Posts

   ఏక ఏవహిలోకానాం సూర్య ఆత్మాదికృత్ హరిః-భాగవతపురాణము.  ప్రంచ స్థితికి పూర్వస్థితిచీకటియే కదా.తమోగుణప్రధానులైన హర్తి-ప్రహేతిమొదలగు రాక్షసులు సూర్యభగవానుని రథమును ముందుకుజరుపుతుంటారు.  సూర్యభగవానునిప్రతికిరనము నాదమయమే.ధర్మసంకేతము.  నాదాత్మకమైన సూర్యకిరన శక్తియే గాయత్రీమంత్రము.  గాతారం ధారయతీతి గంధర్వః.గానధరులు గంధర్వులు.  చాందగ్యోపనిషత్తు సూర్యపరమాత్మ నుండిజనించు నాదమును ప్రణవముగా కీర్తిస్తుంది.  వాలిఖ్యాది మునులు సూర్యకిరనములనాశ్రయించుకుని తపోసంపన్నులుగా అలరారు తున్నారు. వారుసూర్యరథమునకు అనవరతముమంగళాశాసనములనుసమర్పిస్తుంటారు.వాలిఖ్యము నగాఖండము. ప్రతిసూర్యమాసమునందు ఒక్కొక్క ఋషి రథముకదలబోవు సమయమున దానికి ముందునిలబడి,స్వామి రథగమనమును సంకేతిస్తారట.  పాతాళలోక సాంరక్షణమునకు స్వామిని సర్పములు స్వామి రథ పగ్గములను సవరించి,పయనమునకు సిద్ధము చేస్తాయట.  ఋషులు-గంధర్వులు-యక్షులు,నాగులు,రాక్షసులు-అప్సరసలు దేవతలు అను సప్పగనములతో సేవింపబడుతూ స్వామిసర్వమంగళములనూనుగ్రహిస్తాడు.  యక్షులు వీరూపదేవతలు.వీరు స్వామి రథమునకూశ్వములనూనుసంధానముచేస్తుంటారు.భూగర్భ స...
   శ్లోకము  *******  " సర్వ మంగళమాంగల్యం సర్వపాప ప్రణాసకం    చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం."   ఆదిత్యహృదయ స్తోత్రము సర్వమంగళములకు మూలాధారము.సర్వపాపములను నశింపచేయునది.చింతాశోకనిర్మూలమునకు కారణభూతమైనది.    మనము ఆదిత్యహృదయ స్తోత్ర సారమును పదకవితాపితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు ఒక చక్కటికీర్తనతో అర్థమయేలా వివరించారు.  "నీవొక్కడివే సర్వాధారము   నిన్నే ఎరిగిన అన్నెయు నెరుగుట   అంటూనే సర్వము గురించి విశదీకరించారు.  1.నీ యందె బ్రహ్మయు రుద్రుడుఇంద్రుడు    ఆదిత్యహృదయము సైతము   ఏషబ్రహ్మాచ-విష్ణుశ్చ-శివ-స్కంద అంటూ,   దేవతలప్రసక్తి తెచ్చినది.   పరబ్రహ్మపరిపాలన నిమిత్తము తననుండి కొన్ని శక్తులను ఆవిర్భవింపచేసి వారిలో/వాటిలో తాను ప్రవేశించి పరిపాలించుచున్నాడు.  2.నీ యందె మనువులు-వసువులు-ఋషులు    సూర్యనారాయణుడు పన్నెండు సౌరమాసములకు అదే మధుమాసము-మాధవమాసము ఇత్యాది పన్నెండు విభాగములకు పన్నెండు స్వరూప-స్వభావములతో,నామరూపములతో సృష్టి-స్థితికార్యములను నిర్వహిస్తున్నాడు.ఆ విషయమునే,  3.నీ యందె ద్వ...

ADITYAHRDAYAM-SLOKAMU-29

Image
     ఆదిత్యహృదయం-శ్లోకం-29   ********************  ప్రార్థన  *******  'జయతుజయతు సూర్యం సప్తలోకైకదీపం   తిమిర హిరణ పాప  ద్వేష  దుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం  తం నమామి."   పూర్వరంగం   **********  ఆదిత్య అనుగ్రహముతో నష్టశోకుడైన రాముడు ప్రియమనస్కుడై కర్తవ్యోన్ముఖుడైనాడు.రావణుని,రాజస-తామసములను నిర్మూలించుట కు,ధర్మ సంస్థాపనమునకై ధనుర్ధారియైనాడు.  శ్లోకము  ******  " రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్    సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్."  ఉత్సాహభరిత అంతరంగముతో తనతో యుద్ధముచేయుటకు వచ్చుచున్న రావణుని వధించుట కు రాముడు కృతనిశ్చయుడాయెను అన్నది కథనము.   దీనిలో దాగిన మర్మము మహాద్భుతము.  భగవద్గీతలోని గుణత్రయవిభాగమును  మనకథనమునకు అన్వయించుకుంటే మనము సూక్ష్మమును గ్రహించినట్లే.   ఇది యుద్ధరంగము.లంకాద్వీపములో జరుగుచున్నయుద్ధము.ధర్మ సంరక్షణమునకు జరుపుచున్నయుద్ధము.  రాముడు-రావణుడు యుద్ధమును చేయుచున్నవారు.   ...

ADITYAHRDAYAM-SLOKAM-28

Image
         ఆదిత్యహృదయము-శ్లోకము-27   **********************  ప్రార్థన  ******  "జయతుజయతుసూర్యం సప్తలోకైక దీపం   తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువనవంద్యం భాస్కరం  తం నమామి.   పూర్వ రంగము   ********  అగస్త్య భగవానుడు ఆదిత్యస్తోత్ర ప్రభావమును ఉపదేశించి,మరలిన తదుపరి రాముని చింతాశోకములు దూరమయి,తనలోని శక్తిని తెలుసుకుని,ప్రియ మనస్కుడై రావణునితో యుద్ధముచేయుటకు సిద్ధమగుతున్నాడు.మనలో దాగిన శక్తి మనకు మార్గదర్శకము కాగలదు గమనిస్తే .   ప్రస్తుత శ్లోకము ఆదిత్య ఆరాధనా  విధానము  పరోక్షముగా "రాముడు అర్ఘ్యప్రదానము చేసెను" అని చెబుతూ చేతనులు పరమాత్మకు అందించవలసిన కృతజ్ఞతావిష్కారమును సూచిస్తున్నది.   ఆచమనము అనగా   భాషా[అరముగా                  ద్రవమును స్వీకరించుట,త్రాగుట.   సూర్యభగవానునికి స్థూలముగా దోసిలో జలమునునింపుకుని అర్ఘ్యమిచ్చుట,సూక్ష్మముగా ఆచమనమును చేసి  లోపలి పరమాత్మకు జలమును సమర్పించుట మనము చూ...

ADITYAHRDAYAM-SLOKAMU-26

Image
   ఆదిత్యహృదయం-శ్లోకము-26  *******************  ప్రార్థన  *****  " జయతు  జయతు సూర్యం  సప్తలోకైక దీపం    తిమిర  హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం    అరుణకిరణ గమ్యం  ఆదిం ఆదిత్యమూర్తిం    సకలభువనవంద్యం  భాస్కరం  తం నమామి."    పూర్వ రంగము    ********** యుద్ధ భూమిలో,చింతాక్రాంతుడై యున్న రామచండ్రునికి కర్తవ్యమును ఉపదేశించి,ఆత్మశక్తిని ప్రేరేపించి ,విజయమును ఆశీర్వదించి,తిరిగి యథాస్థానమునకు వెళ్ళిపోయినాడు.  తత్ఫలితముగా రాముని రాముడు నష్టశోకుడై యుద్ధమునకు సన్నధ్ధుడైనాడు.   సీతమ్మ  ఇంకా రావణాసురుని చెరలోనేఉన్నాది.రావనాసురుడు ఇంకా జీవించియే యున్నాడు.    యుద్ధము ఇంకా జరుగవలసియున్నది.అగస్త్య భగవానుడు వెళ్ళిపోయినాడు.  అయినప్పటికిని రాముని శోకము నశించిపోయినది.  సమరేచింతయాశ్రితుడైన రాముడు ప్రియమైన మనసును కలిగి,తేజస్సుతో వెలిగిపోతున్నాడట.    తేజసామపి తేజస్వి గా పూర్వ శ్లోకము  సూర్యభగవానుని కీర్తిస్తే,ప్రస్తుత శ్లోకము రాంచంద్రుని "మహా తేజః"అని విశ్లేషిస...

ADITYAHRDAYAM-SLOKAM-25

Image
        ఆదిత్యహృదయము-శ్లోకము-25   *********************  ప్రార్థన  ****  " జయతు జయతు సూర్యం సప్త లోకైక దీపం    తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం    అరుణకిరణ గమ్యం ఆదిం  ఆదిత్యమూర్తిం    సకలభువన వంద్యం భాస్కరం  తం నమామి."  పూర్వరంగము  *********  శరీర దృఢత్వమునకు ఆచరించే వ్యాయామమును తపముగా పద్మాసనమువేసికొని,సకలంభువనం-చకలము-బుకలము,ఒంటికాలిపైనిలబడి,ఆహారమును స్వల్పముగా తీసుకుంటూ చేసేవిధానమును అదియును అభీష్టసిద్దికై తపము అనుకుంటే,  ఏ అభీష్టము లేకుండా,బాహ్యముతో సంబంధము లేకుండా,సర్వకాల సర్వావస్థల యందును సత్తు-చిత్తు రెండును తానైన  పరమాత్మను ధ్యానించుమానసిక వ్యాయామము జపము.దానికి సంఖ్యా నియమము లేదు అభీష్టము కానరాదు.  ఒక విధముగా చెప్పాలంటే, తమో-రజో గుణములు తాకని శుద్ధ సత్వముతో  ఉపాధి నిరపేక్ష అనుసంధానము.   ప్రాణి చేస్తే జపము.పరమాత్మ చేస్తే అజపా విధానము.శ్వాసప్రక్రియ.  ప్రస్తుత శ్లోకములో,అగస్త్య భగవానుడు ,రావణుని నీవు సూర్యనారాయణుని అనుగ్రహముతో వధిస్తావని రామునితో   ...

ADITYAHRDAYAM-SLOKAM-24

Image
     ఆదిత్యహృదయము-శ్లోకము-24  **********************   ప్రార్థన   ********  " జయతు జయతు సూర్యం  సప్తలోకైక దీపం    హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం    అరుణకిరణ  గమ్యం  ఆదిం  ఆదిత్యమూర్తిం    సకల భువన వంద్యం భాస్కరం తం నమామి"   పూర్వరంగము   **********   సూర్య ఆరాధనము వలన ఏ విధముగా స్థితప్రజ్ఞత అనుగ్రహింపబడుతుందో వివరించిన తదుపరి,ఆరాధనము ఏవిధమైన లక్షణములను కలిగియుండాలి అన్న అంశములను వివరిస్తున్నారు.పరమాత్మ "దేవదేవుడు.జగత్పతి.     అని పరమాత్మను కీర్తిస్తూ,  త్రిగుణితం-అన్న పదమునకు మూడుసార్లు అని సంఖ్యాపరముగాను,  మూడు గుణములతో అని స్వభావ పరముగాను మూడు శభ్దమును "అనంత పరముగా 'విశ్లేషిస్తారు.  కనుకనే సహజకవిపోతన,  ముగురమ్మల మూలపుటమ్మగా -పరాశక్తిని ప్రస్తుతించారు.  అదే విషయమును అగస్త్య భగవానుడు సైతము ప్రస్తుత స్తోత్రములో,  " ఏషబ్రహ్మాచ-విష్ణుశ్చ-సివ-స్కంద-ప్రజాపతి-మహేంద్రో-ధనదః-కాలః-యమః-సూర్యః" అంటూ తెలియచేసారు.   త్రిగుణితము అన్న పదమునకు అనంతత్త్వమును అ...