Posts

KALIKAMBA NAAYANAAR

కలికాంబ నాయనారు *************** " నీ పాదకమలసేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార భూత దయయును తాపస మందార నాకు దయసేయకదె" సహజకవి బమ్మెర పోతన. ఆదిశంకరులు అమ్మ వారి పాదరేణువు మహాత్మ్యమును సౌందర్యలహరి స్తోత్రములో ప్రస్తావిస్తూ,ప్రశంసించిరి. అన్నమాచార్చార్యులు సైతము, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మమురా నీ పాదము అని సర్వాంతర్యామి పాదపద్మములను సన్నుతించిరి. నవవిధ భక్తులలో నాల్గవదైన పాదశేవనము భక్తుని నిరహంకార నిశ్చల మనోసేవలకు ప్రతీకగా అనుకోవచ్చును. సామాన్య భాషలో చెప్పుకోవాలంటే మనసు చపలత్వముతో అటు-ఇటు జరుగవచ్చును /అహంకారమునకు దాసోహమవ వచ్చును కాని,నిండైన విస్తరి నెమ్మదిగానే ఉంటుంది అన్నట్లుగా నిరంతరము శరీరమును మోస్తున్నప్పటికిని,నడుస్తున్నప్పటికిని,పరుగులు తీస్తున్నప్పటికిని లేదా స్థిరముగా నున్నప్పటికిని అన్ని అవస్థలను సమానముగానే స్వీకరిస్తూ,సహనముతో ఉండేవి పాదములు. స్వామి అంఘ్రియుగళ సేవనము సూచిస్తూ శ్రీదేవులపల్లి వారు సైతము, శివపాదము మీద నీ శిరమునుంచరాదా అని , అహంకార-మమకార పోరాటములలో అహంకారము తొలగాలంటే అది మమకారమును ఆశ్రయించవలసినదే.దాన...

cheraman nayanar

ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" ఘనసారమును తెచ్చి కలియ చల్లు విధాన మనసులో సంతసము కనుల జారు విధాన కులుకు నీలపుగండ్ల తళుకు చూపులు మెరయ ఘల్లు ఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మా శివుడు-పాడెనమ్మా భవుడు" (ఘనసారము= కర్పూరము.) చిదానందరూపా-చేరమాన్ నాయనారు *************************************** కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా వీరభోజ్య రాజ్యమును వీడిన చేరమాను వీతరాగుడు తిరు అంబైలో స్థిరపడినాడు,శివారాధనను వీడని వాడు పరమేశుని ఆనగా తిరిగి రాజ్యపాలన చేయవలసి వచ్చె పశుపక్ష్యాదులు సైతము ప్రశాంతముగ పరవశించె రతిపతిని కాల్చినవానిని రాజు రజకునిలోన గాంచె విశ్వేశ్వరుడీతడేనని వినయ నమస్కారమును గావించె తాళపత్రమును వినిపించగ స్వామి బాణపతిని పంపించెగ తాళగతుల నర్తించిన మువ్వలు తరియించగ కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. చేర వంశమునకు చెందిన చేరమాన్ పెరుమాళ్ అసలు పేరు పెరుం-ము-కొత్తయారు.పట్టాభిషిక్తుడైన చేర వంశీయ పెరుం-ము-కొత్తయారు చేరమాన్ పెరుమాళ్ గా ప్రసిద్ధిచెందాడు.విషయ భోగాసక్...

SOMASIRA MAARAN NAYANAR

సోమశిర నాయనారు ******* " రుద్రం సురనియంతారం శూల ఖట్వాంగధారిణం జ్వాల మాలా వృతం ధ్యాయేత్ భక్తానాం అభయప్రదం." శివుని కరుణ అర్థముకానిది కాని అద్భుతమైనది. " యజ్" అను ధాతువుకు ఆరాధనచేయువాడు/అర్పణమును చేయువాడు అను అర్థమును కనుక గమనిస్తే యజ్ అను కర్త చేయు కార్యమును యజ్ఞముగాపరిగణింపవచ్చును.అగ్నిసాక్షిగా,అగ్ని సహాయమును కోరుతూ,యాగాగ్నిని ఉద్దీపింపచేసి అర్చించే వైదిక కార్యక్రమము. ఇందులో అగ్నిహోత్రుడు మనము అర్పించిన పదార్థములను దైవసమర్పణ మునకు అనుకూలమగు హవిస్సుగా మార్చి వారికి అందచేస్తాడు.వారు హవిస్సును స్వీకరించి ఆశీస్సులతో సుభిక్షమును కలుగచేస్తారు. ఇక్కడ మహేశ్వరత్వమే మహేంద్రత్వము.అది పరిపూర్ణమైనది విరాత్పురుషుని అవయవములే దేవతలుగా మనచే పిలువబడు శక్తులు.మహేశ్వరుడు కరుణాంతరంగుడై కర్తవ్యపాలనకై కొన్ని శక్తులను తననుండి ఆవిర్భవింపచేసి,వాటికి చేయవలసిన పనులను-విధానమును ఆదేశించి,వాటిచే అమలు చేయిస్తున్నాడు.సాధకుల ప్రయత్నములను (యజ్ఞములను) సమర్థవంతము చేస్తున్నాడు .ఈ విషయమును గ్రహించిన జిజ్ఞాసువులు తమ యజ్ఞ హవిస్సులను,తమ మనస్సులను,తమ సాధనలను బీజమైన వానికి-ఫలప్రదము ...

ERIPATTA NAYANAR

ఎరిపత్త నాయనార్ *************** ఎరిపత్త నాయనారు *************** "నీరాట వనాటములకు బోరాటంబెట్టు కలిగె పురుషోత్తముచే నారాట మెట్లు మానెను ఘోరాటవిలోన భద్ర కుంజరమునకున్". గజేంద్రమోక్షము. హరిగా ఒక అహంకారమును విడిచిన గజమును రక్షించుట-హరుని భక్తునిగా ఒక మత్త గజమును శిక్షించుట ,చిద్విలాసము కాక మరేమిటి? మన నాయనారుల జన్మనామము కన్నా వారి సత్కర్మ సంకేత నామములే సత్కీర్తిని పొందినవి. " నమస్తే రుద్ర మన్యవ ఉతో త ఇషవ నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉత తే నమః". రుద్రా! తే- నీయోక్క మన్యవే-కోపమునకు నంస్తే- నమస్కారము రుద్రా నీ కోప ప్రకటనమునకు నమస్కారము. ఉతో-మరియును తే-నీయొక్క బాహుభ్యాం-బాహువులు, కోపమును సూచించు ఆయుధములను ధరించిన బాహువులకు నమస్కారము. రుద్రమంత్రములను సనాతనులు ప్రత్యక్ష మంత్రములుగా భావించి,గౌరవిస్తారు. నీ కోపము,దానిని సూచిస్తూ నీ బాహువులలో ఒదిగిన ఆయుధములు ధర్మసంరక్షనమునకు మాత్రమే ప్రయోగింపబడును గాక. అంతే కాదు, యా తే హేతిః మీడుష్తమ య-ఏ-తే-నీ యొక్క ఖడ్గము/గొడ్డలి మీడుష్టమ- సజ్జనులను స...

VIRALMINDA NAYANAR

నాలోన శివుడు గలడు-నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకంబులేల గలడు కోరితే శోకంబు బాపగలడు." చిదానందరూపా- విరాల్మిండ నాయనారు ************************************** "బాల్యే దుఃఖాతిరేకో మలలులితవపుః స్తన్యపానే పిపాసా నో శక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితాః జంతవో మాం తుదంతి నానారోగాదిదుఃఖాద్రుదనపరవశః శంకరం న స్మరామి క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో" చిదానందరూపా-విరాల్మిండు నాయనారు ************************************ కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా అతియారులు అతిశయ ఆరాధ్యులనుచు కొలుచును విరాల్మిండు శివభక్తుల సేవయే శివార్చన అనుచు ఆనందించుచు నుండు కూరిమి సేవింప శివుని తిరువారూరుకి తీర్థయాత్ర వెడలె నేరుగ చను సుందరారు తీరుకు కోపించి పలికె శివభక్తుల చేరనీక సుందరు చేసినది శివాపరాధమనె దానిని మన్నించిన ఆ శివుడు కూడ దోషి అని నిందించె తిరువూరారుకు రానని తీర్మానించుకొనియె,త్యాగరాజును తరుముచు తిరిగి ప్రవేశించెనాయె, మహేశుని పొందుటకు మాట తప్పుట కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు ...

MURUGA NAYANARU

మురుగ/మురుగర్ నాయనార్ ********* " యోపాం పుష్పం వేద - పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమాం వా అపాం పుష్పం- పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద - యోపాం ఆయతనం వేద- ఆయతనవాం భవతి. మంత్రపుష్పము. పుష్పము-పువ్వు-సుమము-కుసుమము-శిరీషము-ప్రసూనము ఇలా అనేకానేక పదములంతో వేనిని పిలుచుకొనుచున్నామో,అవి,తీగెల/లతల నుండి,గుబురుల నుండి,మొక్కలనుండి,చెట్లనుండి,వృక్షములనుండి,మొగ్గతొడిగి పుష్పములుగా వికసిస్తున్నవి.వీటిలో కొన్ని ఒకే రంగులోను,మరికొన్ని కలగలుపు రంగులలోను,కొన్ని లేతరంగులలో,మరికొన్ని నిండు ముదురు రంగులలో అనేకానేక విధములుగా సృజింపబడుచున్నవి పరమాత్మ స్వరూపమైన ప్రకృతిచే. ఇప్పటివరకు మనము ముచ్చటించుకున్నది బాహ్య వాచ్యార్థము.అయితే అంతరార్థమును తెలుసుకోవాలనే కుతూహలము మనకు కలిగితే, " పుష్" అను పదమును స్థితికారకత్వమునకు అలంకారికులు అన్వయిస్తారు. సర్వకర్త-సర్వభర్త-సర్వహర్త అయిన పరమాత్మ మహాశక్తి చే జరుగుచున్న-జరుపబడుచున్న సృష్టి-స్థితి-సంహరణము-మాత్రమే కాక తిరోధాన-అనుగ్రహమనే పంచకృత్యములను పునరావృతముచేయుచున్న అవ్యక్తమే పుష్పము...

KOTTALI NAYANAR

" అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః." చిదానందరూపా-కోట్టలి నాయనారు కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా శివునకు ధాన్య నివేదనము శ్రీకరమనుకొను కోట్టలి గుడులలో ధాన్యవితరణము సేవను సైన్యపు నెచ్చెలి నియమములోనె సదాశివుని సందర్శించును ఎల్లవేళల తనవారిని పంపమనె తాను ఊరిలో లేనివేళల శివ సంకల్పము ఏమో ధాన్యము వారి ఇంటను భోజనమాయెను వికలముచేసెను మనసును కోట్టలి హంతకుడాయెను తల్లి-తండ్రి-బంధువుల తప్పిదము సహించనిదాయెగ భక్తుని ఆగ్రహమే భవబంధ విముక్తుని చేయగ కారణమాయెగ చిత్రము గాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారము ఆత్మ నుండి ఆకాశము,ఆకాసము నుండి వాయువు,వాయువు నుండి అగ్ని,అగ్ని నుండి నీరు,నీటి నుండి భూమి,భూమి నుండి ఔషధులు,ఔషధుల నుండి అన్నము సంభవించినది కనుక " అన్నం పరబ్రహ్మ స్వరూపము" అంటారు. అన్న వైశిష్ట్యమును తెలుసుకొనిన కోట్టలి పరమ శివ భక్తుడుచోళదేశ సైన్యాధికారి యైన నాయనారు,ధాన్య నివేదనము-ధ్యాన నివేదనము అను రెండు పాదముల అడుగులత...