Posts

Showing posts from February, 2025

TANOTU NAH SIVAH SIVAM-25@SIVATANDAVASTOTRAMU

Image
   నడుమవచ్చిన నానాలౌల్యములలో పడి  ఇడుములలోతడుముకొనుచు నేనడిచే వేళ  సడియైన లేక నీవు సాగితివేమూలనో  కప్పిన అజ్ఞానంబున కాంచలేనిదిది  ఇప్పటిదా సామి నీ నా సంబంధము  నా పక్షంబుండి కరుణించుము నన్ను (శ్రీ సామవేదం వారు)   కథానుసారముగా స్తోత్రకర్త ఇప్పటివరకు ,  కిశోర చంద్రశేఖర,  దిగంబర,  భూత భర్తరి,  కాలిమప్రభాకంఠ,  తాండవ శివ అంటూ,తానుభక్తి యొక్క వివిధావస్థలలో మునుగుతూ,అనేకానేక రూపములను/స్వభావములను  దర్శిస్తూ,క్రమక్రమముగా అన్నింటిలో పరమాత్మను దర్శించగలిగే సమస్థితిని పొందినాడు.   కానీప్పుడొకచిక్కు వచ్చి పడింది.అదే,  అతని చంచలనేత్రములుచంచలమైన మనసుకు సహాయపడుతూ బాహ్యము నుండి దృష్టిని మరల్చుటకు అడ్డంకులుగా మారుచున్నవి.   మనసు యొక్క ఆలోచనలు అటు=ఇటు పరుగులు తీస్తు పవిత్రగంగాతీర పొదరిల్లు వంటి తనహృదయములో నుండి,    కనుబొమలనడుమ మనసును నిలిపి ఏకాగ్రతతో శివనామమును పలుకనీయకున్నవి.   మాయవల విసిరితివి మహిమగలజాలరి   పాయగలేక  ఇక బద్ధులము ఐతిమి   త్రిగుణములు చేరిచి తీర్చిదిద్దినది ఈ వల   మా చేతలను...

TANOYU NAH SIVAH SIVAM-24@SIVATANDAVASTOTRAMU

Image
     " వాగర్థావివ సంవృకౌ  వాగర్థ ప్రతిపత్తయే     జగతః పితరం  వందే పార్వతీ పరమేశ్వరౌ"   కథానుసారముగా ,   లలాట చత్వర శ్లోకములో "నః" అంటూ నమస్కారముతో భక్తికి బీజమువేసినాడు పరమేశ్వరుడు.  కరాళఫాల పట్టిక శ్లోకములో ఆ భక్తి బీజము మొలకెత్తి మతిః మమ -ఆనమస్కారము మతిర్మమ-మనస్పూర్తిగాచేయునది కావాలనిపించాడు.అప్పుడు ఆ నమస్కారము కేవలము ఆంగికము కాదు.మనసును కలుపుకొనిన మానసిక-ఆంగికమైనది.ఆ నమస్కారము స్వామిని శ్రియం జగస్షురంధరునిగా దర్శింపచేస్తున్నది మొలకమొక్కగా మారి.  ఏమిటి ఆ జగద్ధురంధరత్వము అను ఆలోచనమును రేకెత్తించినది.ద్వంద్వములను వేరువేరుగా చూపిస్తున్నది ఆ మొక్క వేసిన మొగ్గ. మొగ్గ పువ్వుగా పరిమళములు చిందుతూ స్వామి ద్వంద్వములను వేరువేరుగా చూపుటయే కాదు నీ మీది అనుగ్రహముతో వాటిని అంతమొందించి నీకు న-ద్వైత ఏకం సత్ అని తెలియచేస్తూ,ఫలవంతమై నీ భజనమునకుమరింత మెరుగులు దిద్దుచున్నది.ప్రపంచ కాలిమత్వము ప్రకాశత్వమును  "దృషద్విచిత్ర తల్పయోర్భుజంగ మౌక్తిక స్రజో   గరిష్ఠ రత్నలోష్ఠయో సుహృద్విపక్ష యోః   తృషారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో   సమం ప్ర...

TANOTU NAH SIVAH SIVAM-23@ SIVATANDAVASTOTRAMU

Image
     '  వారె ధన్యులు వారెధన్యులు     వారె పుణ్యులు ముక్తులు     వారిచూపులు శివుని చూపులు     వారిపలుకులు శైవ మంత్రములు     వారిహృదయమె శివాలయము     వారెచూప్ర్దరు మార్గము మనకు.(సామవేదం-శివపదం)    స్తోత్ర ప్రారంభమునకు కారణము కామక్రోధములు.ఆత్మలింగమును పొందవలెననునదికామము.అది లభించలేదని వచ్చినది క్రోధము,ఇంకెవరైన పొందెదరేమో అనునది మాత్సర్యము.ఒకవేళ తాను పొందినప్పటికిని ఎంతకాలము తనదగ్గర ఉండునో లేక వెణ్టనే చేయిజారిపోవునో అనునదిలోభము.భుజబలముతో కైలాసమును ఎత్తి దానినిపొందవలెననునది మదము.విఫలమైన తదుపరి అమ్మను తనతో రమ్మనుట మోహము.అర్షడ్వర్గముల అధీనములో నున్న రావణుడు వాటికి అతీతుడై స్వామిని స్తుతించగలుట అనుగ్రహ విశేషము.   భక్తి క్రమక్రమముగా పరిణితిచెందుతూ వేదికను,అలంకారములను,అమ్మ అనుగ్రహమును దర్శింపచేస్తూ క్రక్రమముగా ఆమ్ర్యమును సైతము అవగతమొనరించుచున్నది.   ప్రస్తుత భాగము స్వామి నర్తనమునకు స్వామికి,మద్దెల గతులకు దాని వాయిద్యకారునకు గల నిర్ద్వంద్వమును నివేదించుచున్నది.  ఇప్పటి వరకునిన్నెప్పుడు భజింతునో  అనుక...

TANOTU NAH SIVAH SIVAM-22@SIVATANDAVASTOTRAMU

Image
       వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే   జగతః పితరం  వందే పార్వతీ పరమేశ్వరౌ     కథానుసారముగా పార్వతీపరమేశ్వరానుగ్రహమునక్సిఉ పాత్రుడైఉనకై అ రావణుడు వారికరుణమహిమయాయనునట్లుగా ,  మంగళాది-మంగలమధ్యాని-మంగళాంతాని అను సమొరదాయానుసారముగా జయధ్వానముతో ప్రారంభించి,మంగళ శబ్దమునుమధ్యనుంచి,శివః శబ్దముతో మంగళాంతము చేస్తూ స్తోత్ర ప్రస్తుత భాగమును ప్రారంభించాడు.   జయత్వదభ్ర విభ్రమ భ్రమద్ భుజంగ మశ్వస   ద్వినిర్గ మత్క్రమ స్పురత్ కరాల ఫాల హవ్యవాట్   ధిమిధిమి ధిమీధ్వనన్ మృదంగ తుంగ మంగళ   ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివః       అభ్ర కాలములు ఆశ్చర్యముతో కదులుతూ తీస్తున్న శ్వాసలు జయజయధ్వానములుగా స్వామికి మంగళములు కలగాలని దీవిస్తున్నాయి.దానినిగమనించిన శివుని హవ్యవాహనుడు సైతము పైకుబికి పరవశిస్తున్నాడు.  ఇక్కడ కాలములను మనము కాలముగా కనుక అన్వయించుకుంటే స్వామి ప్రళయానంతర సృష్తిని సలిపి ఆ సృషికి కావలిసిన       పోషనమునకు తానే విష్ణువుగా ప్రకటింపబడుతూ హరి మద్దెల సవ్వడులకు అనుకూలముగా తన తాండవమును చేస్త...

TANOTU NAH SIVAH SIVAM-21@SIVATANDAVASTOTRAMU

Image
       " ఆంగికం భువనం యస్య-వాచకం సర్వ వాజ్మయం     ఆహార్యంచంద్ర తారాది తం  నమః సాత్వికంశివం."     అమ్మ అందించిన సకల కళల సమాహార మధూను తనివితీర గ్రోలిన స్వామి తాండవమును ప్రారంభించాడట అమ్మ లాస్యమును జతకలుపుతు.     స్వామి ఒకసారి తనుమరచు ఉప్పొంగు నాట్యమున     ఒకసారిమరపించు,     మరచి మరువక ఒకపరి,    ఓహో హోహో ఊహాతీతంబీ ఆనందము అంటున్నాడు రావణుడు.  (పుట్టపర్తి నారాయణాచార్యుల వారికి నమస్కారములతో)    " స్వామి గలమున నున్న కాళములు ఆశ్చర్యముగా కదులుతు తమ శ్వాసలతో జయత్ జయత్ అంటున్నాయట.ఆ సంభ్రమ నాదమునకు పరవశయైన స్వామి ఫాలనేత్రము పైకుబికి పరవశసిస్తున్నదట.    ఇది జరుగుచున్న కథ.రావణునికి స్పురించిన దృశ్యము.     ప్రస్తుత భాగములో రెండు స్వామీనుగ్రహ విశేషములు సంకేతించబడినవి.    కిందటి భాగములో స్వామిగలము నల్లకలువగా  చల్లదనమునందించుచు ప్రపంచవికసనమునకు నాంది పలికినది.  స్వామి తాండవము సృస్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహమను పంచకృత్య పరాయనము.స్వామి పదవిన్యాసము ప్రపంచ అవస్థా సంక...

TANOTU NAH SIVAH SIVAM-20@SIVATANDAVASTOTRAMU

Image
       " ఝణ ఝణ ఝణఝణం ఝణిత మథుర శబ్ద సంభరితం       తక తక తకిట తకిట లాస్యతాండవార్పితం       ధిమి ధిమి ధిమి ధిమితహృదయ మర్దన ద్వారం       ఖలు ఖలు ఖలు కణ్విత రుద్రభద్ర చరణరజం       అనుదిన గౌరీశంకర  పదాంభోజనివేదితం          (శ్రీ సామవేదం వారి)    ధ్యానం-వచనం-చరణం-పరమపదం-శివపదం.      పరమేశ్వరానుగ్రహము పదేపదే పలుకరిస్తుంటే,   ఎంతటిభాగ్యము, ఆభక్తాగ్రేసరుడు అమ్మనుచూడగలుగుతున్నాడు.తల్లిసర్వమంగళ.అంతేకాదు.దోషములు అసలు లేనేలనిది. ఆ జగజ్జనని తన కళలను సౌరభకుసుమములుగా విరగపూయిస్తూ స్వామిని అనురాగముతో చూస్తున్నది.ఆ శక్తి సృష్టించిన పుష్పముల మహిమలన్నీ మధువుగా మారుతూ మరింత మహదేవుని ఆస్వాదనమునకై ఆహ్వానిస్తున్నాయి.  మహదేవుడు కేవలము మధువును మాత్రమే స్వీకరించే మధూవ్రతి అయినాడు.మధురాతిమధురము ఆ మహదేవునికటాక్షము.    స్తోత్ర ప్రస్తుత భాగము పితరం జగతం వందే పార్వతీ పరమేశ్వరం ను దర్శింపచేస్తున్నది. మధువు-మధుపము-మధువ్రతము అన్నవి ముఖ్యాంశములు.  అమ్మ సర్వమంగళములన...

TANOTU NAH SIVAH SIVAM-19@ SIVATANDAVASTOTRAMU

Image
   వాగర్థావివ సంవృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే   జగతహ్ పితరం  వందే పార్వతీ పరమేశ్వరౌ.   కథా పరముగా మహాదేవుని నీలకంథరము ప్రళయానంతర సృష్టివికసనమునకు సంకేతముగా చైతన్య/చల్లదనపు కాంతులతో మనలను స్వామి కరుణకు మరింత చేరువచేస్తున్నది.  " ప్రఫుల్ల నీలపంకజ ప్రపంచకాలిమప్రభా    వలంబి కంఠకంథలీ రుచిప్రబద్ధకంథరం    స్మరఛ్చిదం పురఛ్చిదం భవఛిదం మఖఛ్చిదం    గజఛ్చిదాంధకఛ్చిదం  తమంతకఛ్చిదం "భజే"   కథాపరముగాసర్వమంగళ తనశక్తులనన్నింటిని/కళలనన్నింటిని పుష్పగుత్తిగా/కదంబమంజరిగా మలచినది.ఆ చేతిలో విరిసినపుష్పములు తమ మహిమలనే పరిమళములను ప్రసరిస్తూ/ప్రకాశిస్తూ పరమేశ్వరునికి భక్తి అనే మకరందమును నైవేద్యముగా సమర్పించుకొనుటకు పరుగులిడుచునవి.స్వామి పరమప్రీతితో తననుతాను మధుపముగా మలచుకుని మధువ్రతమునకు సిద్ధపడినాడు.కేవలము మకరందమును మాత్రమే స్వీకరించు నియమమును మధువ్రతమంటారు పెద్దలు.  " అఖర్వ సర్వమంగళా కళాకదంబ మంజరి    రస ప్రభావమాధురి విఝృంభణా మధువ్రతం    స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం    గజాంతకాంధకాంతకం తంతకాంతకంభజే"  ...