములదాల్చిన కరములుగల, అమ్మ నమ్మై-మనలను వళర్తెడుత్తు-మనలను అనుగ్రహిస్తుంది. అంబే శివే తిరువడిగళే శరణం.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)