TANOTU NAH SIVAH SIVAM-11@SIVATANDAVASTOTRAMU


 


   తనోతు నః శివః శివం-11

   *******************

 "వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

  జగతః పితరం  వండే పార్వతీ పరమేశ్వరౌ"


   " కనిన జనని కన్న ఘనదయ దాయక

     ఇదియ అనుగ్రహము అరుణాచల " అంటున్నాడు రావణుడు.(ఇది నా ఊహ)


   తన తల్లి నిత్యశివపూజ-సైకత లింగము సముద్ర తరంగములచే రూపు మారుట-తల్లి ఆవేదనము-ఆత్మలింగమును అభ్యర్థించుటకై తన కైలాస ప్రయాణము-స్వామి దర్శనమునకు అనుమతించని నందీశ్వరునిపై/స్వామిపై ఆగ్రహం కైలాసమును కదిలించబోయి   తన అహంకారము అన్నీ అదృశ్యమైనవి.

  స్వామి తాండవమును తన్మయుడై చూడగలుగు దర్శనశక్తి లభించినది.

  "అళగు సుందరముల వలె చేరి నేను

   నీవు ఉందము అభిన్నమై అరుణాచలా" అంటున్నాడు.


  అవ్యాజకరుణ తథాస్తు అన్నదా అన్నట్లుగా,


    "ఓం జాతవేదసే సునవా మసోమ" అంటూ దుర్గా సూక్తము 

    శ్రవణానందమును కలిగిస్తున్నది.

    మరొక పక్కన

 " తాం ఆవహజాతవేదో లక్ష్మీం అనపగామినీం" అంటూ శ్రీసూక్తము శృతి శుభగముగా వినిపిస్తున్నది.

  " త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం " అంటూ మంత్ర పుష్పము రావణుని తంత్రులను "మహామృత్యుంజయ మంత్రమై" చైతన్యవంతునిచేస్తున్నది.

   ఎటు చూసినా అగ్ని ప్రస్తావనమే/ప్రస్తుతులే.లక్ష్మీ స్వరూపముగా/దుర్గా స్వరూపముగా/మృత్యుంజయ స్వరూపముగా ముచ్చట గొలుపుతున్నది.


  జాతవేదుడు ఎవరు? అన్న సందేహము సందడి చేస్తున్నది.

 వేద-తెలిసినవాడు-జాత-పుట్టుకలను


 సకలజగముల/సకల చరాచరముల/సకల ఉపాధుల పుట్టుకను తెలిసినవాడు జాతవేదుడు అన్న సమాధానము సంతృప్తి పరచినది.

   సంతోషముతో నున్న రావణునికి స్వామి లలాటము చత్వరముగా(యజ్ఞవాటికగా) కాంతులీనుతూ కనిపిస్తోంది.

వేదావిర్భమైనతరువాత మహాదేవుడు యజ్ఞ ప్రక్రియలను మనందరికి పరిచయము చేస్తున్నాడు.

   స్వామి లలాట యజ్ఞ వేదిక ధనంజయ స్వరూపముగా ప్రకాశిస్తున్నది.

  ధనంజయుడు అని అగ్నిని ఎందుకు కీర్తిస్తున్నాడు రావణుడు?

   నాలో కలిగిన సందేహమునకు సమాధానముగా మహాదేవుడు మరొక కథనము ద్వారా నా కలవరమును తగ్గిస్తున్నాడు.

   యుధిష్ఠరుడు,

   రాజసూయ యాగానంతరము అన్నసంతర్పణము చేయాలనుకున్నాడట.దైవలీల తన దగ్గరనున్న ధనము సరిపోనిదిగా అనిపించిందట.అర్జునా ఏమిటీ ఈ విచిత్రం?యావత్ప్రపంచము మనాధీనములో నున్నదన్న /నేను సర్వ సంపనుడనన్న నా ఆలోచన తప్పేమో అని అర్జునునితో అన్నాడట.అర్జునుడు అగ్నిహోత్రుని సహాయముతో,

 హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత్స్రజాం అనుగ్రహమును పొందాడట.ఆ నాటినుండి సహాయకుడు-గ్రహీత ధనంజయ నాములుగా కీర్తింపబడు తున్నారట.



  ఈశ్వర" లలాట యజ్ఞవాటిక" హవిస్సులతో మరింత ప్రజ్జ్వలిస్తోందట.

 స్వామి తన తన దశజిహ్వలతో పంచసాయకుని(మన్మథుని) సేవిస్తున్నాడట.

 ఆ సమయములో మన్మథుడు స్వామి1

 " నీ జ్వాల నన్ కాల్చినన్"

  "ఇల్లు విడువలాగి లోనింటిలో జొచ్చి

  "రేయి పవలు లేని బట్ట బయట

   ఇంట రమియింపగా రమ్ము అరుణాచలా"

      అంటున్నాదట.(నాఊహ)


  మన్మథుడు రావణునిలో ఆత్మలింగమును పొందుట అనుకోరికను-అది తీరలేదనే క్రోధమును-అది పొందని వేళ జగదంబపై మోహమును-ఇంకెకవరికి   దక్కకుండా తన దగ్గరే ఉండాలన్న లోభమును-అర్థిస్తున్నవేళ మదమును-స్వామి పక్కను ఉన్న తల్లిని చూసి స్వామిపై మాత్సర్యమును పొందాడు.



 అప్పటి మన్మథ కార్యము ధర్మవిరుద్ధము.ఆ బాణములను స్వామి ఆహుతులుగా సేవించి పునీతమొనర్చినాడు.

   ప్రస్తుతము పునీతమైన మన్మథ బాణములో రావణుని ప్రవర్తనలో  మార్పు తెచ్చే పనిలో నున్నవి.

  స్వామి తెరిచినది జ్ఞాననేత్రము.ఆ జ్ఞాన నేత్ర దర్శనము భక్తుని పండి తీగను విడనాడు దోసకాయగా అనుగ్రహిస్తుంది.రావణుని పరిస్థితి కూడా అదే.స్వామి కపాలము కనిపిస్తున్నది జ్ఞానసూచకముగా.స్వామి కరుణ కనిపిస్తున్నది 

 స్వామి అగ్ని సోమాత్మకము అర్థమవుచున్నది సుధామయూఖ విరాజమానముతో.

  యక్షస్వరూపునిగా గరికను కాల్చలేని అగ్నిని పరంజ్యోతి స్వరూపమై ప్రకాసవంతము చేసిన చమత్కారము తెలుస్తోంది.

  యక్ష స్వరూపాయ-జటాధరాయ నమోనమః.


 ' కన్నుకు కన్నయి కనులేక కను 

   నిను కనువారెవరు గను అరుణాచలా అంటూ "

      ప్రార్థిస్తున్న మనలనందరిని అరుణాచల అగ్నిస్వరూపుడైన ఆదిదేవుడు అనుగ్రహించును గాక.

  కదిలేది ప్రపంచము-కదలనిది పరమాత్మ

  శివ భజమేవ నిరంతరం

      ఏక బిల్వం శివార్పణం.



Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)