Posts

Showing posts from April, 2019

NAH PRAYACHCHAMTI SAUKHYAM-19

Image
    నః ప్రయచ్చంతి సౌఖ్యం-19     ******************************   భగవంతుడు-భక్తుడు మేకను గౌరవించిన వారే   " ఇమాగం రుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం     యథాసశ్శమసత్ ద్విపదే చతుర్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం."     రుద్రదేవా! మా పుత్రులు-పౌత్రులు-బంధువులు,గోవులు,మిగిలిన పశు సమూహములకు సుఖము కలిగించుము,అందరిని పుష్టిగా ఉంచుము.ఎట్టి ఆపద రానీయకము.స్వామి నీకు అభిషేకము పూజలతో ఆరాధించి,ఆనందించెదము.    " ఏకాదశ మహారుద్రైః అతిరుద్రః ప్రకీర్తితః      అతిపాప హరో యస్మాత్ దృష్ట్వాన్యానైవ నిష్కృతిః."     రుద్రముల పారాయణ-అభిషేకము-హోమము ఏదీయినను పాపక్షయము,పరమశివుని అనుగ్రహమును,ఐహిక-ఆముష్మిక శ్రేయస్సును-శుభమును-సుఖములను-ఇన్ని మాటలేల ముక్తిని కలిగించుననుట నిర్వివాదము.    అగ్నినేత్రుని అగ్నికార్యముతో అర్చించు మహానుభావులెందరో .హవిస్సును అందించి ఆశీస్సులను అందుకొను అదృష్టవంతులు అసంఖ్యాకులు.అదే విధముగా ఒకసారి బ్రహ్మగారు చేయుచున్న యజ్ఞమునకు పరమేశ్వరుడు ప్రత్యక్షముగా విచ్చేసి యున...

NAH PRAYACHCHANTI SAUKHYAM-18

Image
     నః ప్రయచ్చంతి సౌఖ్యం-18     **************************   భగవంతుడు-భక్తుడు నాదమయులే-నాద ప్రియులే    " నాదతనుం అనిశం శంకరం-నమామి మనసా-శిరసా"  త్యాగరాజులవారు.   ప్రణవమే పరమేశ్వరుని శరీరము.అనిశము ఎల్లప్పుడు ప్రణవమును స్మరిస్తుంటుంది.ప్రణవము "ఓం" సూక్ష్మము,"ఓం నమః శివాయ" స్థూలము.అంతేకాదు స్వామి డమరుకము సైతము పంచాక్షరిని శబ్దిస్తూనే ఉంటుంది.( అక్షరాభ్యాస సమయమున)ఓ పరమేశా నీ అనుగ్రహ నాదమును మా పిల్లలపై వర్షించమని ప్రార్థిస్తుంటారు.   " బ్రహ్మ మురారి సురార్చిత లింగం -నిర్మల భాసిత శోభిత లింగం "మొదటి సారిగా పరమేశ్వర తత్త్వమును గ్రహించిన బ్రహ్మ-విష్ణులు అగ్నిస్తంభము నుండి వెలువడినస్వామిని దర్శించి స్తుతించినవి. ఆదిదేవుడు,తన సద్యోజాత-వామదేవ-అఘోర-తత్పురుష-ఈశానాది ఐదు ముఖముల నుండి పంచాక్షరిని-సప్తస్వరములను ప్రకటించి నాదమయముగా మలిచాడట.   " ఓం నమో శ్రవాయచ-ప్రతిశ్రవాయచ" ధ్వని-ప్రతిధ్వని రెండును తానైన పరమేశ్వరా ప్రణామములు.త్రికరణశుద్ధిగా చేయుచున్నాను అంటున్నాడు త్యాగయ్య.మనసా-వచసా-శిరసా.స్వామి పాదముల వద్ద శరణాగతి కోర...

NAH PRAYACHCHANTI SAUKHYAM-17

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-17   ****************************  భగవంతుడు- భక్తుడు మీడుష్టులే    సంపదలను వర్షించువారే.  "మీడుష్టమ శివతమ శివోనస్సుమనా భవ"  మిక్కిలి శాంతము గలిగినవాడు శివతముడు.అంతేకాదు భక్తులపై వారి కోరికలను అమితముగా వర్షించు రుద్రునకు నమస్కారములు.   " నమో బృహతేచ-వర్షీయసేచ" సద్గుణ సంపన్నుడై సంపదలను గుణములను వర్షించువానికి నమస్కారములు.   కుబేరుడు సదాశివుని ముందు చేతులు కట్టుకొని నిలబడతాడట.ఎవరా కుబేరుడు? ఏమా కథ? కుబేరునికి సంపదలను వర్షించిన కపర్ది మాకు సౌఖ్యమును ప్రసాదించుము.శివోహం.   ఉత్కళరాజ కుమారుడైన దమనకుడు పరమ శివభక్తుడు.పూర్వజన్మల సంస్కారమును పుణికిపుచ్చుకొన్నవాడు.గతజన్మల గురుతులతో తన గమ్యమును తెలిసికొని ,గంగాతీరమున శివలింగమును ప్రతిష్టించుకొని ప్రార్థించుచుండెడి వాడు.  " నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే" స్వామి నీవు సహస్రాక్షుడవు.అనంతదర్శన శక్తిసంపన్నుడవు.జగత్కళ్యాణమునకై  గరళమును కంఠమునందుంచుకొనిన నీలగ్రీవుడవు.భక్తుల మనసెరిగి వారికి శుభములనందించు కృపావర్షుడవు.నా మనసెరిగి నన్ను నీదరి చేర్...

NAH PRAYACHCHANTI SAUKHYAM-16

Image
   నః ప్రయచ్చంతి సౌఖ్యం-16    ************************    భగవంతుడు జలస్వరూపుడు-భక్తులు జలస్వరూపులు.     " ఓం నమో శీభాయచ శుభకరాయచ"     ప్రసాదగుణముతో ప్రవహించు పరమేశ్వరునకు నమస్కారములు.   పంచభూతలలోనిదైన జలము భూతలము నాలుగింట మూడు వంతులు చలమలు,మడుగులు,తటాకములునదులు,సముద్రములవంటి ఉపరితలజలములతో కూడి ఉంటుంది.ఇది మనకంటికి కనపడు స్థూలతత్త్వము.  జలము జీవుల శరీరములలో 70 నుండి 90 శాతము వరకు ఉండి మానవశరీరమును అతి సమర్థవంతముగా పనిచేయిస్తుంది.ఇది జల సూక్ష్మ తత్త్వము.స్థూల తత్త్వముగోచరమయితే సూక్షము అగోచరము చర్మచక్షువులకు.నిశితముగా పరిశీలిస్తే స్థూలములోను-సూక్ష్మములోను ఈశ్వరచైతన్యముగా ప్రకాశించు జగదీశ్వరుడే జలము.   "ఓం నమో వైశంతాయచ"    "విశ్వేశ్వరుడే విశ్వవ్యాప్త ద్రావణి"   పంచభూతలలోనిదైన జలము భూతలము నాలుగింట మూడు వంతులు చలమలు,మడుగులు,తటాకములునదులు,సముద్రములవంటి ఉపరితలజలములతో కూడి ఉంటుంది.ఇది మనకంటికి కనపడు స్థూలతత్త్వము.  జలము జీవుల శరీరములలో 70 నుండి 90 శాతము వరకు ఉండి మానవశరీరమును అతి సమర్థవంత...

NAH PRAYACHCHANTI SAUKHYAM-15

Image
      నః ప్రయచ్చంతి సౌఖ్యం-15      *******************************  భగవంతుడు-భక్తుడు ఇద్దరు వృక్షములను రక్షించువారే.   ' నమో వృక్షేభ్యో హరికేశభ్యః."    స్థితికారుడుగా పరమాత్మ విశ్వపాలన చేయుటే వృక్షరక్షణ.దానిని పోషించునవి హరికేశ్వములు.ఆకుపచ్చని కొమ్మలు-రెమ్మలు.పువ్వులు-పండ్లు.ఆచ్చాదనయే పరమాత్మ తత్త్వము.విజ్ఞానమనెడి వృక్షము రుద్రుడైనప్పుడు వేదములు-వేదాంగములు హరికేశములు.దానిఆకులు-కొమ్మలు.శ్రీసైల పర్వత ప్రాంతములో వృక్షములు జరుగుట ఎందరో మహానుభావులు దర్శించినారట." ఊర్థ్వమూలం అథః శాఖః" అని శ్రీక్రిష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించినాడు.మహాభారతములోను ధర్మరాజు ధర్మవృక్షముగాను,తమ్ముళ్ళు దాని శాఖలుగాను ,అదేవిధముగా దుర్యోధనుడు అధర్మ వృక్షముగాను వర్ణించబడినారు.పవిత్ర మర్రివృక్షము క్రింద స్వామి దక్షిణా మూర్తిగా దర్శనమిస్తున్నాడు.శ్రీశైలములో తెల్లమద్దివృక్షము శివస్వరూపమని నమ్ముతారు.మరియు త్రిగుణ్తీత వృక్షముగా బిల్వవృక్షము లక్ష్మీదేవిచే సృష్టించబడినదట.అమ్మవారు స్వామివారి గురించి చూతవృక్షము క్రింద ఆసీనురాలై అత్యంతశ్రధ్ధాభక్తులతో తపమును సలిపినదట.సంస...

NAH PRAYACHCHANTISAUKHYAM-14

Image
 నః ప్రయచ్చంతి సౌఖ్యం-14  ***************************  భగవంతుడు-భగవదంశ  ఇద్దరు క్షేత్రపాలకులే.  " నమో రుద్రాయ ఆతతాయినే క్షేత్రాణాం పతయే నమః." స్థలము దైవత్వముతో మేళవించిన క్షేత్రముగా భాసిల్లుతుంది.కాశము అనగా వెలుగు-ప్రకాశము అనగా ప్రకృష్టముగా తేజరిల్లునది.  " కాశంతు పునరాగత్య సంహృష్టం తాండవోన్ముఖం    విశ్వేశం దేవం ఆలోక్య ప్రీతివిస్తారితే క్షణా    సానురాగాచసా గౌరీ దద్యాత్ శుభపరంపరాం    వారణాస్యాం విశాలాక్షీ అన్నపూర్ణ పరాకృతీ    అన్నం జ్ఞానదదతీ సర్వాన్ రక్షతి నిత్యశః    త్వత్ ప్రసాదాన్ మహాదేవి అన్నలోపస్తు మాస్తుమే."             గంగానదితో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కాని ఈ రె...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-13

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-13.   నః ప్రయచ్చంతిసౌఖ్యం.-07   ************************   " ప్రళయ పయోధి జలే కేశవ ద్రుతవానసి వేదం    విహిత వహిత్ర కరిత్రమఖేదం    కేశవాద్రుత మీనశరీర జయజగదీశ హరే"  చేపరూపమును దాల్చి చేవతో సొమకుని నుంది వేదోధ్ధరణను గావించిన కేశవ నమస్కారములు.  భవసారమున పడి బయటకు రాలేని మాపై నీ కరుణాజాలమును విసిరి కడతేర్చు గొప్ప జాలరి వైన శివా ప్రణామములు.  నమో ప్రతరణేభ్యో ఉత్తరణేభ్యశ్చవ నమో నమః.  స్వామిని దర్శించిన సత్యవ్రతుడెంత ధన్యుడో స్వామికి మత్స్య నైవేద్యమును సమర్పించిన ఆదిపత్త నయనారు అంతే మహనీయుడు. చిన చేపను-పెద్ద చేప,చిన మాయను-పెనుమాయ  ఇది స్వాహా-అది స్వాహా అని అంటున్నాడు పెద్దజాలరి మనకు ఒక జాలరి కథ చెబుతూ,  విషయవాసనలనే ప్రవాహములో పడి,వల పట్టుకొని యున్నమాయ అనే ఆపదను గుర్తించలేని మనలను రక్షించుస్వామికి నమస్కారములు..శివోహం.  భ గవంతుడు-భక్తుడు ఇద్దరు జాలరులే  జలము-జలచరము-జాలరి ఈశ్వరచైతన్యమే.  " ఓం నిషాదేభ్యశ్చవ నమోనమః".  చేపలను సమూహముగ పట్టి చంపునట్టి ని...

NAH PRAYACHCHAMTISAUKHYAM-12

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-12   ******************************   భగవంతుడు-భక్తుడు ఆలిని అర్థికిచ్చిన వారే.   " నమః సోమాయహ-రుద్రాయచ" ఉమా సమేతుదై యున్న రుద్రునకు నమస్కారములు.  ఉమ అనుపదములోని ఉ-ం-అ అను వర్నములను విలోమముగ చూసినచో అది ప్రణవస్వరూపమైన ఓంకారము.ఉమా సహితుదైన ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు సర్వ సమర్థుడు అని కేనోపనిషత్తు స్తుతించుచున్నది.  నమో మీడుష్తమాయచేషుమతేచ" ధారగా సంతోషములనువర్షింపచేయు రుద్రా నమస్కారములు.  భూకైలాసమును ప్రకటించుటకు భూతనాథుడు రావణభక్తిని రాణింప. చేసినాడు.తల్లి శివార్చన సమయమున సైకతలింగమును చెదరగొట్టించి,తనకథను మొదలుపెట్టాడు.కైలాసనాథుని దేశనమునకు కఠినతపమును కావింపచేసినాడు.అకుంఠిత దీక్షతో ఆ సదాశివుని హృదయకుహరమున ప్రవేశింప  కలిగినాడు పదితలలవాడు.ఓం నమో గహ్వరేష్ఠాయచ నమో నమః".భక్త సులభుడు భవానీ సమేతుడై ప్రత్యక్షమై ఏమి వరము కావలెనో కోరుకోమన్నాడు.ఆత్మలింగమును అర్థించుటను మరచినాడు ఆ అసురబ్రహ్మ.దీనికి కారణము నమః యామ్యాయచ-క్షేమ్యాయచ".దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ జరుపవలసిన వాని మాయ.కథను ముందుకు నడిపించ దలచినాడు గ్రుస్నుడు మరియు గ్ర...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-11

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-10   *****************************    భగవంతుడు-భక్తుడు ఇద్దరుసేనాపతులే-అన్నదానప్రియులే.  " నమో బభ్లుశాయనివ్యాధినే అన్నానాం పతయే నమః."   పరమేశ్వరుడు వృషభవాహనుడు.వృషభము ధర్మము.దుక్కిదున్ని దుర్భిక్షమును పోగొట్టును." నమో మేఘ్యాయచ" మేఘస్వరూపముగా స్వామి మారి వాని ద్వారా వర్షములను కురిపించును.హర్షమునందించును." నమో వర్షాయచ."  " అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః."   మరొకవిశేషము    తమసేనలకు అన్నమును అందించుటలో అతి విశాలహృదయులు. ప్రాణులు అన్నమువలన కలుగుచున్నవి.అన్నము మేఘము వలనకలుగుచున్నది.మేఘము జన్నము వలనకలుగుచున్నది.జన్నము సత్కర్మల వలన కలుగుచున్నది.సత్కర్మ వేదము వలనకలుగుచున్నది.వేదము అక్షర పరబ్రహ్మమైన సదాశివుని వలన కలుగుచున్నది సర్వలోక సేనాపతి సదాశివా నమో నమః.. భక్తుని విషయానికొస్తే,  తంజావూరు జిల్లాలోని తిరునట్టి యాట్టంగుడి నివాసియైన కోట్పులి నాయనారు.చోలరాజ్య సేనాధిపతి.అతి పరాక్రమ వంతుడగుటచే పెద్దపులి అను పేరుతో ప్రసిధ్ధిపొందాడు.పరాక్రమమునకు...

NAH PRAYACHCHANTI SAUKHYAM-10

Image
     నః ప్రయచ్చంతి సౌఖ్యం.-10      *************************   కైలాసపురి నుండి కాశికై-కాశికాపురి నుండి దరహాసివై   మా హృదయవాసిగా భాసిలుతు-నడిపించ ఎదురుగా   కనిపించుచున్నావుకరుణతో  శివశివా-హరహరా    భగవంతుడు-భక్తుడు ఇద్దరు బ్రాహ్మణులే-యజ్ఞోపవీతులే.    " నమో హరికేశాయ ఉపవీతినే పుష్టానాం పతయే నమః." శివుడు హరికేశుడు అనగా నల్లని శిరోజములు కలవాడు.శివుని నల్లని కేశములు వార్ధక్యము లేని వాడని,కాల ప్రభావములను అధిగమించినవాడన్న విషయమును తెలియచేయుచున్నది.మరియు శివుడు ఉపవీతుడు.బంధము కలవాడు.ఉప అనగా దగ్గరగా నున్నవాడు.సాక్షాత్తు గాయత్రీమాతయే.శివుడు వేదమాత గాయత్రీదేవి సంకేతమును ధరించిన వేదమయుడు.అంతేకాదు తాను ధరించిన ఉపవీతము (జందెము) పుష్టులను (వాక్పుష్టి-జ్ఞానపుష్టి-ఇంద్రియపుష్టి -ధర్మపుష్టి) మొదలగు వానిని పరిపూర్ణముగా ప్రసాదించగలవాడను శివతత్త్వమును చాటుచున్నది.అదే భక్త రక్షణా ధర్మసంస్థాపన ధారణము.      ఇద్దరును మంగళము కొరకు ఉపవీతమును,గాయత్రీ కృపను ధరించినవారు.అనగా బ్రహ్మజ్ఞానమునందు నిష్ణాతులు.మరియును వాక్పుష్...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-09

Image
 నః ప్రయచ్చంతి సౌఖ్యం-03  ************************ 'జ్ఞానానంద మయందేవం నిర్మలస్పటికాకృతిం  ఆధారం సర్వ విద్యానాం హయగ్రీమం ఉపాస్మహే."   నిర్మల స్పటిక ప్రకాశముతో సకల విద్యలకు ఆధారముగా ప్రకాశించుచున్న హయగ్రీవునికి (గుర్రము తల కలవానికి) సభక్తిపూర్వక నమస్కారములు చేయుచున్నాను.  అశ్వము-అశ్వపతి తానైన పశుపతికి నమస్కారము. *******************************************   అశ్వ సహాయమున స్వామి సరసన కూర్చొనగలిగిన మాణిక్యవాచగరు భక్తునకు నమస్కారము.   "నమః అసీనేభ్యః  నమః."  ఆసీనుడైన శివునికి నమస్కారము.  అశ్వము అను పదమునకు మనము వ్యవహరించు గుఱ్రములు అను అర్థము మాత్రమే కాకుండ  యోగులు,మననములో రమించు మునులు,భవిష్యత్తును దర్శించగల ఋషులను కూడా పేర్కొంటారు.  " క్షతృభ్యో-సంగ్రహీతభ్యశ్చ నమోనమః."   అశ్వములను సాకు క్షత్తలకు,వాటి పగ్గములను పట్టుకొని నడిపించు సంగ్రహీతులైన శివస్వరూపములకు నమస్కారములు.  అశ్వ ఉపాధిచేసికొనిన అదృష్టము అంతాఇంతాకాదు.ఆపూర్వము హయగ్రీవుడను రాక్షుడు దిదేవుడే తన రూపమును ధరింపచేసుకొనినది.పూర్వము హయగ్రీవ...

NAH PRAYACHCHAMTI SAUKHYAM-08

Image
  నః ప్రయచ్చంతి సౌఖ్యం-08   ******************************  భళి భళి భళి మహదేవా-బహుబాగున్నదయా నీ మాయ  *******************************************  భగవంతుడు-భక్తుడు ఇద్దరు రథికులే   రథము-రథకారుడు-రథసారధి ముగ్గురు రుద్రుడే.  " నమో రథేభ్యో-రథపతిభ్యశ్చవో నమః."   భవిష్యత్ పురాణము ప్రకారము రుద్రుడు రథము మరియు రథపతి.చతుర్వేదములు చతురాశ్వములు.సూర్యచంద్రులు రథచక్రాలు.ముప్పదిమూడుకోట్ల దేవతలు రథభాగములు.చతుర్ముఖ బ్రహ్మ రథసారథి.స్వామి మేరుపర్వతమును ధనువుగా,వాసుకిని అల్లెత్రాడుగా,హరిని అస్త్రముగా చేసి త్రిపురాసర సంహారమును గావించి జగములను రక్షించినాడు .  ' ఓం తక్షభ్యః- రథకారేభ్యో నమోనమః " ( వడ్రంగి) రథకారునకు నమస్కారములు.  రంభణశీలత్వా రథః.కదిలే స్వభావము కలది రథము.ఈ విధముగా గమనిస్తే జగతిలో కదలిక కలిగిన ప్రతిజీవి రథమే.దానిని సృష్టించిన పరమాత్మ రథకారుదే.నడిపిస్తున్న పరమేశ్వరుడు రథసారథియే." నమో సూతేభ్యో-ఒకసారి అరుణాచలములో స్వామివారి రథము కదిలి గర్భగుడిని చేరుటకు మొరాయించినదని,కావ్యకంఠ గణపతి వారి తన దక్షిణహస్తముతో స్పర్శించగానే కదిలినద...