Posts

ASYA ASTI ITI KASI @ KASIPAMCHAKAM-04

Image
     కాశ్యాహి  కాశ్యత కాశీ సర్వప్రకాశికా  సా కాశీ విదితాయేన  తేన  ప్రాప్తాహి కాశికా".   పదవిభజన   అహికాశ్యా-అహి  కాశ్యతా-అహి   సర్వప్రకాశికా   కాశ్యత కాశి   స్వభావము.కాశి  కాశ్యత  నామము    తేన-ఈవిషయమును  యేన-ఎవరు    విదిత-గ్రహింతురో  వారికి   కాశిగా  నేను/ప్రకాశముగా  నేను ప్రాప్తిస్తాను/లభిస్తాను.   కాశి కాశి నామముతో  క్షేత్రముగాను,ప్రకాశ అంతర్యామిగా జీవునిలోను సాఉన్నది ప్రకాశముగా.అటువంటి కాశి స్వరూప స్వభావములను తెలుసుకొనినవాడు కాశిగా మారును.       చేతనుడు కాశిని చూడవలెనన్న తెలుసుకొనవలెనన్న ,  'కర్మణ్యోపి బోద్ధవ్యం   బోద్ధవ్యంచ వికర్మణః   అకర్మణశ్చ బోధవ్యం   గహనా కర్మణో గతిః"  కర్మయందు అకర్మను,అకర్మయందుకర్మను దర్శించు స్థితికి రావలెను.    ఎందుకంటే కర్మలు  1.కామ సంబంధములు  2.జ్ఞాన సంబంధములుగా భావిస్తే    ఇంద్రియ ప్రేరితమైన కామసంబంధ కర్మలు బంధములను అందిస్తేర్,ఇంద్రియ ప్రేపితములు కాన...

ASYA ASTI ITI KASI @KASIPAMCHAKAM TATVABODHA-03

Image
    "విశ్వేశేయం తురీయః    సకలజన  మనస్సాక్షి భూతోంతరాత్మ"     భూతము  అనగా ఉన్నది/కనులకు కనబడుతున్నది.నింగి-నేల-నీరు-నిప్పు-గాలి అనుపంచభూతములుగా  విశ్వములో/జీవునిలో నిండియున్నవి.నిజమునకు అవిచేతములుగా  అనిపించే అచేతనములు.వానిలో దాగిన చిత్శక్తి వాటిని చైతన్యవంతముచేస్తుంది.కాని కొంతకాలము మాత్రమే.ఆ కొంతకాలములో  జీవిస్తున్న శరీరములు కోశములు అను నామముతో ఐదు విభాగములుగా /తొడుగులుగా  ఉండి  జీవులచే ఐదు తప్పులను/ఒప్పులుగా  భావింపచేస్తుంటాయి.    కానివిచిత్రము వానిలో పరిమితముగా-పరిమిత కాలము సంచరిస్తున్నప్పటికిని వాని ప్రభావమునకు లోనుగాక సత్+చిత్ శక్తివాటిచర్యలను గమనిస్తున్నప్పటికిని వాటి కర్మలను-కర్మఫలితములను పట్టించుకోదు.కనుకనే  సాక్షీభూతము అని కీర్తింపబడుచున్నది.       " ఆట కదద్వైతంబు-ఆట  అద్వైతంబు       ఒకటి-రెండు ఒకటే-ఆటనీకు.(తనికెళ్ళ భరణిగారు)   పంచకోశములుగా నిర్మితమైన ఐదు తొడుగులు చీకటిలో  నుండి తమను చేతనులుగా భావింపచేస్తున్న చిత్ప్రకాశమును కాంచలేవు. 1.మొదటిదైన అన్నమ...

ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAM-03

Image
      "కోశేషు పంచ్ర్హస్వధిరాజమానా   బుద్ధిర్భవానీ ప్రతి దేహ గేహం   సాక్షీ శివః సర్వగతోంతరాత్మా   సా కాశికాం నిజబోధరూపా."  పదవిభజనము   ప్రతి దేహగేహం-ప్రతి దేహమనే ఇంటిలో   కోశేషు పంచః- అన్నమయ-ప్రాణమయ-మనోమయ-విజ్ఞానమయ-    ఆనందమయ అని ఐదు ప్రత్యేక స్వభావములు గల తొడుగులలో    అదిరాజ మాన-విరాజమానమై యుండియును   వానిచర్యలను గమనిస్తున్నప్పటికిని   సాక్షీ శివః-వాటిని పట్టించుకోకుండా   సాక్షిగా చూస్తున్న శివుడే/ ఆ ప్రకాశమే తత్త్వబోధను తెలియచేయుచున్న ప్రకాశము.    పరమాత్మ కర్తృత్వము-భోక్త్వత్తమును ద్ధ్తానేనిర్వహ్పిస్తున్నప్పటికిని  రెండుగా ప్రకటితమగుచున్నాడు.ఒక్కదానిని అర్థముచేసుకొనుటకు రెండు స్వరూప-స్వభావములు సహాయపడుతుంటాయి.   అవే, 1. భవాని-దేహము-----భవుడు   ఆత్మ 2.భవాని-జీవాత్మ-భవుడు-పరమాత్మ 3.భవాని-విభాజ్యము (పంచకోశములు-పంచేంద్రియములు-పంచతన్మాత్రలు -భవుడు-అవిభాజ్యము 4.భవాని-సగుణము-భవుడు నిర్గుణము 5.భవాని-సాకారము-భవుడు నిరాకారము 6.భవాని-ఇంద్రియసహితము-భవుడు ఇంద్రియ రహితము 7.భవాని క్షత్రము...

ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAM NIJABODHA-02

Image
     జగద్గురువులు కాశీపంచక స్తోత్ర రెండవ శ్లోకమును "యస్యాం ఇదం కల్పితం" అంటూ ప్రారంభించి నిజబోధరూపా అంటూ ముగించారు.    ఈ కల్పితములో దాగి ప్రకాశిస్తున్నది సత్+చిత్ రూపము.శాశ్వతమైన తాను అంతర్యామిగా ఉన్నట్లుగా మనము భావించనీయనిది మన మనస్సు.అది లేనిదానిని ఉన్నట్లుగా/ఉన్నదానిని లేనట్ల్యుగా మనలను భ్రమింపచేస్తుంది.అదేకాదా "ఇంద్రజాలం"    లేని నీరు ఉన్నట్లుగా ఎడారిలోనిమృగతృష్ణ ,తిరుగుచున్న భూమి నిశ్చలముగా నున్నట్లు,సూర్యుడు ఉదయాస్త్తమయములు చేస్తున్నట్లు,కేవలము శరీరమే "నేను" అని అనుకునేలా చేస్తుంది ఆ ఇంద్రజాలం.       ఇంద్రియాతీతము/ఇంద్రియాధీనము అను రెండు అంసములను గమనిస్తేజీవులు/వారి మనోభావములుఇంద్రియాధీనములు.వారు కాశిని క్షేత్రముగా మాత్రమే భావించగలరు కాని తమ హృదయ స్థానముగా గమనించలేరు.గంగను తీర్థముగాను దేవతామూర్తులను మాత్రమే దర్శించగలరు కాని వానిలో దాగి ప్రకాశిస్తున్న పరమాత్మను " ఏకం సత్" గా భావించలేరు.నేను-నీవు అనే ద్వంద్వములకు బందీలు వారు.  పంచభూతములకు-పంచేంద్రియమూలకు సైతము  గల    అవినాభావ సంబంధము ప్రపంచముగా ఉన్నట్లుంటుంది. ...

ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAM-02

Image
  " యస్యామిదం కల్పితమింద్రజాలం   చరాచరం భాతి మనోవిలాసం   సచ్చిత్ సుఖైకా పరమాత్మరూపా   సాకాశికాహం నిజబోధరూపా."  పద విభజన  యస్యాం-ఇదం-కల్పితం+ఇంద్రజాలం+ భాతి+చరాచరం_ మనోవిలాసం+ పరమాత్మరూపా+సుఖ=ఏక సత్+చిత్+అహం+స+కాశికా+రూపా+నిజబోధ.  " ఎవ్వనిచే జనించు,జగమెవ్వని లోపలనుండు " అన్నారు మహాకవి పోతన.ఎందుకు పరమాత్మను ఎవ్వడు అన్నాడో ఆలోచిస్తే అపరిమిత మూలశక్తికి పరిమిత నామరూపములతో సంబోధించలేము కనుక."  దిక్కెవ్వరు ప్రహ్లాదుకు?దిక్కెవ్వరు పాండు సుతకు? దీనులకెపుడున్,  ఆనిర్వచనీయ పరమాత్మ ఇంద్రజాల ప్రసక్తి/ప్రశస్తియే ప్రస్తుత శ్లోకము.  యస్యాం ఇదం-ఇద్గా/దీనిగా/ప్రపంచముగా చెప్పబడుతున్న చరాచరము   స+ పరమాత్త్మ= ప్రపంచము. ఈ ప్రపంచము, 1.యస్యాం సః ఇదం పరమాత్మ నిర్మితం 2.యస్యాం సః ఇదం చరాచరమయం 3.యస్యాం సః ఇదం మనోవిలాస కల్పితం 4. యస్యాం సః ఇదం (భాతి)ప్రకాశం 5. యస్యాం ఇదం సః కాశికా నామం 6.యస్యాం సః ఇదం తత్త్వ బోధా రూపం 7. యస్యాం సః సత్+చిత్  ఇంద్రజాలం.   జగద్గురువులు మొదటి శ్లోకములో జీవుల మనో ప్రవృత్తి-నివృత్తుల ఫలితములను విశ్లేషించిన తదుపరి,ప్రస...

ASYA ASTI ITI KASI @ KASI PAMCHAKAMU -NIJABOEDHA-01

Image
   జగద్గురువులు "కాశీపంచక" స్తోత్ర రాజమును మనోనివృత్తిః అంటూ  ప్రారంభించి,కిం అస్తి అనిపూర్తిచేశారు.ఇదే విషయమును శ్రీకృష్ణభగవానుడు సైతము "శ్రీమద్భగవద్గీట"లో చివరిదైనమోక్ష సన్యాస యోగములో,  " ప్రవృత్తించ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే    బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః"     అంటూ సకల చరాచర బంధ-మోక్షములకు కారణము వారి మానసిక ఆలోచనల ప్రవేశము-నిష్క్రమణము (ప్రవృత్తి-నివృత్తుల) పేరిట చేయున్న వింతాసములు.   ప్రవృత్తులు అసత్తులో దాగియున్న సత్తును చూడనీయదు.దానికి కారనమును గుణత్రయవిభాగ యోగము  ' అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహమేవచ,తమస్యేతాని జాయంతే'  చీకటితోనున్న మనసులో ప్రవృత్తులు చేరి ప్రమాదకరమైన మోహమును కలిగిస్తూ,ప్రకాశమును చూడనీయవు.   ఆ చీకటి తొలిగించేందుకు ,వెలుతురునుచూపించేందుకు ఒక సహాయము కావాలి.ఆ సహాయము స్వఛ్చమైనదిగా-సారవంతమైనదిగా ఉండాలి.అదియే తీర్థరాజమైన జ్ఞానగంగా ప్రవాహము. ఆ ప్రవాహము నిన్ను మణికర్ణిక శ్రవనభాగ్యమునందించునదైన-శత్రువులను దహించగలిగినదైన మణికర్ణిక నుచేర్చుతుంది.  ఇదిమొదటి మజిలీ.  ఆ మణికర్ణిక మనచీకట్లను త...

ASYA ASTI ITI KASI@ KASI PAMCHAKAM-01

Image
 " మనో నివృత్తిః పరమోపశాంతిః సా తీర్థవర్యా మణికర్ణికాచ    జ్ఞాన ప్రవాహా విమలాది గంగా సా కాశీకాచ నిజబోధరూపా"    పదవిభజనము    మనోనివృత్తి-పరమ-ఉపశాంతి-సా-తీర్థవర్యా-మణికర్ణికాచ-జ్ఞానప్రవాహ-విమలాది గంగా-నిజబోధ రూపాచ-సా కాశికా.      సా-దేనినైతే ఇది అని వర్ణించలేమో/ఏదైతే నామరూపములు లేనిదానిగా    కాశికా-కాశ/ప్రకాశ స్వభావముతో నున్నదో     అది- ఆ మూలపదార్థము  నిజబోధ రూపా-తన గురించి మన బుద్ధికి తెలియచేసే స్వభావముతో ఉన్నది.  ప్రకాశము దాని రూపము  ప్రబోధము దానిలక్షణము.ప్రవాహ రూపముగా  ప్రకటనమగుచు జ్ఞానమును  ప్రబోధనము  చేయుట దాని  ప్రత్యేకత. చూడగలిగిన ఒక పుణ్య   క్షేత్రము  చూపిస్తూ అందులో సాక్షిగా నున్న మూలపదార్థమును దర్శింపచేయుట దాని ధ్యేయము.     ఆ బోధనము ఐదు ప్రయోజనములను జీవులకు కలిగిస్తున్నది.  1.మనో నివృత్తి  2.ఉపశమనము  3.మణికర్ణిక గట్టు పరిచయము  4.ఉపశమనము  5.ఆత్మబోధనము.         బాహ్యమునకు కాశీపట్తనము మానసిక అలజడులను తగ్గిస్తు...