BHAAVANAAMAATRA SAMTUSHTAA-SAMPADAAYA YOGINULU

 


 భావనామాత్ర సంతుష్టా-సంప్రదాయ యోగినులు

 ********************************


 14 మంది సంప్రదాయ యోగినులు హృదయస్థానమైన సర్వసౌభాగ్యప్రద చక్రమునందు విరాజిల్లుతు సాధకుని మార్గమును సుగమము చేస్తుంటారు.వీరు నాడీ మండలమును పరిరక్షించుచుండుటయే కాక భావోద్వేగములను క్రమబధ్ధీకరిస్తు అనుగ్రహిస్తుంటారు.

 సంక్షోభిణి,విద్రావిణి,ఆకర్షిణి,ఆహ్లాదిని,సమ్మోహిని,జృంభిణి,స్తంభిని,,రంజనీ,ఉన్మాదిని,సర్వార్థసాధిని,సర్వసంపత్తిపూరిణి,మంత్రమయి,ముఖ్యముగా ద్వంద్వ క్షయంకరి/సర్వద్వంద్వక్షయంకరీ.

  నేను అనే దేహము నాలో దాగిని చైతన్యము రెండుగా నున్నవి అన్న భావనను పోగొట్టే పరమకరుణామయి సంప్రదాయయోగినులుగా మనలోని చిత్తభావములకు అదే మనోప్రవృత్తులకు వాటిని తొలగించే నివృత్తులకు ప్రతీకలు.

 మన్వస్రం గా కీర్తింపబడే ఈ చక్రమును పదునాలుగు లోక విశేషములుగాను కీర్తిస్తారు.

 నాడీమండలపరముగా కనుక సమన్వయించుకుంటే మానవ సరీరములోని 72000 నాడులను చైతన్యవంతముచేసే యోగినులు.

 పరదేవతయొక్క జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మనస్సు,బుధ్ధి,చిత్తము,అహంకారము అను అంతఃకరణములుగాను కీర్తిస్తారు.


 ఇక్కడ మనమొక విషయమును గమనించాలి.మనసు -చిత్తము అని చెబుతున్నారుకదా వానిని వేరు వేరుగా భావించాలా అని.పెద్దల నిర్వచనము ప్రకారము చిత్తము తనలో మనసు-బుధ్ధి-అహంకారము అను నాలుగు అంశములను తనలో దాచుకుని సమయసందర్భములను బట్టి బుధ్ధి యొక్క ప్రచోదనమును అనుసరించి మనసు సంకల్ప-వికల్పములను చస్తుంటుందట.బుధ్ధి కాస్త నిద్రాణము చేసి అహంకారము ప్రకటింపబడుతుంటుందట.అహంకారము నిద్రానముగా నున్న సమయమున బుధ్ధి ప్రచోదనమవుతుందట.చిత్తము మాత్రము నిర్వికారముగా తనలో వీటిని భద్రపరుస్తుందట.సాధకుడు యుక్తాయుక్త విచక్షణను కలిగి తన గమనమును సుగమము చేసికొనుటకు సంప్రదాయయోగినుల సహాయము చాలా అవసరము.  


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)