Posts

ANIRVACHANEEYAMU-ADITYAHRDAYAMU(BHASKRAM-BHUVANESVARAM)-07

Image
 రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ । పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ॥ 6 ॥  ఆదిత్యహృదయ ఉపోద్ఘాత-ఫలశృతి   అనంతరము అగస్త్యుడు ప్రస్తుత శ్లోకములో స్వామి యొక్క అతిశయ గుణవిశేషములను  మనకు అనుగ్రహించుచున్నాడు.  ఇదే విషయమును విశ్వామిత్రుడు, "కౌసల్యా-సుప్రజా రామా-పూరాసంధ్యా ప్రవర్తితే  ఉత్తిష్ట నరశార్దూల-కర్తవ్యం-దైవమాహ్నికం"  అని తెలియచేసాడు.  స్వామి యొక్క ఉదయము సముద్యంతం గా ప్రస్తుతింపబడుతున్నది.  స్వామి" సమ్యక్-ఉద్యంతి" సమస్త లోకములను-చరాచరములను జాగృతము చేయుచున్నాడు.నిద్రావస్థ నుండి చేతనావస్థకు తరలించుచున్నాడు.అంటే స్వల్పకాలిక లయమును ముగించుకొని  అనుష్ఠానమును ప్రారంభించవలసిన  సమయమాసన్నమైనదన్నమాట.   సూర్య భగవానుడు భువనములకు సంపదలను-ఈశ్వరత్వమును ప్రసాదించువాడు.కనుక భువనేశ్వరుడు.భువనములను పరిపాలించువాడు.  ఇక్కడ మనము స్వామి అనుగ్రహమును-మనము చేయవలసిన అనుష్ఠానము ఒకచర్యకు గల రెండు పార్శ్వములను తెలియచేస్తున్నారు.  స్వామి రశ్మిమంతుడు.అనగా తన కిరణ ములతో సకలచరాచరములను జాగృతము చేయుశక్తి కలవాడు.  సకలదేవతా చైతన్య సంకే...

ANIRVACHANEEYAMU-ADITYAHRDAYAMU(SARVAMAANGALYAM)-06

Image
  సర్వమంగళ-మాంగళ్యం సర్వపాప-ప్రణాశనమ్ । చింతాశోక-ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ॥ 5 ॥   ప్రస్తుత శ్లోకములో ప్రవృత్తి-నివృత్తి అను రండుచిషయములు చెప్పబడినవి.అంటే కొన్ని సుగుణములను అనుగ్రహిస్తాడు-మరి కొన్నింటిని తొలగిస్తాడు ఆదియ్త్య రూపములో స్తుతింపబడుచున్న పరమాత్మ.  పాపము అనగా బుద్ధిని -విచక్షణను విస్మరించి ఇంద్రియలోలులమై ప్రవర్తించిన తీరుకు కలిగే ఫలితము.అవి మానసికము కావచ్చును-కాయకము కావచ్చును.వాటిని నాశనము చేసేది/పూర్తిగా తొలగించేది ప్రణాసనం-పరిపూర్ణముగా నిర్మూలించునది స్వామి స్తుతి.  అంతే కాదు చింత-ఆలోచనము-విచారము అను రెండు అర్థములలో చింత అను పదమును అన్వయించుకుంటే " యద్భావం తద్భవతి" అన్నట్లుగా  మన ఆలోచనాప్రవృత్తులను అనుసరించి వాటి ఫలితములు అనుసరిస్తాయి.  కనుకనే ధూర్జటి మహాకవి,  చింతాకంతయు చింత చేయరు కదా శ్రీకాళహస్తీశ్వరా అని స్వామి నిన్ను స్మరించరు మోహభ్రాంతితో అన్నాడు.  అదియే కనుక  సత్ చింతయ న శోక అని అన్వయించుకుంటే   సత్తు-చిత్తు యైన పరమాత్మను స్మరించిన-తత్త్వమును ఆలోచించినను శోకముండదు కదా అని కూడ భావింపవచ్చును.  ప్రస్తుత శ్లోకము...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(AKSHAYAM PARAM SIVAM)-05

Image
  ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు-వినాశనమ్ । జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥  ప్రస్తుత శ్లోకము సర్వాంతర్యామిని సంకేతిస్తూ,అఖిలమునకు మూలమైన ఆదిత్యహృదయ స్తొత్రమును నిత్యము జపించిన కలుగు ఫలప్రాప్తిని వివరించుచున్నది.  జయము-శివము-నిత్యము అను మూడు విశేషములు ప్రస్తావించబడినవి.పదములలో దాగిన నిగూఢార్థములను గ్రహించే ప్రయత్నము చేద్దాము.  1.ఆదిత్య అను శబ్దమునకు అనేకానేక సమన్వయములు చెప్పబడినవి.  ప్రణవముగా ఆదిత్యశబ్దము కీర్తించబడుతున్నది.  ప్రకాశముగాను స్పష్టమగుచున్నది.  కాలగమనమునకు సంకేతముగాను నిర్ధారింపబడుచున్నది.  కిరనముల ద్వారా ప్రత్యక్ష వ్యాపకత్వముతో పరిపాలించుచున్న పరమాత్మ అనుట నిజమే.    హృదయము అనగా మూలము.అనంతవిశ్వరచనకు ఏది మూలమో,అనంతవిశ్వభ్రమణమునకు ఏది కారనమో,అనంత పోషకత్వమునకు ఏది ప్రధానమో,అనంత వికాసమునకు ఏది ఆధారమో అదే ఆదిత్యహృదయము.  సాహిత్య పరముగను-సాంకేతిక సమన్వయమునకు అనుసంధానము చేయుచున్న అద్భుత చేతనాశక్తియే ఆదిత్యహృదయము.  జపము అను పదము  అట్టి మహత్తర చైతన్యశక్తిని నామము-స్మరనము-సమయము-సమర్పణము-విశ్వాసము అను నమః చేయుచున్న...

ANIRVACHANEEYAM-ADITYAHRADAYAM(GUHYAM-SANATANAM)-04

Image
  రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ । యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥  ప్రస్తుత శ్లోకము ఒక విధముగా ఫలసృతి అని భావిస్తారు.  ఇందులో గుహ్యం-సనాతనం అని శ్లోకము ద్వారా స్తోత్ర వశేషము చెప్పబడినది.  మననాత్ త్రాయతే మంత్రం-వేదవాక్యము.  అగస్త్యుడు రామునకు అదిత్యహృదయ మంత్రమును ఉపదేశించాడు అనుట మంత్ర మర్యాదను పాటించమనుకోవచ్చును.  ఆది-అంతములేని నిత్యనూతన తత్త్వమే సనాతనము.  ఆదిత్యహృదయ స్తొత్ర పఠన ఫలితము కేవలము శ్రీరామ చంద్రునికి మాత్రమే కాదు సర్వులకు-సర్వకాల సర్వావస్థలయందును సంస్కరించునది అని చెప్పకనే చెప్పబడినది.  అంతే కాదు ఒక్క శత్రువును సంహరించునది మాత్రమే కాదు  సర్వన్-అరీన్-సర్వశత్రువులను అనగా   కామ-క్రోథ-లోభ-మోహ-మద-మాత్సర్యములను అంతరంగశత్రువులను-బాహ్య శత్రువులను హరించివేస్తుంది.   అంతే కాకుండ  వత్స-అను వాత్సల్య పూరక సంబోధనము జరిగినది.  వత్స అను సబ్దమునకు గోమాత యొక్క లేగ.గోవు తాను సాకాహారి.అయినప్పటికిని తన నుండి జన్మించిన బిడ్దను ఆవరించి యున్న నిషిద్ధమును ప్రేమతో శుభ్రం చేస్తుంది.దానికి స బాహ్య-అభ్యంతర శుచిని ప్రసాద...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(AGASTYOE BHAGAVAAN RISHI)-03

Image
   కొండను నియంత్రించినవాడు అగస్త్యుడు.అగము/నగము అంటే కొండ.కొండను ఎత్తుగా పెరగవద్దని నియంత్రించిన మహా తపోశక్తి సంపన్నుడు.ఇది వాచ్యార్థము.  అగము అను శబ్దమునకు ఇంద్రియము అనునది మరొక భావము.అవి కొండల్లా ఎదిగి మనస్సును  ఆవరించి కదలనీయవు.ఒక్క కొండను దాటుటయే ఎంతకష్టమో.అటువంటిది ఆరు ఇంద్రియములు ఆరు కొండలుగా మనసును చుట్టుముట్టి,పొరపాటున కదిలి వెళ్ళిపోదామనుకుంటే కదలక వాటి మధ్యలో నున్న లోయలలో పడవేస్తుంటాయి.  రావణాసురునిది అదే దయనీయమైన స్థితి.కామము అనే ఇంద్రియము కొండలా ఎదిగి కదలక నిలిచి సీతమ్మను అపహరించునట్లు చేసినది.ఎక్కడ  తప్పించుకుంటాడో అని క్రోధము వానిచే సీతమ్మను నిర్బంధింపచేసి తనను వివాహమాడమనుట, అను రెండు విషయములతో కామము-క్రోధము రెండువైపులా పెద్ద కొండల్లా  కమ్ముకున్నాయి.వెనువెంటనే తనకే దక్కాలన్న మోహము,ఆమె రామధర్మపత్ని అన్న మాత్సర్యము మరింత పెద్దకొండలై రావణుని బంధించాయి.ఎటు కదలలేడు.కదిలినా ఉండేది లోయలోనే తప్ప వాటిని దాటలేడు.వానిని ఆ కొండలనుండి బయటకు తెప్పించగలవాడు,వాని అవస్థను తప్పించగలవాడును అగస్త్యుడనే పాత్రధారుడే సుమా.అంతేకాదు.  రఘువంశ కులదైవము సూర్యభగవ...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(UPAGAMYAA AGASTYO)-02

Image
  దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ । ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః   ప్రస్తుత శ్లోకములో రెండు పాత్రలు ప్రవేశింపబడినవి.అవి, 1.అగస్త్య మహాముని 2.దేవతలు.  ఇంకొక విశేషము మొదటి శ్లోకములో యుద్ధమునకు సిద్ధముగా సమీపించిన రావణుని ప్రత్యర్థి రామచంద్ర ప్రభువుగాను పేర్కొనబడినది.  రాముడు భగవానుడు.  రామునికి ఉపాగమ్యా-సమీపమునకు వచ్చినవాడు ఋషి అగస్త్యమహాముని.  ఇంకొక విచిత్రము ఈ యుద్ధమును వీక్షింపచేయుటకు అగస్త్యుడు దేవతలందరిని తనతో కలుపుకొని/కూడి వచ్చెను.  అగస్త్య-గమ్య అగస్త్యుడు వచ్చెను.  అగస్త్య సమాగమ్యా-అగస్త్యుడు-దేవతలతో కలిసి వచ్చెను.   వచ్చిన అగస్త్యుడు  రామం ఉపాగమ్యా-రాముని దగ్గరకు సమీపించెను.   అంటే రామునికి అగస్త్యమహాముని ఆదిత్యహృదయమును ఉపదేశించునపుడు మిగిలినవారు వినలేదా/యుద్ధము జరుగలేదా అను అనుమానములు కలుగ వచ్చును.  అది సామాన్యమైన రామ-రావణ యుద్ధము కాదు.అంతా నిమేషము-రహస్యము-రమణీయము.  అంతే కాదు అభ్యాగతో అన్న పదం ప్రయోగించబడినది.అంటే వారు అనుకోకుండా,తిథి-వార-నక్షత్రములను గమనించకుండా వచ్చే అతిథులు కారు.ఎప్పుడెప్ప...

ANIRVACHANEEYAM- ADITYAHRDAYAMU(TATOE YUDDHAM)-01

Image
  తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ । రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥   ప్రస్తుత శ్లోకములో మహర్షి అనుగ్రహించిన పదములు,    తత్-ఆ  యుద్ధము,సమరము,చింత-అగ్ర-దృష్టి,రావణ-స్థితం-సముపస్థితం.పరిశ్రాంతం మొదలగునవి.  రావణ-అను ఒక్క నామము మాత్రమే చెప్పబడినది.  సమరము-యుద్ధము-పరిశ్రాంతము-దృష్ట్వా-(చూచెను)స్థితం-సముపస్థితం   అను క్రియా పదములు(పనుల) గురించి చెప్పబడెను.  అగ్రతో-పైకి,పరి-మిక్కిలి,విశేషములను చెప్పబడినవి.  రావణం చ-అనగా రావణునితో కూడి యున్నది ఆ యుద్ధరంగము అని,చ అను భూతకాలమును అన్వయించుకుంటే ఈ యుద్ధము ఎప్పుడో జరిగినది అని రెండు విధములుగా భావించవచ్చును.కాని రావణునికి ఎవరికి మధ్యన ఈ యుద్ధము జరిగినదో ప్రత్యేకించి చెప్పలేదు.  సమరే చింతయాస్థితం-అన్నారు మహర్షి.  యుద్ధమును గ్య్రించిన ఆలోచనలతో నున్నారట. అంటే ఇరుపక్షములవారా లేక కేవలము రావణుడు మాత్రమేనా అన్న సంసయము కలుగవచ్చును అజ్ఞానమునకు.  రావణ ప్రసక్తి వచ్చినది కనుక లంకలో యుద్ధము జరిగినదనుకొనుటలో తప్పులేదు.  కాని నిలకడలేని ఆలోచనలు స్థిరముగా నున్నవట.ఇది ఒ...