Posts

TRILOKAMOHANACHAKRAMU-PARICHAYAMU-03

Image
   అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా      అని శ్లాఘిస్తున్నది పరమేశ్వరిని లలితారహస్య సహస్రనామ స్తోత్రము.   న-ఇతి,ఇది కాదు ఇదికాదు అంటూ ముందుగా చిత్శక్తి ని గుర్తించే విధానములో కానిదానిని గుర్తించి,తొలగించుకొనమని "కేనోపనిషత్తు"చెబుతోంది.   " శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా     శ్రీ గిరినిలయా నిరామయా సర్వమంగళా"   ఈ మానవ ఉపాధి ఎంత విచిత్రమైనది." ఆహార నిద్రా భయ మైథునశ్చాఅన్న నాలుగు అవసరములను తీర్చుకుంటూ,తన మనసును ఇంద్రియభోగములపై కేంద్రీకరించి,తన అవసరములు ఏ విధముగా తీరుతున్నాయి? ఎవరు తీరుస్తున్నారు? బాహ్యములో కనపడుతూనా/లేక అంతః ముఖముగానుండి  అనే ఆలోచన రానీయకుండా ఆజగజ్జనని మాయ తెరలను కప్పుతూనే ఉంటుంది.అంతలోనే దయాంతరంగయైవాటిని విప్పుతుంటుంది.   ఆ ప్రక్రియలో మనకు సులభముగా అర్థమగుటకై ఎన్నోరూపములను ధరించి,ఎన్నెన్నో స్వభావములతో,సహాయకారిగా    ఆశివప్రకాసమైన శివాని సర్వాభీష్ట సిద్ధికై,సర్వ మంగళకారిణిగా,ప్రకృతిగా/ప్రపంచముగా  తనను తాను ప్రకటించుకుని,  "ఆహో పూరిషికగా" ఆవిర్భావము చెంది వాటన్నింటికి మూలముగా/ఆధారముగా అలరారుచు...

TRILOKAMOHANACHAKRA PARICHAYAMU-02

Image
   1-    అమ్మ అనుగ్రహముతో,సిద్ధిదేవతల సహకారముతో,త్రిపురా అనుగ్రహముతో సాధకుడు రెండవ చతురస్త్రాకారములోనికి ప్రవేశించగలుగుతున్నాడు.అష్టసిద్ధులు సాధకునిలోని కొంతవరకు సహాయపడి మరింతసహాయపడు "సప్తమాతృకలకు" అదియును మహాలక్ష్మి సహిత సప్తమాతృకలు పరిచయము చేస్తున్నారు.  కొందరి భావన ప్రకారము అష్టదిక్కులే అష్టమాతృకలుగా ఆరాధిస్తారు.  స్థూలలో అష్టదిక్కులు వీరైతే సూక్ష్మములో/మన మనస్సులో చెలరేగే అరిషడ్వర్గములు+పాపపుణ్యములుగాను పరిగణిస్తారు.  అమ్మతన రూపురేఖలే వీరికి ప్రసాదించినప్పటికిని ,అమ్మ అజ్ఞానుసారముగా వీరు ప్రవర్తిస్తుంటారు.  చండీసప్శతి శివుని స్వేదము నుండి ఈ ఏడుగురు తల్లులు ఉద్భవించాయని యుద్ధభూమిలో అసురసంహారము చేసి తరించారనికూడా చెబుతారు. నిశితముగాధ్యానించినమహాయోగులు అష్టసిద్ధుల పరమార్థమే సప్తమాతృక రూపమున సాధకునికి మరింత సహాయపడతారని విశ్వసిస్తారు. 1.బ్రాహ్మీ 2.మహేశి 3.కౌమారి 4.వైష్ణవి 5.వారాహి 6.మాహేంద్రి 7.చాముండా     మహాలక్ష్మి,  యుద్ధభూమిలో పరమేశ్వరి అనుగ్రహముతో సహాయకములుగామారి ధన్యతనొందినవైనప్పటికిని,  ప్రతిమనిషి/ఉపాధి అంతరంగము మంచి-చెడు...

TRILOKAMOHANCHAKRPARICHAYAMU --01

Image
  1-  "విశృంఖలా వివక్తస్థా వీరమాతా వియత్ప్రసుః"   అని పరమేశ్వరిని ప్రస్తుతిస్తుంది లలితరహస్యసహస్రనామ స్తోత్రము.   శృంఖలములు /సంకెలలోబంధింపబడియున్నదెవరు.పరమేశ్వరి వాటిని తన అనుగ్రహముతో ఎలా తొలగిస్తున్నది అన్న అవ్యాజకరుణయే దేవీఖద్గమాలా స్తోత్రములోని నవావరణ ప్రాధాన్యము.  నిరంతరము మనలను అల్లుకుంటున్న మాయతెర మనలో దాగిన శక్తులను నిద్రాణముచేస్తూ,మనము గుర్తించలేని స్థితిలో ఉంచుతుంది.మూలాధారము తమోమయము.దానిలో నుండి ఊర్థ్వపయనము ప్రారంభించనంతవరకు పశుపక్ష్యాదులకు వలెనె మానవులకు సైతము "ఆహార-నిద్రా-భయ-మైథునస్య" ఏ సమస్తముగా ఉంటుంది.అమ్మ అనుగ్రహముతో ఇది కాదు జీవితపరమార్థము అన్న నిజమును గుర్తించి,దానిని తెలుసుకొనుటకు ఉపక్రమించెదరు.  మానవ మేథస్సు పరిమితమైనది.అమ్మ తత్త్వము అపరిమితము.కారుణ్యము కరావలంబమవుతుంది.మనము ఏ విధముగా ఒకే స్థలములో నున్న వివిధ గదులను వంటిల్లు,నిదురిల్లు,ముందుగది,పెరడు అను వివిధ నామములతో,ఆప్రదేశములో నున్నప్పుడు వివిధ ప్రవృత్తులతో ఉంటాము.అదేవిధముగాబడి-గుడి-వైద్యశాల-గ్రంధాలయము అంటూ వివిధ పనులకు అనువుగా భవనములను పిలుస్తుంటాము.  మన ఆలోచనలకు అనుగుణముగా/సులభ...

CHAKRESVARI-PARICHAYAMU

Image
   " కదంబ వనవాసినీం కనకవల్లకీ ధరిణీం    మహార్ణమణిహారిణీం ముఖసముల్లస్ద్వారుణీం    దయా విభవకారిణీం విశదరోచనాచారిణీం    త్రిలోచచన కుటుంబుణీం త్రిపురసుందరీం ఆశ్రయే."    శ్రీచక్రములో బిందురూపముగా ఏకాత్మకమైనపరమాత్మ,సృష్టిచేయ సంకల్పించి కామేశుడై,  మహత్తు-అహంకారము  శివశక్తులు  స్థావర-జంగమము  ప్రకృతి-పురుషులు గా   ప్రకటింపబడుతూ,   పంచకృత్యాసక్తులై,  పురోభవ గా శ్లాఘింపబడు పరమేశ్వరి, మూడు అవస్థలను-జాగ్రత్-నిద్రా-సుషుప్తులను మూడు కాలములను-భూత-వర్తమాన-భవిష్యత్తులను మూడుకూటములను-వాగ్భవ-మధ్య-శక్తి మూడు కార్యములను-సృష్టి-స్థితి-సంహారములను మూడు గుణములను-సత్వ-రజో-తమో గుణములను విస్తరించి తాను పర్యవేక్షించుచున్నది.  ఆ పరాశక్తియే ఒక ఆనందమయ దివ్యరూపమును సంతరించుకున్నది కనుక"త్రిపురసుందరి"గా,సర్వాంగసుందరిగా సంకీర్తింపబదుతుంది.   సర్వాంగసుందరి నవావరనములలో తన వంటి రూపురేఖా లావణ్యములు కలిగిన త్రిపురలను విస్తరింపచేసి నవమావరనములో తాను మహాత్రిపురసుందరిగా పూజింపబడుతున్నది.  త్రిపురాను ఉపసర్గనుపొందిన,  1.త్రిపుర ...

AMGADEVIS-PARICHAYAMU-02

Image
   " హంస హంసాయవిద్మహే    పరమహంసాయ ధీమహి    తన్నోహంసః ప్రచోదయాత్"   హంస మానవ ఉపాధి చేస్తున్న శ్వస ప్రక్రియ.పరమ హంస లోపలి చైతన్యము జ్వలిస్తున్న విశ్వాస ప్రక్రియ.  పరమేశ్వరి సర్వారుణ-అనవద్యాంగి అనికీర్తిస్తున్నదిలలితా రహస్య సహస్రనామస్తోత్రము.అంటే షడంగ శక్తులూనవద్యములు.లోపరహితములు.శ్రేయోదాయకములు.   షడంగదేవతల ప్రస్తావనము అంగన్యాస/కరన్యాసముల పూజాప్రక్రియలో వస్తుంది.   పరమానందము ఎక్కడో లేదు అది పరమాత్మనివాసమైన మన హృదయము లోనే ఉన్నదను విషయము మన మిథ్యాప్రపంచ వ్యామోహము అడ్డుగా నిలిచి,అర్థము కానీయకున్నది.   దానినితొలగించుకొనినతరువాత,  ప్రతిశబ్దము  ఓంకారమే  ప్రతి దృశ్యము మమకారమే  పంచభూతములు స్నేహితమే  పంచకృత్యములు పరమార్థమే.    క్షణభంగురములకు తావులేదు.   సర్వమంబామయం జగం.ప్రపంచము-పరమేశ్వరి అవిభ్  సర్వము అనాజ్యములు.అందులో నేనొక భాగము అను ఎరుకకలిగిన నాడు,సాధకుడు, 1.తనహృదయమున ప్రాణశక్తిని గుర్తించగలుగుతాడు.ఆ ప్రాణ శక్తికి తెలియని విషయములేదు.జ్ఞానమే హృదయము.కనుకనే ఆ పరమేశ్వరి  అరుణాం కరుణా తరంగితాక్షిమ...

AMGADEVIS-PARICHAYAMU-01

Image
    సనాతనములో ఉపాసనా విధానములు, ఉపాధి సహిత-ఉపాధి రహిత అని రెండు విధములుగా చెప్పబడినది.  ద్వంద్వ భావనతో ఎదురుగా ఒకయంత్రమునో/మూర్తినో/మేరువునో అసీనము చేసి తాను జీవుడనను భావనతో స్తోత్రము చేయుచు ఆ యాస్థలములలో/ఆవరణములలో పుష్పార్చనకాని,హరిద్ర-కుంకుమార్చనము కాని చేయు విధానము.  ఆపరమేశ్వరి అనుగ్రహము అవ్యాజముగా ప్రసరించినచో ఆ సాధకుడు చేయుచున్న అజపావిధానమే వానిలో తానొక ఉపాధి మాత్రమే కాదని దానిలో దాగిన ఆదిశక్తి చైతన్య స్వరూపుణియై ప్రాణశక్తి తానై అనేకానేక శక్తులుగా పంచేంద్రియములుగా భాసిస్తున్నదని తెలిసికొనిన వేళ తనకుఇన్నాళ్ళు అడ్డుగా నున్న మిథ్యాప్రపంచమును గుర్తించగలిగి,ఏకాగ్రచిత్తముతో పారమార్థికము వైపు పయనించగలుగుతాడు.  పరిపక్వతనొందిన అర్చన తన లోని షడంగములను అమ్మౌంకిని గుర్తించుటకు-అమ్మ అనుగ్రహమునుపొందుటకు సాధనములుగా మలచుకుంటాడు.  అమ్మ, "షదంగ దేవతాయుక్త" అను దివ్యానుభూతికిలోనవుతాడు.  హంస సోహం/సోహమ్హంసను గుర్తించి,  దేవిఖద్గమాల స్తోత్రమును పారాయణము చేయునపుడు,  మమఖడ్గ సిద్ధ్యర్థం మూలమంత్రేణ షడగన్యాసంకుర్యాత్" అంటూ, "ఐం-క్లీం_సౌ" అను మంత్రమును మూడుసార్లుకాన...

NITYA DEVIS-PARICHAYAMU

Image
    " ఆద్యాయాం లలితాదేవీ-అన్యాత్ పంచదశాంగనా"    లలితా నిత్యరూపేణా అన్నది ఆర్యోక్తి.     పరదేవతా ప్రకాసమే ప్రతిబింబములుగా "బిందు సమన్విట"త్రికోణము చుట్టు ఎనిమిదవ ఆవరణముగా శ్రీచక్రములో అలరారుచున్నది నిత్యామండల సంకేత నామముతో.  ఉత్పత్తి నాశనము లేనిదినిత్యామండలము.  ఆత్మచైతన్యము వైపు సాధకుని దృష్టిని శాశ్వతముగానిలుపునదినిత్య మండలము.  15 మంది నిత్యాశక్తులు అమ్మవారి రూపలావణ్యములతో నున్నప్పటికినివృద్ధి-క్షయ విషయములో వ్యత్యాసము కలదు.  అమ్మవారు షోడశి నిత్యకళ.  ఏకం-అనేకం,అనేకం-ఏకము నకు ఉదాహఋఅనముగా ఈపదిహేను శక్తులు శూన్యము నుండి-సంపూర్ణం వరకు,సంపూర్నమ్నుండి శూన్య వరకు పున్నమి-అమావాస్య నామములో కాలశక్తులుగా/జ్ఞానశక్తులుగా ,  కుండలినీ శక్తిని,నిద్రాణమైనకుండలినీ శక్తిని జాగృతపరచి,సాధకుడు తనౌనికిని కనుగొనుటకు సహాయపడుతుంటాయి.  ఆదిశంకరవిరచితసౌందర్యలహరిస్తోత్రము ఈపదహారు కళలను "షోడశాక్షరీ" మంత్రముగా భావించి కీర్తిస్తుంది.  నిత్యాశక్తులు తమకళలను సూర్యునినుండి చంద్రుని వద్దకు చేరుస్తూ ప్రకాశిస్తుంటాయి.   వైదికులు సూర్యుని ఆత్మస్వరూ...