TANOTU NAH SIVAH SIVAM-08@SIVATANDAVASTOTRAMU


 


    తనోతు న#హ్ శివః శివం-08

    *******************

  "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

     జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ."


    స్వామి ప్రకాశమైతే అమ్మ వ్యాపినీ వివిధాకార /ఆ ప్రకాశమును సర్వత్రా వ్యాపింప చేసే విమర్శ.స్వామి స్థావరమైతే అమ్మ జంగమాత్మకము.స్వామి జంగమయైతే అమ్మ స్థావరముగా స్వామిలో ఒదిగి పోతున్నది.స్వామి తాందవిస్తున్నాడు.తల్లి స్థిరముగా తానుండి స్వామిని తాందవింపచేస్తున్నది.ఒకపరి అమ్మ అష్టమీచంద్ర విభ్రాజ.మరొకపరి స్వామి స్వామి భిభర్తు భూత భర్తరి.అర్థనారీశ్వర పరమార్థము అనిర్వచనీయము.


 " జటా భుజంగ పింగళః స్పురత్పణా మణిప్రభా

   కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిక్వధూముఖే

   మదాంధ సింధుర స్పురత్వగుత్తరీయమేదురే

   మనోవినోదమద్భుతం భిభర్త్ భూత భర్తరి."

 1.స్వామి జటలలో భుజంగము పడగలమీది మణులు ఎరుపుతో కూడిన పసుపువర్ణమైన పింగల వర్ణముతో ప్రకాశించుచున్నవి.అవి మంగలకరమైన "పసుపుకుంకుమలా" అనిపిస్తున్నవి.స్వరూపమునుతో పాటుగా తమ స్వభావమును సైతము మార్చుకుని జగత్కళ్యాణమునకై,

 2.కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే.


 దిగ్వధువుగా తనను ప్రకటించుకొనిన జగన్మాత{బాలాత్రిపుర సుందరీ స్తోత్రము కీర్తించినట్లుగా)

 1.కదంబవనచారిణీ

 2.కదంబవన వాసినీ

 3.కదంబ వనశాలయా

 4.కదంబవన మధ్యగా

   అసలు కదంబవనమునకు సర్వమంగలకు భేదమేలేదు.ఆ తల్లి ఎప్పుడును

 "సకుంకుమ విలేపనాం-అళికచుంబి కస్తూరికాం"

    కళ్యణకరముగా ఆ తల్లి నుదుటను "కదంబ కుంకుమద్రవముగా మారబోతున్నది ఆ పాముపడగలమీదున్న మణులకాంతులు.మహాద్భుతమైన వినోదము.


   ఆది శంకరులు సౌందర్యలహరి స్తోత్రములో ప్రస్తుతించినట్లు,

 "కిరంతీం అంగేభ్యః కిరణనికురంబామృత రసం"

    స్వామి అలదుతున్న కదంద్రవ విలేపనము అను అనుగ్రహమును తల్లి అమృతమయముచేసి మనందరి[పై వర్షింపచేయుట ఎంతటి పరమాద్భుతము.

 3.మదాంధ సింధురస్పురత్ త్వగుత్తరీయనేదురే.

     తమోగుణమనే నల్లదనముతో/లోపలి అరిషడ్వర్గములు ప్రస్పుటముగా బాహాటము అవుచున్నవేళ ఆ గజ చర్మము మరింత నల్లగా-మందముగా స్పర్శను గ్రహించలేనిదిగా ఉన్నప్పటికిని,స్వామి కరస్పర్శచే పునీతమై ప్రకాశిస్తున్నడట.

   మహాద్భుతమైన వినోదము.స్వామిలీల.

   విషయవాసనలనే విషముతో నిండిన మనము సైతము స్వామి అనుగ్రహస్పర్శచే ప్రాకాశించగలముపాము పడగమీద నున్న మణుల కాంతుల వలె పింగళవర్ణముతో.

    అరిషడ్వర్గముల అధీనములో యుక్తాయుక్త విచక్షణమును కోల్పోయి జడము వలె మారిన మనము సైతము స్వామి కరస్పర్శచే ప్రకాశవంతమైన ఉత్తరీయములుగా మారగలము.

 పాముమణి-మదపుటేనుగు కేవలము సామూహిక సంకేతములే.

  4.మనోవినోదమద్భుతం భిభర్తు భూత భర్తరి.

    భూతభర్తరి-పంచభూతాత్మకమైన పరమేశ్వర తత్త్వము

  భిభర్తు-భూతభృత్-ప్రపంచముగా ప్రకాశిస్తున్నది.

   ప్రపంచముగా ప్రకాశిస్తున్న పరబ్రహ్మము యొక్క అద్భుత మనోవినోదముతో అంతర్లీనమవ్వాలనుకుంటున్నది నా మనసు.


   విశేషములు

   **********

 1 నలుపు-పింగళ వర్ణములను దివారాత్రములుగా.సూర్యోదయ-సూర్యాస్తమయముగా కాల నిర్దేశము కావించుట

 2.విశ్వేశ్వర తాండవమే విశ్వపరిభ్రమణము .

 3.ప్రపంచకళ్యానమే పార్వతీపరమేశ్వర కళ్యానము

 4.జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ.

       తల్లితండ్రులను సంస్కృత భాషలో పితరౌ అంటారని పెద్దలు చెబుతారు.

     కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ

      భజశివమేవ నిరంతరం.

   ఏకబిల్వం  శివార్పణం..


    


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)