TIRUVEMBAVAY-12
తిరువెంబావాయ్-12
************
"కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీ వామభాగం
సదాశివం రుద్రం అనంతరూపం
చిదంబరేశం హృదిభావయామి."
సందర్భము
******
పరమాత్మను తక్క అన్యము దర్శించుటకు-కీర్తించుటకు ఇష్టపడని భాగ్యశీలురైన కన్నియలు శివనోమును ఆచరించుటకు స్నానఘట్తములోనికి ప్రవేశించి నీలలోహిత-బాలాంబిక అనుగ్రహమును మడూగులో దర్శించి కీర్తించుచున్నారు.
ప్రస్తుత పాశురములో కార్మిక-మాయక మలములు తొలగిపోయి-ఆర్ణవ మలమును సైతము ప్రక్షాళనము చేసుకొనుచున్నారు.మనకు సైతము సులభోపాయమును తెలియచేయుచున్నారు.
"పునరపి జననం-పునరపి మరణం-పునరపి జనని జఠరే శయనం" అన్న జన్మలచక్రములో పడి తిరుగకుండా కొండమీద నున్న మడుగులో స్నానము చేసే అనుగ్రహమును అందుకోకోబోతున్నారు.కనుకనే ఆ పుణ్యతీర్థము వారికి నటరాజస్వామిని దివ్యదర్శనమును ప్రసాదిస్తున్నది.
పాశురము
్్్్్్్్ఆర్తా పిరవి తుయిర్కెడ నామార్తాడుం
తీర్థన్ నట్రిల్లై చిట్రంబలతె తీయుదుం
కూత్తం ఇవ్వానం కువలతుం ఎల్లోముం
కాత్తు పడైత్తు కరందు విళయాడి
వార్తయుం పేశి వలై శిలంబ వారళైగళ్
ఆర్పరవం సెయ్య అణుకుణల్ మేల్ వండార్ప
పూత్తిగణుం పొయిగై కుడైదుడై యాన్ పొర్పాదం
ఏత్తి ఇరుంచులై నీరాడేలో రెంబావాయ్
*****
"ఆర్తా విషణ్ణా శిధిలాశ్చ భీతా ఘోరేషుచ వ్యాధిషు వర్తమాన
సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఖః సుఖినో భవంతు
"
భగవన్నామ సంకీర్తనమే భవరోగమును హరింపచేయగల ఔషధము.భవరాశి యనుగడ్డివాములను దహింపచేయగల అగ్నికణము.భవసాగరమును సులభముగా దాటింపగల నావ.భవతారకము.
జీవులకు ఆర్తిని కలిగించుచున్న కలతలను పెంచుచున్న కష్టములను కనుక మనము గుర్తించగలిగితే అవి
శ్రీ అదిశంకరులు భజగోవిందములో వచించినట్లు,
పునరపి జననం-పునరపి మరణం
పునరపి జనని జఠరే శయనం
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయా పారే పాహి మురారే
పిరవి-తిరిగి తిరిగి,
తుయిర్ కెడ-బాధలలో మునిగి
సంసారమనే జలధిలో బంధములనే మొసలిచే పట్టుకొనబడి,దానిని విడిపించుకొనలేక/చేతకాక ఉన్న సమయమున,
మనలను మనము రక్షించుకొనుటకు ఒకే ఒక మార్గమున్నది చెలులారా.
తుయిర్కెడనాం-బాధలను/ఆర్తిని తొలగించు
ఆర్తాడుం-నర్తకుడు
సాటిలేని మేటి నర్తకుని
పొర్పాదం-బంగారుకాంతులీనుచున్న పాదమును పట్టుకుని,
వార్తయుం పేశిం-లీలావిశే
షములను సంకీర్తించుదాము.
ఆ అసమాన నర్తకుకి నాట్య విశేషములే ,
కూత్తం ఇవ్వానం-ఆకాశమును సృష్టించుట,
కువలయమున్-భూమండ
లమును సృష్టించుట
భూమ్యాకాశములతో పాటుగా సమస్తమును సృజించి,
కాత్తు-సృష్టికార్యమును చేసి,
పడైత్తు-దానిని స్థితికార్యముగా పోషించుట,
తరువాత,
మూడవ భాగముగా,
పడైందు-తనలో లీనము చేసుకొనుట అను మహత్తర నాట్యమును
విళయాడి -అవలీలగా చేస్తూ మన ఆర్తిని/భవబంధములను తొలగించుచున్నాడు.
స్వామి నృత్య రూపముగా చేస్తున్న ,
నృత్యములోని భంగిమలను కనుక ఒక సారి పరిశీలిస్తే,
చేతిలోని డమరుకము-సృష్టికార్యమునకు చిహ్నముగా, కుడివైపు పైనున్న అభయహస్తము స్థితికార్య సూచకముగా,
ఎడమ ఊర్థ్వ హస్తములోని అగ్ని సంహార సంకేతముగా,
భూమికి ఆనించిన కుడిపాదము తిరోతిరోధానపు గుర్తుగా,
సగము ఎత్తి ఉంచిన వామపాదమును అనుగ్రహ అర్థముగా పెద్దలు భావిస్తారు.
***** ప్రపంచకదలిలకలు పరమేశుని కదలికల ప్రతిబింబములే కదా.
*************
స్వామి అగ్నిపాత్రను వామహస్తమున పట్తుకుని నర్తనమును చేయుటలోని ఆంతర్యమును అనుభవజ్ఞులు అందించిన ప్రకారము,
నేను-నాది అను అహంకారముతో/అజ్ఞానముతో భ్రమను నిజమనుకునే జీవులను జనన-మరణ వలయమును చిక్కుకొని కొట్టుమిట్టాడుచున్న వారిని,ఉధ్ధరించుటకై (ఒకసారి దర్శించినంత మాత్రముననే) జన్మరాహిత్యమునందించుటకై,
నటనం ఆడునే,
ఆ పరమశివుడు
భవ తిమిర హరుడు
నటనా వతంసుడై
తకధిమి తకధిమి యని,
అని సంకీర్తించువేళ,వారి ఉపాధులు సైతము దివ్యత్వమును పొందుచున్నవి.తత్ఫలితముగా వారి చేతులకు ధరించిన కంకణములు-నడుమునకు అలంకరించుకున్న ఒడ్దానము-కాలి మువ్వలు సైతము దివ్యత్వమును పొంది నామసంకీర్తనమును చేయుచున్నవి.మాయ యను అపస్మారకము స్వామి చే అణచివేయబడినది.వారి భాగ్యవశము కాకపోతే మరి ఏమిటి/వారిలో మనము ఈ మడుగులోనే కాదు గౌరిశంకర శిఖరమను కొండపై నున్న మడుగులో (మానస సరోవరములో) మునకలు వేస్తూనే ఉందాము.(ప్రమథులుగా స్వామి అనుగ్రహమును పొందుదాము)అని ఆలోచింపగలుగుతున్నారు.
మన చేతికడియాలు,నడుమునకు ఉన్న ఒడ్డాణము,
వళి-వార్కళైగళ్ శిలంబ ఇక్కడ ఆభరణములు బాహ్యములుకావు.అంతఃకరణ
ములు.నాభినుండి వెలువడు ఓంకారమే ఒడ్డాణపు సవ్వడి.భక్తిభావ కైమోడ్పు కంకణముల ధ్వని.
ఆ నామ మాహాత్మ్యమో/నామి మాహాత్మ్యమో తెలియదు కాని చెలి,
మన
అణి కుణల్-పువ్వులచే అలంకరింబడిన కేశములు
మంత్రమయములై మాహేశుని ప్రణవమును పలవరించుచున్నవి .
ప్రణవనాదము చేయు తుమ్మెదలను ఆకర్షించగా ఆనంద డోలలూగుతూ ,మన మాంస స శరీరములు మంత్రశరీరములగుచున్నవేళ శివ నోమునకు సిధ్ధమగుదాము.
అంబే శివే తిరువడిగళే శరణం.
ఏకబిల్వం శివార్పణం.


Comments
Post a Comment