ADITYAHRDAYAMU-07
ఆదిత్యహృదయం-శ్లోకం-07
******************
ప్రార్థన
****
" జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం
హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్యనాశం
అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం
సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."
పూర్వరంగము
***********
స్వామి తన రశ్ములనే కరములతో తిరోధాన స్థితి నుండి పునఃసృషిని అనుగ్రహించినవేళ ఉత్పన్నమైన దేవాసురగణములచే నమస్కరింపబడుతున్నాడు.స్వామి రశ్మిభావనయే చైతన్యమును అనేకానేక విధములుగా ప్రకటింపచేస్తున్నది.
ప్రస్తుతశ్లోకములో విస్తృతింపబడిన శక్తులు వివిధ నామరూపములతో పరమాత్మ అనుగ్రహమును మరింత వివరిస్తున్నది.
శ్లోకము
*****
" ఏష బ్రహ్మాశ్చ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః."
ఏష అను సంబోధనము పరమాత్మ ఏకత్వమును-మహత్వమును -పోషణత్వమును సూచిస్తున్నది.
శబ్దము,
1.ధ్వని అర్థము
2.శబ్ద అర్థము
3.గూఢ అర్థమును కలిగి ఉంటుంది.
ఏష-ఇతడే
ధ్వనినిబట్టి,
మంచిచెడులను-తెలియచేస్తుంది.
శబ్దమును బట్టి గౌరవమును సూచిస్తుంది.
గూఢార్థమును గ్రహించగలిగితే,
" యతోవా ఇమానిభూతాని-జాయతే'
ఎవని వలను జగములు సృష్టించబడి-సంరక్షించబడి-లయముచేయబడుతున్నాయో,ఏవనియందు దాచబడుతున్నాయో-తిరిగి ప్రకటింపబడుతున్నాయో ...అని "ఎష" శబ్దము ,
బ్రహ్మ ఇతడే,
శివుడు ఇతదే
విష్ణువు ఇతడే
స్కండుడు/గుహుడు (గుహ్యం స్తోత్రం)
ఇంద్రుడుఇతడే
ధనద/కుబేరుడు ఇతడే
కాలస్వరూపము ఇతడే
యముడు ఇతడే
చంద్రుడు ఇతడే
వరుణుడు ఇతడే అని,
ప్రస్తుత శ్లోకము దిక్కుల ఆవిర్భావము-వాటి సంరక్షణము,దినములోని మూడు సంధ్యలు వాటి పాలకులు,స్వామికిరణములలోని విభిన్న కార్య నిర్వాహక శక్తులు వాటి సమన్వయము,పంచభూతముల ప్రాశస్త్యము వివరించుచున్నవి.
మనము సాధారణముగా ఏ చిత్రకారుని ఉదాహరణకు( బాపుగారు ) గొప్ప/అద్భుత చిత్రకారుడు అని కీర్తిస్తాము కాని బాపుచేయి గొప్ప చిత్రీకరణచేయు సామర్థము కలది అనము.అదే విధముగా గొప్పగాయని/గాయకుడు అంటాము కాని గాత్రమును ప్రస్తావించము.నర్తకి అంటాము కాని భంగిమలను చెప్పము.ఎందుకంటే ఆ ఇంద్రియములకు శక్తినిచ్చి.దానిని ప్రకటింపచేసిన వ్యక్తిలో దాగినది ఆ చైతన్యము కనుక.
అదేవిధముగా మూలపరబ్రహ్మము తన శక్తులను వివిథ కిరణశక్తులుగా,వివిథ నామరూపములతో విశ్వపరిపాలనను నిర్వహిస్తున్నాడే తక్క అన్యము కాదు.
ఈ శ్లోకములో మనము చెప్పుకొనుచున్న నామములు సంకేతిక/సార్థక నామము.
పరమాత్మ ఇంద్రియములే దేవతాశక్తులు.
1.దిక్కులు
****
ఇంద్రుడు తూరుపు దిక్కునకు అధిపతి.
వరుణుడు పడమర దిక్కునకు అధిపతి
కుబేరుడు ఉత్తర దిక్కునకు అధిపతి
యముడు దక్షిణ దిక్కునకు అధిపతి.
మహేంద్రో-ధనదః-యమః-హ్యపాంపపతి/వరుణుడు జలస్వరూపము.
ఆ దిక్కులను రక్షించు/పరిపాలించు ప్రకటిత శక్తులు.
2.త్రిసంధ్యలు.
*********
"ఉదయే బ్రహ్మణో -మధ్యాహ్నేతు మహేశ్వరః-అస్తమయం స్వయం విష్ణు
త్రయీ మూర్తి దివాకరః"
కిరణములు హిమసర్జన-అగ్నిసర్జన-జలసర్జన అని మూడు స్వభావములు కలవిగా విభజింపబడినవి.
ప్రాతఃకాల ఉషసమయమున వివశ్వంతుడు బ్రహ్మయై,ఉదయమును సృష్టించువానిగా ప్రకాశించును.
దానినే "రుద్రము" అసౌ తామ్రః అని కిరణ వర్ణముతో ప్రస్తుతిస్తుంది.
మద్యాహ్న సమయమున అగ్నిసర్జన కిరణములు జగములను పోషిస్తాయి.వాటిని ప్రసరింపచేసే శక్తియే మహేశ్వరుడు.
దానినే రుద్రము "అసౌ అరుణః' అని కీర్తిస్తుంది.
అస్తమాన/సాయంకాలములో జలసర్జన కిరణ
ములు జారుతుంటాయి.ఆ శక్తిపేరే మనము విష్ణుశ్చ అని/నారము అనగా నీరు వాసము గలవాడని/వరుణుడని కీర్తిస్తాము.
ఆ సమయమును రుద్రము"అసౌ బభ్రు"అని కీర్తిస్తుంది.
వీరే కాక మరికొన్నికిరణములు భూమిలోనికి ప్రవేశించి,
లోహములను-చమురులను-ఖనిజములను-పంటలను-జలములను ఇలా ఎన్నెన్నో వనరులను తయారుచేస్తాయి.
3. కిందకు జారు స్వభావము కలవి కనుక సూర్యుని
స్కందుడు అంటాము.అంతే కాదు
4. విడివిడిగా ఉన్న పంచభూతములకు హద్దులను ఏర్పరచి నియమిస్తాయి కనుక యమ అని కూడా అంటారు.
5. సూర్యకిరణములు రాత్రివేళ చంద్రుని శీతలత్వమునకు/వెన్నెలకు అనువైన శక్తిని ప్రసాదిస్తాయి.కనుక సోముడు.
6.కాల స్వరూపము కనుక కాలుడు.
ఈ పరిణామమునే ఋగ్వేదము,
" ఇంద్ర-మిత్రం-వరుణం-అగ్నిం-ఆహురథోం-దివ్యం-స-సంపూర్ణో గురుత్మాన
" ఏకం-" సత్ విప్రా బహుదా వదంతీ"
విశేష ప్రజ్ఞానము కలవారు ఏకమైన పరమాత్మ శక్తులుగా అనేకమును దర్శించగలరని ,ఆదిత్యవైభవమును దర్శింపచేయు తరుణమున,
తం సూర్యం ప్రణమామ్యహం.

Comments
Post a Comment