SREE SUKTAM-11-KARDAMAEVA PRAJAABHUTA


  శ్లోకము

 "కర్దమేవ ప్రజాభూత మయి సంభవ కర్దమ

  శ్రియః వాసర మే కులే మాతరం పద్మ మాలినీం."

 

  శ్లోకము

 "కర్దమేవ ప్రజాభూత మయి సంభవ కర్దమ
  శ్రియః వాసర మే కులే మాతరం పద్మ మాలినీం."
  

 'మనస@కామమాకూతిం" శ్లోకములో ధాన్యలక్ష్మి-విద్యాలక్ష్మి స్వరూపముగా మహా లక్ష్మి(అనుగ్రహము)తన దగ్గరకు చేర్చి,తనను సత్యవంతునిగా అనుగ్రహించమనిన సాధకుడు,ప్రస్తుత శ్లోకములో సృష్టి రచనను అనేక పర్యాయములు అవిచ్ఛిన్నముగా నిర్వహిస్తున్న "సంతాన లక్ష్మి" ని 
 విశ్వరచనలు అన్న పద్మములను ఈం అనుగ్రహిస్తున్న మహాలక్ష్మి అనుగ్రహమునకు సహాయపడమని జాతవేదుని ప్రార్థిస్తున్నాడు.
   తల్లి పద్మమాలను ధరించి ప్రకాశిస్తున్నది.ఏవిధముగా మహాలక్ష్మి జగమంతా అంతర్యామిగా నిండియున్నప్పటికిని ప్రపంచమాయను తాకనిదై వెలుగొందుచున్నదో మనము గ్రహించుటకు ,నీటినుండి బురదతో నిండిన ప్రదేశములో నుండి పుట్టినప్పటికిని ఆ నీటిని తన ఆకుపై కాని,పుష్పముపై కాని ఏ మాత్రము నిలువనీయని 
 శుద్ధ సత్వ చైతన్య మూర్తికి సంకేతమైనది.
  అతువంటి వైరాగ్యమును తరతరములకు అందీయకలిగినది పద్మమాలిని అయిన మహాలక్ష్మి.
  అమ్మ  ఆది/మూలమైన  జల స్వరూపముగా ప్రస్తుతుంపబడుచున్నది.
   
   సాంఖ్య పురాణము ప్రకారము అవ్యక్తము వ్యక్తముగా ప్రకటింపబడుతూ చేయుచున్న విశ్వరచనా విన్యాసము పద్మమాలినీ స్వభావము.
  పద్మమాలిని మాతరం శ్రియం-శుభములను కలిగించును గాక అనిఒక భావము.
 మాతరం-మంత్రం ఒకే పదము యొక్క రెండు నాదములుగా భావిస్తే,
 మంత్ర స్వరూపిణి అయిన మహాలక్ష్మి శుభములనుచేకూర్చును గాక.
 పరబ్రహ్మిణి -ప్రజాభూత -జగములను సంతతిని జీవులను సృచించినది.
  ఇంకొక మధుర భావన ఆ తల్లి మాతయే కాదు.
 ప్రజా- మానస పుత్రిక గా/సంతతిగా భూత--జనించి అనుగ్రహించినది
    మంత్రస్వరూపిణి-పద్మమాలిని-శ్రేయోదాయిని అయిన ఓజగజ్జనని నీవు కేవలము నన్ను మాత్రమే "కులే"నా షట్చక్ర నివాసము చేస్తూ అనుగ్రహించుతయే కాదు,నా "కులే"నా వంశమును కూడా 
 కేదముని అనుగ్రహించినట్లు నా సంతతిని/కులమును/వంశమును అనుగ్రహించు.
  ప్రస్తుత శ్లోకములో కర్దమ-ఇవ.కర్దమ అని కర్దమ శబ్దము రెండు సార్లు ఆవృత్తమవుతుంది.
  ఒకటి-కర్దమ ప్రజాపతిని సంకేతిస్తు
  రెండవది జలమునుండి ప్రకటింపబడిన జాతవేద
  నీవు కనుకనీ తల్లిని తోడ్కొని వచ్చి,నన్ను సంరక్షిస్తుంటే
    మయి-సం-భవ-నన్ను కూడి ఉండినట్లయితే,
  వాసర మే శ్రియం-శుభములు శాశ్వత నివాసం చేస్తాయి
   కర్దమ అన్న పదమునకు బురద/ఒండ్రెఉ అన్న అర్థమును స్వీకరిస్తే ,విష్ణుపురాణకథనము ప్రకారము,
  బ్రహ్మపదార్థము నుండి ప్రకటింపబడిన బ్రహ్మ మానస పుత్రుని అనుగ్రహించిన మహాలక్ష్మి నన్ను సైతము అదే వాత్సల్యముతో అనుగ్రహించుటకు రమ్ము.
 హిరణ్మయీంలక్ష్మీం  శిరసాం  వదామి..
  
  

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)