SREESUKTAMU-02-TAAM AAVAHA JATAVEDO


  శ్లోకము


 "తాం మ ఆవహ జాతవేదో లక్ష్మిం అనపగామినీం

  యస్యాం  హిరణ్యం  విందేయం గామశ్వం పురుషానహం.


  పూర్వ శ్లోకములో లక్ష్మీదేవిని తన దగ్గరకు చేర్చమని జాతవేదుని ప్రార్థించిన భక్తుడు జాతవేదునికి మరొక విన్నపమునుచేయుచున్నాడు.

  ఓ జాతవేదుడా!

     నీవు నిత్యపూజలలో జ్యోతిగాను,అగ్నికార్యములలో  మేము అందించు యజ్ఞవస్తువులను దేవతలకు అనుకూలమగు హవిస్సులుగా చేర్చి,వారి అనుగ్రహమును అందించు సంధానకర్తగా కీర్తింపబడుతున్నావు.దానికి కారనము,

1ఆశ్రిత ఆశ్రయము

2.ఆర్ష వాజ్మయము

3.అనంత సంపద అను నీ మూడు శుభలక్షణములు.

   లక్ష్మీదేవి ప్రసన్నతను అందచేయగల జ్ఞానచైతన్యము నీవేసుమా.

  నీ ఆశ్రిత ఆశ్రయముతో నిన్ను చేరగలిగినాను.నీ ఆర్ష వాజ్మయ శక్తితో ఆ తల్లి శాశ్వతముగా నాలో నిండియుండునట్లు ,నన్ను సౌభాగ్య సౌశీల్యునిగా దీవించునట్లు చేయుము.




  ప్రస్తుత శ్లోకము రాజ్యలక్ష్మి "రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరీ'గా ,భక్తుని అనుగ్రహింపమని జాతవేదుని అర్థించుచున్నాడు భక్తుడు.
 ఓజాతవేద! అమ్మకు నే పలుకు ఆహ్వానము తాత్కాలికము కాదు.
 నా హృదయపీఠమున శాశ్వత నివాసమేర్పరచుకొనుటకై,హిరణ్యము,గోవులు,అశ్వములు,మరియును సేవకులతో పాటుగా కొలువుతీరి నేను శాశ్వత సేవాభాగ్యమును పొందుటకు సహాయపడుము.
  హిరణ్యము హితము+రామణీయకతతో కూడిన జీవితము,గోవులు -పవిత్రస్వభావము/పవిత్రమైన వాక్కులు పొంది,అశ్వముల దృఢత్వ సంకల్పబలమును పొంది ,ఇంద్రియ పటుత్వముతో అర్చించు అవకాశమును కలిగింపుము.
 "హిరణ్మయీం లక్ష్మీ మనసా స్మరామి."


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)