Posts

SREESUKTAM-12-AAPAHA SRUJAMTU SNIGDHAANI

Image
   శ్లోకము  "ఆపసృజంతు స్నిగ్ధానీచిక్లీత వసతు మే గృహే  నిచదేవీం మాతరం శ్రియం వాసయ మేకులే"

SREE SUKTAM-11-KARDAMAEVA PRAJAABHUTA

Image
  శ్లోకము  "కర్దమేవ ప్రజాభూత మయి సంభవ కర్దమ   శ్రియః వాసర మే కులే మాతరం పద్మ మాలినీం."     శ్లోకము  "కర్దమేవ ప్రజాభూత మయి సంభవ కర్దమ   శ్రియః వాసర మే కులే మాతరం పద్మ మాలినీం."     'మనస@కామమాకూతిం" శ్లోకములో ధాన్యలక్ష్మి-విద్యాలక్ష్మి స్వరూపముగా మహా లక్ష్మి(అనుగ్రహము)తన దగ్గరకు చేర్చి,తనను సత్యవంతునిగా అనుగ్రహించమనిన సాధకుడు,ప్రస్తుత శ్లోకములో సృష్టి రచనను అనేక పర్యాయములు అవిచ్ఛిన్నముగా నిర్వహిస్తున్న "సంతాన లక్ష్మి" ని   విశ్వరచనలు అన్న పద్మములను ఈం అనుగ్రహిస్తున్న మహాలక్ష్మి అనుగ్రహమునకు సహాయపడమని జాతవేదుని ప్రార్థిస్తున్నాడు.    తల్లి పద్మమాలను ధరించి ప్రకాశిస్తున్నది.ఏవిధముగా మహాలక్ష్మి జగమంతా అంతర్యామిగా నిండియున్నప్పటికిని ప్రపంచమాయను తాకనిదై వెలుగొందుచున్నదో మనము గ్రహించుటకు ,నీటినుండి బురదతో నిండిన ప్రదేశములో నుండి పుట్టినప్పటికిని ఆ నీటిని తన ఆకుపై కాని,పుష్పముపై కాని ఏ మాత్రము నిలువనీయని   శుద్ధ సత్వ చైతన్య మూర్తికి సంకేతమైనది.   అతువంటి వైరాగ్యమును తరతరములకు అందీయకలిగినది పద్మమాలిని అయిన మహాలక...

GAM GAM GANESHA-2024

Image
  మహా గణపతిం మనసా స్మరామి ******************************** నలుగురి మేలును కోరి,నలుగు ముద్దతో గౌరి, పరమ శివుని స్మరియిస్తూ,"వరపుత్రుని" చేసినది. సమరమైన చేయగలుగు సామర్థ్యపు కాపరి, కర్తవ్యము శుభకర " కరివదనుని" చేసినది. తల్లిని,తండ్రిని భక్తితో చుట్టిన బాలుని వైఖరి, అగణిత వాత్సల్యముతో "గణనాథుని" చేసినది. అహంకరించు అసురునిపై మోగించిన యుద్ధభేరి, "ఏకదంతుని," "మూషిక వాహనుని" చేసింది. మేరు పలకపై దంతపు ఘంటపు వ్రాత మహా కావ్య నాటకాది ప్రియునిగా కీర్తించినది పార్వతీ పరమేశ్వర పరిపూర్ణత్వము విఘ్నములను తొలగించు వినాయకుని చేసినది. అపహాస్యము చేసిన ఆ చంద్రుని తిక్క కుదిరి, "భాద్రపద శుద్ధ చవితి" బహుళ ప్రాచుర్యము పొందినది. ................. మట్టి ముద్దలో దప్పిక తీర్చు జలము, జలములో దాగినది జ్వలనము అగు అనలము, అనలమునకు సహాయము అనువైన అనిలము, అనిలముపై ఆధారము సకల ప్రాణి జీవనము, అలలతో ఆడునది ఆ పున్నమి ఆకాశము, స్థూల,సూక్ష్మ తత్వముతో-భక్త సులభ వశత్వముతో, పంచ భూతాత్మకముగా మా మంచిని కోరుచున్న, మట్టి ముద్దతో ముద్దుగా మమేకమైనది నీ రూపు నేడు. .....................

TEACHERS DAY-2024

Image
  ఏకములో  అనేకమే గురువు-పూజిద్దాము.  *************************************** శ్రీ గురుభ్యో నమ: ************** భావి సౌభాగ్యమనే బలమైన సౌధమునకు కీలకమైన మూలధనము మీరు ఊపిరి అందిస్తున్న ఉపాధ్యాయులారా ప్రవాసాంధ్ర ప్రకాశిత ప్రాభవ జ్యోతుల్లారా వందనము- అభివందనము.  అసతోమా సర్గమయా. ------------------------- దేశాభివృద్ధి " నాది " అను బాధ్యత "పునాది" పై ఆటు పోటు తట్టుకునే దీటుతనపు " ఇటుకలను" పేర్చి ఈసు ఇసుమంతయు గానరాని ఇంగితపు "ఇసుక" చేర్చి ఐకమత్యమే బలము అను సెంటిమెంటు " సిమెంటు " తో వీడలేని దేశభక్తి" గోడలను" కట్టిస్తున్న శాస్త్రములు అందిస్తున్న " మహనీయ మేస్త్రీలు" వందనము- అభివందనము  తమసోమా .జ్యోతిర్గమయా ------------------------- కలకాలము కలపాలి అను భావపు "కలప"తో మంచి తలపులనే తలుపులను,కిటుకులనే కిటికీలను చెక్కు చెదరని ధైర్యమనే చెక్క పనిముట్లను కుసంస్కారపు" చెద" చేరకూడదనే తలపుతో చెక్క చక్కదనానికి చిత్రీలు పట్టిస్తున్న చాకచక్యము అందించే " వదాన్యపు వడ్రంగులు " వందనము-అభివందనము. -మృత్యోర్మా  అమృతంగమయా.----...

SREESUKTAM-10-MANASAH KAAMA VAAKUTI.

Image
  శ్లోకము  "మనసః కామం ఆకూతిం వాచః సత్యం  అసీమహి   పశూనాం రూపం అన్నస్య మయి శ్రీ శ్రయతాం యశః"     క్షుప్తిపాసాం మలా జ్యేష్ఠాం  అలక్ష్మీ నాశయ అని ప్రార్థించిన సాధకుడు ప్రస్తుత శ్లోకములో పాడి-పంటలను అనుగ్రహించే "ధాన్యలక్ష్మి"ని తన దగ్గర స్థిరముగా ఉండునట్లు అహ్వానించమని జాతవేదుని  ప్రార్థించుచున్నాడు.   ఓ జాతవేద-శ్రియం అసీమహి.  శ్రేయోదాయకమైన  మహాలక్ష్మిని  నా దగ్గరకు చేర్చుం.ఆ తల్లి అనుగ్రహముతో,  నా త్రికరణములు సత్యమార్గమునూనుసరించగలుగుతాయి.   అదియే నా -ఆకూతి-సంకల్పము.  నామనసః-మనస్సు-వాచః-పలుకులు-తద్వారా నేను కోరుకునే కోరికలు/కామం సత్యసంపూర్ణములై సన్మార్గమును అవలంబిస్తాయి.    తద్వారా ,  అకూతిం-సంకల్పము సిద్ధించి  నేను సంతృప్తిని పొందుతాను.దృఢసంకల్పము నన్ను అమ్మ అనుగ్రహముతో సిద్ధిని పొందేటళుగా చేస్తుంది.    తత్ఫలితముగా , పాశూనాం-రూపం-అన్నస్య మయి  అసీమహి.   పశువుల ద్వారా పాడి,పంటలద్వారా అన్నము లభిస్తాయి.ఇదిఒక భావన.   ఇంతకుముందరి శ్లోకములో "కరీషిణీం" గోమయమును ప్రసాదించే త...

SREESUKTAM-09-GAMDHADVAARAAM

Image
     శ్లోకము  " గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం    ఈశ్వరీగ్0 సర్వభూతానాం తాం ఇహ ఉపహ్వయే  శ్రియం."      క్షుప్తి పాసా మలాం అన్న సమస్యకు పరిష్కారము ప్రస్తుత శ్లోకము.    శ్రేయమును కలిగించుటకు మహాలక్ష్మికి నాప్రార్థనను వినిపించు ఓ జాతవేద!    శ్రేయ స్వరూపిణీయిన మహాలక్ష్మిని,తన పరిమళము ద్వారా భూలక్ష్మిగా ప్రకటింపబడుతున్న భూలక్ష్మికి నేను తనను నా దగ్గరగా వచ్చి నిలిచియుండమని ప్రార్థించుచున్నానని చెప్పు.     ఆతల్లి,    ప్రథ్వీ తత్త్వముతో పచ్చిలకులుగా,సౌగంధికవనములుగా ,పండ్లతోటలుగా,పంట పొలములుగా,కొండ చరియలుగా వివిధ రూపములతో తన సుగంధమును  వెదజల్లుతూ మనకు దర్శనమిస్తున్నది.    ఆ భూలక్ష్మియే తన అనుగ్రహమును పాడి-పంటల రూపముతో ప్రకటింపచేయుచు "ధాన్యలక్ష్మి" గా  దర్శనమిస్తూ ధన్యతను అనుగ్రహిస్తున్నది.    ఆకలితో పాటు దప్పికను తీర్చుటకై ఆ భూలక్ష్మియే నదీమతల్లిగా మారి జలలక్ష్మిగా కీర్తింపబడుతున్నది.   ఆ మహాశక్తియే గోవులను తన ప్రతిరూపముగా సృష్టించి పుష్టిని ఇస్తున్నది.   ...

SREESUKTAM-08-KSHUPTIPASAAMALAAM

Image
   శ్లోకము   " క్షుప్తిపాసా మలాం  జ్యేష్ఠాం అలక్ష్మీం  నాశయామ్యహం     అభూతి అసమృద్ధించ సర్వానిర్ణుద మేగృహేత్"     తనతాను సంస్కరించుకొనబడుటకు లక్ష్మీ  అనుగ్రహమునకై జాతవేదుని సహాయమును అర్థించుచున్నసాధకుడు ఇంతవరకు వారు నాదగ్గరకు రావాలి.అతి సమీపముగా ఉండాలి.నన్ను వీడకుండా నాశ్వసలో శ్వాసగా ఉండాలని కోరుతూ వచ్చాడు.    కాని వారు వచ్చిన స్థిరముగానిలుచుటకు అవకాశము లేని కొన్ని అడ్డంకులు/ఆటంకములు తనలో  ఇంకా ఉన్నాయని,అవి తొలిగితే కాని వారిని స్థిరాసీనులను చేయలేనన్న విషయమును గ్రహించాడు.   కనుకనే ఓజాతవేద! నేనడిగిన వానిని నాదగ్గరకు చేర్చేముందుగా మూడు రకములైన దురవస్థలు నన్ను వీడక ఉన్నాయి.ముందు వాటిని పూర్తిగా,"నిర్ణుద" అమ్మ కరుణపూర్తిగా/సంపూర్తిగా తరిమివేయునట్లు అనుగ్రహించమని సహాయపడుము.   పునర్జన్మతో సంస్కరింపబడాలంటే,       నాలోని,  .క్షుత్తు-ఆకలి 2.పిపాస-దప్పిక 3మలము తొలగిపోవాలి.   క్షుత్తు-పిపాస అభూతినికలిగిస్తాయాఇ.   భూతి అనగా సంపద.న భూతి అభూతి-సంపదను చేరనీయని ఒక దురవస్థ.   సమృద్ధి-పుష్కలము.ఒక...