ADITYAHRDAYAMU-04
ఆదిత్యహృదయము-04
****************
"జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం
కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం
అరుణకరుణగమ్యం ఆదిం ఆదిత్యరూపం
సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."
పూర్వరంగము
***********
పరిశ్రాంతుడై-చింతాక్రాంతుడైయున్న రామచంద్రునికి తక్షణ కర్తవ్యమును సూచించుటకై, అభ్యాగతిగా వచ్చిన అగస్త్యమహాముని,
రామా ద్రష్టుం/చూడు
రామా-శృణుం-విను
రామా -జపేత్-జపించు అంటూ కార్యోన్ముఖుని చేస్తున్నాడు.
స్తోత్ర శీర్షికా సార్థకతను(ఫలశృతి) తెలియచేయునది ప్రస్తుత శ్లోకము.
శ్లోకము
*****
" ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాసనం
జయావహం జపేత్ నిత్యం అక్షయం -పరమం-శివం."
అదిత్యుడు అంటే ఎవరు?
1. "వేదాహమేతం పురుషం మహాంతం
ఆదిత్య వర్ణం తమపస్తు పారే"
అని స్తుతిస్తున్నది పురుషసూక్తము.
క్రియాశీలుడైన పరమాత్మ సమస్త నామరూపములను ప్రకటింపచేసి, తాను ప్రకాశిస్తూ వానియందు ప్రవేశించి,అరుణవర్ణముతో చీకట్లనుండి (పారే) దాటించివేస్తాడో వాడే ఆదిత్యుడు.అని నేను తెలుసుకుంటున్నాను అంటున్నది.
రుద్ర నమకము సైతము,
ధావతే సత్వానాం పథయే నమః అని తన భక్తుల ముందు తానుండి నడిపించువాడు,తన భక్తులను అనుసరిస్తూ అనుగ్రహించువానిగా పరమాత్మను స్తుతిస్తోంది.
2.న-దితి-రెండవదిలేనిది ఏకైకస్వరూపమునుండి ప్రకటింపబడువాడు ఆదిత్యుడు.
3.గుహ్యము-సనాతనము-పుణ్యము-సర్వశత్రునాశనము-జయము-పరము-అక్షయము-శివము -నిత్యము అను సర్వశుభలక్షణ స్తోత్రము ఇది.
దీనిని జపేత్ నిత్యం-నిత్యము జపించినచో ఫలసిద్దికలుగును.
జపము అంటే ఏమిటి?అన్న సందేహము కలిగినచో,
" హస్తౌ నాభి సమాకృత్వా ప్రాతః సంధ్యా జపంచరేత్"అన్నది ఆర్యోక్తి.
.ముకుళింపచేసిన హస్తములను నాభిప్రదేశమునకు దగ్గరగా ఆనిచి, పెదవులు-నాలుక కదపకుండా నిశ్చలముగాచేసే మంత్రార్చనయే "జపము" అని అంటారు.
తత్ఫలితముగా,
"జ"కారో జన్మవిఛ్చేదః-"ప"కారో పాపనాశనం" అని భావిస్తారు.
.
అంతే కాదు,
" యజ్ఞానాం జపయజ్ఞోస్మి
స్థావరాణాం హిమాలయః'
ఆదిత్యారాధనమును మూడు వర్గములుగా పరిశీలిస్తే,
సాంప్రదాయము-వైజ్ఞానికము-ఉపాసనము అయితే,
అటువంటి జపమును నిత్యము అనుసరిస్తే(త్రికరణములతో)
1.సర్వశత్రు వినాశ నం-ప్రతికూలములను సమూలముగా నిర్మూలిస్తుంది.ఇక్కడ మూడు వర్గముల శత్రువులను మనము ప్రస్తావించుకుందాము.వారు,
మనకథనములోని రామ-రావణులు
రావణుని అంతః శత్రువులు
వైజ్ఞానికమైన "మందేహులు"మనకు సూర్యకిరణములను అందనీయని వాతావరనకాలుష్యము(ఓజోను పొర సామర్థ్యమును అడ్డుకొనునవి).
2 "పునాతు మాం తత్ సత్ వరేణ్యం" అంటున్నది సూర్యమందల స్తోత్రము.
3 దోషములు తొలగినచిత్తము పునీతమవుతుంది.అదియే పుణ్యము.
4.పుణ్యస్థితికి చేరిన మనసు అజపామంత్రమును
అనవరతము చేస్తూ (గాలి పీల్చుట-వదలుట)సోహం /నేనే నీవు-నీవే నేను అనే ఏకత్వ స్థితికిచేరుకుంటుండి.అదియే పరమం.
5 పరమం పొందిన మనసు ,
చతుర్విధ పురుషార్థములైన ధర్మ-అర్థ-కామ-మోక్షములను దాటి తురీయముచేరుతుంది
.అదియే శివము.
6శివముగా మారిని చేతనుడు అక్షయ ఫలవంతుదవుతాడు.వానిస్థితికి గ్లాని ఉండదు.
7అట్టిస్థితి పరిమిత సమయముకాక నిత్యముగా/శాశ్వతముగా ఉంటుంది.
అంతే,
ఈ స్తోత్రరాజమునునిత్యముజపించిన జీవుడు జీవన్ముక్తుదగును అని రాముని స్తోత్రపఠనాసక్తునిగా,అగస్త్యమహామునిచేయుచున్న తరుణములో
తంసూర్యం ప్రణమామ్యహం.

Comments
Post a Comment