Posts

Showing posts from October, 2020

ginjalu

Image
      మీడుష్టమ శివతమ-06     *********************   ' ఒకపరి జగముల వెలుపల "ఒకసారి ప్రత్యక్షము అవుతాడు.అంతలోనే అంతర్ధానమవుతాదు.చిత్రవిచిత్రములతో నన్ను చిత్తుగా మోసము చేసాడు.కనపడనీకడిగేస్తా ననుకొన్నాడు సాధకుడు.స్వామికి కావలిసినది కూడా అదేగా అదేనండి అభిషేకములు.క్షణములో ఎదురుపడ్డాడు.   ఊరకపోనీయడు కదా సాధకుని వాని సాధనను.ఊసుబోక అడుగుతున్నా అంతా సుభిక్షమే కదా అన్నాడు .ఊహించినదే జరిగింది.  ఉడుకుమోత్తనముతో చాల్లే సంబడం.అక్షుతుశ్చమ్మే అని అడిగాని.న క్షుత్తు చ మే నాకు ఆకలి లేకుండా ఉండాలి అని అడిగాను.అనుగ్రహించానన్నావు.ఆనందించాను.కాని,    కాని ఎక్కడిపోయింది ఆకలి.నా పక్కనే పొంచిఉండి,అదును చూసుకొని నాపై దాడిచేస్తున్నది.   ఇక నేను నిన్ను అడిగిందేమిటి? నువ్వు నాకు ఇచ్చిందేమిటి?ఏమి తెలియనట్లు అంతా సుభిక్షమేనా అంటూ కొంటె ప్రశ్నలు.    నువ్వే నాతో అన్నవు కదా ఒకటి వస్తే మరొకటి వెళ్ళిపోతుందని.ధాన్యరాశులను అనుగ్రహిస్తే దారి మళ్ళుతుందని ఆకలి.అందుకేగా,     నేను నీకు అందరిచేత ఇష్టముగా స్వీకరింపబడెడి వడ్లను ఇచ్చాను నువ్వు "వ్రీహాశ్చమే" అనగ...

AKALILEKUNDA

   మీడుష్టమ శివతమ-05  **********************  ఈశ్వరా నా ఈ ఆకలి నన్ను వివశుణ్ణిచేస్తున్నది.అడిగే లోపే అంతర్ధానమవుతావు.అన్నీ ఇచ్చాగా అంటావు.కనికరించు-కనిపించు వేడుకుంటున్నాడు సాధకుడు.వేదనను తీర్చకుండా ఉండగలడా వేదమయుడు.వచ్చేశాడు వరములను ఇచ్చేయాలని.    స్వామి అక్షుతిశ్చమే-నాలోని ఆకలి లేకుండా పోవాలి.అది పోవాలంటే ,  అక్షితిశ్చమే-కూయవాశ్చమే--- తరిగిపోని ధాన్యరాశులు నాకు కావాలి.అలాగా.అంటే ?అర్థము కానట్లు నటించడం-సాధకుని విజ్ఞతను పరీక్షించడము అదొక ఆట .     నాకు ధాన్యము కావాలి.ఉండు-ఉండు ముందుగా నాకు ఏయే-ఏయే ధాన్యములు కావాలో చెబుతాను.వాటిని ప్రసాదించు అన్నాడు ఆర్తితో.అనుగ్రహిస్తానన్నాడు పరమాత్మ మనస్పూర్తితో.   ఆకలిని తీర్చు వడ్లు-యవలు-మినుములు-శనగలు-పెసలు-నువ్వులు-గోధుమలు-నీవరి ధాన్యములు కావాలీనగానే చిరునవ్వు నవ్వాడు రుద్రుడు అందుకేగా నేనున్నది అంటూ.    అంతలోనే ఆదుర్దా ఆ సాధకునికి.ఇదిగో నన్ను పూర్తిగా అడగనీ.తికమక పెట్టకు.ఇస్తానన్నా కదా అని అంతో-ఇంతో ఇచ్చి ఇచ్చేసాను అంటావేమో.నేను ససేమిరా ఒప్పుకోను.నేను ఎంతెంత కావాలో కూడా చెబుతాను అన్నాడు చ...

MEEDUSHTAMA SHIVA-04

     మీడుష్టమ శివతమ-04.   ***********************   సాక్షాత్కరించాడు రుద్రుడు సాధకుని శిష్యత్వమునకు చిన్ని జిలుగు దిద్దటానికి.ఏమయ్యా సాధకా! ఎలా ఉంది నీ గురువుగారిపాఠము? అంటు గుట్టువిప్పించాలనుకున్నాడు   క్షత్రాణాంపతయే నమోనమః అంటు కరములు జోడించాడు సాధకుడు.     క్షత్రమేమిటి?దానికి పతి ఏమిటి?దానికి నాకు ఉన్న సంబంధమేమిటి?ఎందుకు నన్ను అలా సంబోధించావు అంటూ అడిగాడు ఆశ్చర్యమునునటిస్తూ ఆ ఆటలాదేవాడు.     పరాత్పరా! కదిలేవి కథలు వాటిని కదిలించేది నీ కరుణ.కాదనకుందా నేను చెప్పేది పూర్తిగా విను.అవగాహనారాహిత్యమును అడ్డగించు.మా గురువులు సృష్టి రహస్యములను సులువుగా అర్థము చేయించారు.     ఏమిటా రహస్యములు? అన్నాడు ఆ ఎరుకలవాడు.     ఇప్పుడు మనము అనాత్మకముగా భావించే జగతి ఒకప్పుడు ఆత్మస్వరూపమే.అది అప్పుడు గుప్తముగా నున్నది.అందులో నేను నా సంసారము కూడా ఉంది.అయితే అది గుప్తముగా ఉంది.కాని నిజమునకు ఇప్పుడు జగము ఆత్మ స్వరూపమే-అప్పుడు ఆత్మస్వరూపమే.అప్పుడు గుప్తము.ఇప్పుడు ప్రకటనము అన్నాడు రుద్రునితో .   బాగున్నావయ్య! గుప్తమంటావు-ప్రకటనము అంట...

MEEDUSHTAMA SIVATAMA-03

   మీడుష్టమ శివతమ-03  *********************   " న రుద్రో రుద్రమర్చయేత్" రుద్రుడు కాని వాడు రుద్రును భజించలేడు.అని ఆర్యోక్తి. జీవుడు రుద్రుడు ఎలా అవుతాడు?అనే సందేహము మనకు రావచ్చును.సకలము వికలముగా మారుతున్నాప్పుడు విస్తృతరూపమును ప్రకటించుకొనునప్పుడు అందులోని చిన్న శకలమే జీవుడు.ఇది కాదనలేని నిజము .సాధకుడు రుద్రుని అనుగ్రహము వలన అన్నాదులను వాటి ఉపయోగములను తెలుసుకున్నాడు.తృప్తిచెదాడా వాటితో అని అంటేలేదనే చెప్పాలి.చ మే నాకు కావాలి.అది కావాలి-ఇది కావాలి-ఇంకా--ఇంకా అంటూ ఇబ్బంది పడుతున్నాడు.  ముసిముసి నవ్వులతో ముక్కలను కదిలిస్తున్నాడు ముక్కంటి.మరింక నేను వెళ్ళిరానా అంటూ ముక్తాయింపు పలికాడు.    ఆగవయ్యా ఆదిదేవా! అన్నీఅడుగు-అన్నీ అడుగు అంటూనే ఆలోచించుకోనీయక్యండా -అడుగనీయకుండా అయిపోయిందా అంటున్నావు.అమ్మో చమత్కారివే.   ద్రవిణంచమే-యంతాచమే అని కద నీచమకము చెబుతున్నది.నన్ను ఉధ్ధరించగలుగు మంచి గురువును అనుగ్రహించు అన్నాడు సాధకుడు సాగిలపడుతూ.   సరే అలాగే కానీ.గురువుద్వారా నీవు ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నావు అన్నాడు రుద్రుడు అమాయకముగా.    సంవిచ్ఛమే శివా...

MEEDUSHTAMA SIVATAMA-02

      మీడుషటమ శివ-02    ***********************    న రుద్రో రుద్ర మర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రునితో సంభాషించలేడు-అర్చించలేడు.   సాధకుని మాటకు మయశ్చమే అంతే అని అమాయకముగా అడిగాడు ఆదిదేవుడు అమాయకముగా.ఎంత చతురుడవయ్యా చంద్రశేఖరా! శాపగ్రస్థౌడైన చంద్రుని నీ చాతుర్యముతో శిరోభూషనముగా చేసికొనినావు.ఆ అవ్యాజప్రేమ అటుగా వెళుచున్న నాపై కొంచము ప్రసరించినదేమో.నా నోటినుండి వినాలనుకున్న నీ కోరికను నా అదృషముగా స్వీకరిస్తాను.    నాకు ఇల్లుకావాలి అన్నానుకదా.నీవు సరే అన్నావు.నా ఈ ఉపాధియే ఇల్లు  వస్యశ్చమే అని అడిగాను.  .గూటిలో కూర్చుని ఉన్న నాకు నీ అనుగ్రహముతో ఈ ఉపాధి ఉపయోగమేమిటి? అనే ప్రశ్న ఉదయించింది.ఇదియే నాకు నా ఆధ్యాత్మిక అంచులను చూపించే సాధనము అని అనిపించింది.ఇట్టి విశిష్టగల పరికరమును నేను సమర్థవంతము చేసుకోవాలి కద.అందుకే ఆధ్యాత్మికముగా తృప్తిని కలిగించే భావములను అహారముగా ఇమ్మనమని "ప్రియంచమే" అని అర్థించాను.సంకల్ప వికల్పములు నా మనసును కుదిపివేస్తూ ప్రశాంతతకు అడ్డుపడుతున్నాయి.వాటిని తొలగించి,నా మనో క్షత్రమును చదును చేయుటకు నాగలిని "సీరంచమే" అ...

MEEDUSHTAMA SIVATAMA-01

      మీడుస్టమ శివ-వరములను వర్షించు-01     ***********************************   శం చ మే-    మే నాకు చ కుడా కావాలి ఏది కావాలి?  శం అనగా ఐహిక సుఖము.    ఐహిక సుఖమును పొందవలెనన్న శరీరమునకు ఆహారము-మనసునకు ఆహ్లాదము కావాలి.   తలదాచుకొనటానికి ఇల్లుకావాలి.కనుక -వస్యశ్చమే.      గూటిలోనికి చేరిన తరువాత కూటిపై తాపత్రయము సహజమే కదా-కనక సీరంచమే-వ్యవసాయము చేసుకొనుటకు కావలిసిన నాగలి-ఎద్దులు-ఇతర పరికరములు కావాలి.కనుక సీరంచమే.    ఆహారముతో పాటు నీరు కూడ కావాలి-అంబశ్చమే.  మనకు కావలిసిన అన్ని వస్తువులను పండించుకోలేము కదా! కనూ మిగిలినవి కొనుగోలు చేయవలసినదే.కనుక ద్రవిణశ్చమే.    కూడు-గూడు ఇచ్చావు.మేము వాటిని ఆస్వాదిస్తూ,అనుభవించాలికదా.కూరిమితో వాటిని అనుభవిస్తున్న సమయములో చిన్న చిన్న జలుబు-దగ్గు-జ్వరము వంటి శరీర రుగ్మతలు రావచ్చును.వాటిని దూరముగా నెట్టివేయి-అనామయశ్చమే.    నువ్వు చిన్నచిన్న వాటిని నెట్టివేస్తున్న సమయములో క్షయ మొదలగు పెద్దపెద్ద వ్యాధులు మమ్ములను సమీపించుటకు సాహసము చేయవచ్చును.వాటిని కూడ మా...

009

    అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో    ప్రసీద మమ సర్వదా-09      *******************   మాతా సిధ్ధిధాత్రి నమోనమః.  " సిధ్ధగంధర్వ యక్షాద్యైః అసురైరమరైరపి    సేవ్యమాన సదాభూయాత్ సిధ్ధిదా సిధ్ధిదాయిని"   సిధ్ధులనైన,గంధర్వులైన,యక్షులనైన,అసురులనైన,అమరులనైన,ఎవరినైనా కొలిచినవారికి సిధ్ధిప్రదాయిని జగదంబ.ఈ శ్లోకము చెప్పకనే చెప్పుతున్నది"ఏకైవ అహం" అన్నింటిలో నుండే దానిని నేనేనని.వేరొకటి లేదని.అనుగ్రహ ప్రతిరూపము దైవత్వము అయితే అహంకార ప్రతిరూపత్వము అసురత్వము.ఇప్పటి వరకు జరిగిన పోరు అహంకారమునకు -అనుగ్రహమునకు . కనుకనే కొమ్ములను అహంకారమునకు గుర్తుగా-నలుపు తనమును తామస గుణమునకు గుర్తుగా-కరుకు చర్మము మూర్ఖత్వమునకు గుర్తుగా-తల్లి అనునయమును పెడచెవిని పెట్టి పోరునకు సిధ్ధపడుట పశ్చాత్తాప రాహిత్యమునకు గుర్తుగా అన్నీ కలబోసిన మహిషునికి-రాశీభూతమైన కరుణకు మధ్యన జరిగిన కదనములో అహంకారము సమసిపోయి అనుగ్రహమును చేరినది.తల్లి కర స్పర్శ కర్మఫల విముక్తుని చేసినది.ఈ విషయమును అమ్మ మనకు మహిషునిచే పలికించిం-నది.నా ఒక్కనితో పోరాడుత చేతకాక ఎన్నో శక్తులను ఎందరో స్త్రీలను ...

0008

  అమ్మకు   సభక్తిపూర్వక నమస్కారములతో   ప్రసీద మమ సర్వదా-08   **************  మహాగౌరి నమోస్తుతే  "శ్వేతవృషే సమారూఢా శ్వేతాంబర ధరా శుచిః   మహాగౌరి శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా"  అష్టవర్షా భవేద్గౌరీ -తల్లి ఎప్పుడు ఎనిమిది సంవత్సరముల వయసుగల మూర్తిగా దర్శనమిస్తుందట.   ' కర్పూరగౌరం కరుణావతారం     సంసారసారం భుజగేంద్రహారం     సదావసంతం హృదయారవిందే     భవం భవానీ సహితం నమామి."    అయ్య కర్పూరకాంటివంటి తెల్లని కాంతిగలవాడని,అమ్మ బ్రహ్మచారిణిగా ఘోరతపమాచరించుటచే,నల్లని శరీరకాంతితో నున్నదని.కాళి అని స్వామి మేలమాడినందుకు తల్లి తన శరీరఛాయను ఆకాశగంగా జలముతో పునీతము చేసుకొని గౌరవర్నమును పొంది గౌరి నామధారియైనదని ఒక కథనము.స్వామి అమ్మ కన్నులు సరదగా మూసినందులకు చీకటి తల్లి శరీరకాంతిని పొందినదని మరొక కథనము.ఏది ఏమైనప్పటికిని ఆదిశక్తి తన చర్మ కాంటిని నల్లగా ప్రకటించుకొనుట-తదుపరి తెల్లగా ప్రకాశించుట లోని పరమార్థము ప్రశస్తనీయము.   మనము ముందర చర్చించుకొనినట్లు అసురులు తమ జీవితమును-మరనమును అత్యంత ప్రత్యేకముగా తీర్చిదిద్దుకుం...

0007

అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో ప్రసీద మమ సర్వదా మాతా కాళరాత్రి నమోనమః " ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరస్థితా లంబోష్ఠి కర్నికాకర్ణీ తైలాచ్యక్త శరీరిణీ వామపాదోల్లిసల్లోహలితా కంతకా భూషణా వరమూర్థ్వ ధవజా కృష్ణాకాళరాత్రిర్భయంకరీ." జుట్టును చెల్లాచెదురుగా విరబోసుకొని,పెద్దగా వాచిన పై పెదవితో,శరీరమంతా తైల లేపనముతో,ముళ్ళ ఆభరనములను ధరించి,గాడిదపై ఎడమకాలు ముందుకు చాచి,కూర్చున్న కాళరాత్రి మాత మనలను రక్షించు గాక. కాళరాత్రిః మహారాత్రిః మోహరాత్రి చ దారుణా" రాత్రిసూక్తము. అంటూ రాత్రి తత్త్వము నాలుగు విధములుగా ప్రస్తుతించబడినది.దీపావళి ముందురోజువచ్చే చతుర్దశిరాత్రి కాళరాత్రి.దీపావళినాటి రాత్రి మహారాత్రి.శ్రీకృష్ణజన్మాష్టమి మోహరాత్రి.అక్షయతృతీయ దారుణరాత్రి అని పెద్దలు చెబుతారు. అసలు మనము రోజు నిద్దరపోయే సమయమే రాత్రియా లేక రాత్రి శబ్దము ఇంకేమైన అంతరార్థమును కలిగియున్నదా అని మనలను మనము ప్రశ్నించుకుంటే ప్రతిజీవి అంతర్ముఖమే రాత్రి.బహిర్ముఖమే పగలు.కర్షణాత్ కృష్ణః.సమస్తమును తనలోనికి ఆకర్షించుకొనుశక్తి కృష్ణతత్త్వము.అదియే కాళరాత్రి తత్త్వము....

0006

    అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో    ప్రసీద మమ సర్వదా-06    **************************     కాత్యాయనీమాతా నమోనమః.  " చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహనా    కాత్యాయినీ శుభం దద్యాదేవి దానవఘాతినీ."   అమరకోశం పార్వతీదేవిని కాత్యాయనీ నామంతో కీర్తించింది.అనేక నామ-రూపాలు అమ్మ క్రీడలు.సింహవాహిని యైన తల్లి ఘోరాఘోర రూపిణి.   అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ కత్యమహర్షిచే అమ్మాయి అని పిలిపించుకుంటూ ఆనందించింది,తండ్రిగా మునిని అనుగ్రహించింది.కత్యగోత్ర సంభవురాలు కనుక కాత్యాయినీ నామముతో కళ్యాణములను అనుగ్రహించింది.ఇది వాచ్యార్థము.    సాధకుడు తత్ ను దర్శించవలెనన్న ,  కతిః యానం? ఏది మార్గము? కతిః అయనం? ఎటువైపు పయనము? అని దారితెన్ను తోచని స్థితిలో నుండగా తల్లి తానే మార్గమై వారిని ఉధ్ధరించునది కనుక కాత్యాయని.ఇది పరమార్థము.   కాత్యాయనీ మాత బుధ్ధిబలముతో కూడిన భుజబల ప్రకాశము.ఆజ్ఞా చక్ర అధిష్ఠాన దేవతగా సాధకునకు ఏకాగ్రతను అనుగ్రహిస్తుంది.మహిషాసుర ఆగడములవలన ధర్మము క్షీణిస్తూ,గ్లనిని పొందే సమయమున క్రోధరూపిణియై ఆదిశక్తి మహిషాసుర మర...

0005

. అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో ప్రసీద మమ సర్వదా-05 ****************** స్కందమాత నమోనమః ******************* "సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదాదేవి స్కందమాతా యశస్వినీ" ఇంతవరకు జగన్మాత నిర్ద్వంద్వ రూపిణిగా నిరుపమాన ప్రతిభతతో జగములను సృష్టించింది."ఏకైవాహం బ్రహ్మం" అన్న నానుడి మరొక శుభపరిణామమునకు శ్రీకారముగా మహాశక్తి తన ఒడిలో మరొక అద్భుత శక్తితో మనకు దర్శనభాగ్యమును అందిస్తున్నది. ఎంత తియ్యటిమామిడి పండో అంటూ నేడు మనము ఆస్వాదించగలుగుతున్నామంటే ,ఎంతో కాలానికి ముందు.ఎవ్వరో మహానుభావుడు మామిడిటెంకను భూమిలో నాటడము జరిగిదింది.భూమి దానికి తనశక్తిని అందించి,అగ్ని చైతన్యమును అందించి మొలకగా మార్చినది.వరుణుడు అందించిన జలములతో మొలక మొక్కగా మారినది.మొక్క సూర్యకిరణములనుండి పత్రహరితమునుచంద్రుని వెన్నెలలోని ఔషధశక్తులను తనలో నింపుకుంటూ కొమ్మలతో వాయువందిస్తున్న శక్తిని తనలో నింపుకుంటూ పంచభూతాత్మక పోషణలో మహా వృక్షముగా రూపుదిద్దుకుని మధురఫలములను మనకు అందిస్తున్నది.ఇది లౌకిక ఉదాహరణము. పంచభూతాత్మికం పరమశివం అన్నది కాదనలేని సత్యము....

0004

అమ్మకు సభక్తి పూర్వక నమస్కారములతో ప్రసీద మమ సర్వదా-04 ********************* మాతా కూష్మాండా నమోనమః "సురాసుర సంపూర్ణ కలశం రుధిరా పుత్రమేవచ దధనా హస్త పద్మాభ్యాం కుష్మాండా శుభదాస్తుం " శైలపుత్రీ మాత మనకుబ్రహ్మచారిణి మాతను పరిచయము చేస్తే,బ్రహ్మచారిణి మాత మనకు చంద్రఘంట తల్లి పరిణయమను ప్రసాదగుణమును అందించింది.ఇల్లాలైన చంద్రఘంట తల్లి సూక్ష్మ-స్థూల రూపములతో అండరూపముగా ధరించు కూష్మాండ మాత కరుణరసామృత వర్షిలో మునిగితేలే మురెపమును అందించింది. కు అనగా చిన్న/సూక్ష్మ అను భావమును మనము గ్రహించగలిగితే,ఊష్మాండా అనగా సుందరతత్త్వము.అనగా తల్లి మనలో సూక్ష్మరూపములో నిండి స్థూలతత్త్వమును దర్శింపచేస్తుంది తల్లి.అందుకే ఆమ్మ అష్టసిధ్ధిస్వరూపిణి అయిన అష్టభుజి. పదునాలుగు భువనంబులు కుదురుగ తన కుక్షిలో నింపుకొని,దేవకీదేవి గర్భములో ఒదిగిన శ్రీకృష్ణుని వలె సూక్ష్మాతిసూక్ష్మము కాగలదు.అదే విధముగా ఇందుగలదందులేదని...ఎందెందు వెతికి చూసిన అందందేగలడు చక్రి అని ప్రహ్లాదుడు అన్న చందంబున విశ్వరూపియై విచ్చేయగలది కూష్మాండమాత. నమో పూర్వజాయచ-పరజాయచ" అని రుద్రములో చెప్పబడినట్లుగా,స...

003

అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో ప్రసీద మమ సర్వదా-03 ********************* చంద్రఘంట మాతా నమోనమః " పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తమతేహ్యం చంద్రఘంటేతి విశ్రుతా". శైలపుత్రీ మాత మనలను బ్రహ్మచరిణి మాతకు అప్పగిస్తే తల్లి పరమేశుని అర్థాంగిగా పరిణయమాడు సమయమున తాను సౌమ్యరూపియై-తన నాథుని సౌమ్యరూపునిగా ప్రకటించుకొనమని అర్థించి,శివశక్త్యైకరూపిణియై,సౌభాగ్యచిహ్నముగా తానును నుదుటను ఘంటాకృతిలో నున్న చంద్రఘంటను ధరించి,వినూత్న శోభలతో విశ్వేశ్వరుని అర్థాంగి గా మారినది. తల్లి ధైర్యమునకు గంభీరతకు ప్రతీకయైన పెద్దపులినిగాని/సింహమును గాని వాహనము చేసుకొని శివునిశక్తియై శుభములనొసగుచున్నది. తల్లి నామములో చంద్ర-ఘంట అను రెండు పదములున్నవి.ఇవి రెండు విభిన్న స్వభావముల సంకేతములు.అమ్మ ఘోర/అఘోర రూపములను దుష్టశిక్షణకు-శిష్ట రక్షణకు ధరించు విధానమును పరిచయము చేస్తున్నవి. చంద్ర పదము చంచలత్వమును-ఘంట పదమును నిశ్చలత్వమును తెలియచేస్తున్నవి.ఇక్కడ చంద్రుని రూపమును గాక స్వభావములకు సంకేతములుగా పరిగణిస్తే రెండు పరస్పర విరుధ్ధభావములైన చంచలత్వమునకు-నిశ్చలత్వమునకు ప్రాతినిధ్...

oo2

Image
ప్రసీద మమ సర్వదా-02 *********************** అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో, నవదుర్గ ప్రస్తావన వరాహపురాణములో వచ్చినదని,పురాణాలు ప్రణవము నుండి పుట్టినవని పెద్దలు చెబుతారు. సూర్యుడు కన్యారాశిలో నుండు సమయము కనుక పరమాత్మ తత్త్వమును స్త్రీమూర్తిగా భావించి-పూజించు సంప్రదాయమును అనుసరించేవారు ఉన్నారు. శరత్కాలముులోని నవరాత్రులను దేవిశరన్నవరాత్రులంటారని దీనినే బతుకమ్మాగా ప్రకృతిని కొలిచే సంప్రదాయమును మనము చూస్తూనే ఉన్నాము. నవ శబ్దమునకు నూతనత్వమును సంతరించుకొనిన అనగా కొత్త కొత్త నామరూపములతో ఏ ఆకారములేని తత్ అనేక ఆకారములై,నామరూపములతో అలరారుతూూ.అసుర సంహారమునుచేసి,ఆనందోత్సాహములనులను నింపిన సమయము ఇది.పురాణము అను పదమునకు పూర్వకాల కథా విశేషముగా అన్వయించుకుంటే ఇది సరిపోతుంది.తల్లి అనుగ్రహము మనలను అంతటితో ఆపేస్తుందా? అన్వేషణను కొనసాగిస్తుందా? అంటే రెండవది తథ్యము.సంఖ్యా పరముగా నవ అను శబ్దము తొమ్మిది"9" అను సంఖ్యను సూచిస్తుందికదా.తొమ్మిది అను సంఖ్యను హెచ్చవేస్తూ వచ్చినదానిని కూడుతుంటే మళ్ళీ తొమ్మిదే వస్తుంది.అంతే అమ్మ అనేక రూపాలను దర్శిస్తూ,దయను అన్వయము చేసుకుంటే అన్నిరూపాలలో...

01NAMONAMAHA

Image
నవదుర్గ మాతా నమో నమః ******************** ప్రసీద మమ సర్వదా ****************** "యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ" నిరాకార-నిరంజన నిర్గుణ నిత్య తత్త్వమే తత్.అంటే అది.అది అంటే అన్నింటా ఉన్నది.దానినే సా సావర్ణిగా ( సా అనే అక్షరముగా పెద్దలు చెబుతారు.ఇంకా సులభముగా మనకు అర్థమవాలంటే ఏకాతత్త్వమే-బహుముఖములుగా తనని తాను పరిచయము చేసుకొనుచు ఆదే చదరంగపు ఆట.ఇందులోని జీవులనే పావులలో కొన్నిటిని తనకు అనుకూలముగా మరి కొన్నింటిని తనను ధిక్కరించునవిగా మనలను భ్రమింపచేయుచు,ఎత్తుకు పైఎత్తులను ప్రదర్శింప చేయుచు,కొన్నిటికి రాజు అని,ఇంకొన్నిటికి మంత్రులని,అశ్వములని,బంటులని ఎల్లా ఎన్నో నామరూపములను నిర్ధారించి,ఆట ముగిసిన వెంటనే అన్ని పావులు చదరంగపు బల్లతో సహా పెట్టెలో కలిసిపోయి ఉండినట్లు తల్లి తన లీలగా అసురులు-సురలు అను రెండు వర్గములను మనము భావించునట్లు చేసి,మనకు అర్థము చేయవలెనను దయతో తానొక పక్క-వారినొక పక్క పెట్టి ఎత్తు...

PRASEEDA MAMA SARVADAA-09

Image
ప్రసన్న మమ సర్వదా-09 మాత సిధ్ధిధాత్రి నమోనమః "సిధ్ధ గంధర్వ యక్షాద్యైః అసురైః అమరైరపిః సేవ్యమానా సదా భూయాత్ సిధ్ధిదా సిధ్ధిదాయినీ". ధాత్రీ అను శబ్దమునకు అనుగ్రహించునది-ప్రసాదించునది అని అర్థము.అమ్మ మనకు సిధ్ధులను ప్రసాదిస్తుంది కనుక సిధ్ధిధాత్రి నామముతో కీర్తింపబడుచున్నది.తల్లి మనతో పాటు ఉంటూ,మనలను చైతన్యవంతులను చేస్తూ,సన్మార్గమును చూపిస్తూ,దానికి కావలిసిన సిధ్ధులను అనుగ్రహిస్తుంటుంది. మనలోని సద్గుణాల సమ్మేలనమే సిధ్ధులు.కాని ముఖ్యముగా అష్టసిధ్ధులు మనకు అనేక విషయములను తెలియచేస్తాయి.వాటికి అనుగునముగా మన ఇతిహాస కథలు వాటి ఉపయోగవిధానమును మరింత వివరించినవి.ఉదాహరనకు సూక్ష్మావస్థలో కూడా భగవ్తత్త్వమును గ్రహించగలగటము అణిమ-భగవతత్త్వమును అన్నింటా దర్శించకలగటము మహిమ-అంటే సూక్షముగా -స్థూలముగా నున్న భగతత్త్వమును గుర్తించగలుగుట.గరిమ-లఘిమ మరొక రెండు సిధ్ధులు.అతి తేలికగా మారుట-అత్యంత బరువుగా (రూపములో ఏమార్పులేకుండ) మారుట.ప్రాప్తి-ప్రాకామ్యము మరొక రెండు శక్తులు.శూన్యముగా పైకి కనిపించేదానిలో శక్తిని గ్రహించగలుగుట ప్రాప్తి అయితే దానిని పొందగలుగుట ప్రాకామ్యము.ఈశిత్వము-వశిత్...

PRASEEDA MAMA SARVADAA-08

Image
ప్రసీద మమ సర్వదా-08 మహాగౌరి నమోస్తుతే శ్వేతవృషే సమారూఢా శ్వేతాంబర ధరా శుభాః మహాగౌరి శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా" అష్టవర్షా భవేద్గౌరీ మహా అత్యంత గౌరి తెల్లని శరీరకాంతి కలది.అత్యంత గౌరవ ప్రదాయిని. శుంభ-నిశుంభులను రాక్షసులు తమకు పార్వతీదేవి పుత్రికతో తప్ప అన్యులతో మరణమును పొందని వరము కలవారైరి.వరబల గర్వితులైన వారు యుక్తాయుక్తములను మరచి ధర్మమునకు గ్లానిని కలిగించసాగిరి. పరమేశ్వరి లీలలు పరమదాయార్ద్రశీలములు.ధర్మసంస్థాపనకు శుంభనిశుంభులు నిర్గమించాలి.దానికి తన సరీరమునుండి ఒక మహాశక్తి తన పుత్రికగా ఆవిర్భవించాలి.దానికొక బాహ్య కారణమును చూపించాలి(మనకు అర్థమగుటకు) కనుక తల్లి తన కాళి రూపము లోని నల్లని రంగును నెపముగా మలచుకొని,దానిని విడనాడుటకు మానససరోవములో మునిగినది.తల్లి తలచుకుంటే కానిది ఏముంది? మానస సరోవరము తన బాధ్యతగా తల్లి నల్లని చర్మమును తల్లి నుండి వేరుచేసి,మహాగౌరిగా అమ్మను ప్రకాశింపచేసినది. తల్లినుండి విడివడిన చర్మమునుండి మహాద్భుత శక్తి "కౌశికి" గా (కోశమునుండి వెలువడినది) ఆవిర్భవించి,అసురుని అస్తమింప చేసినది.తమస్సు ఉషస్సును చేరినది.ఎంతటి దయామయి...

PRASEEDA MAMA SARVADAA-INTRODUCTION

Image
ప్రసీద మమ సర్వదా నవదుర్గ మాతా నమో నమః యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ ఎవతె యందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, ఎవతె తనే జగదాకారంగా పరిణామం చెందిందో, ఎవతె నామరూపాలకు ఆశ్రయమో, ఎవతె మూడు గుణాలు గవ మూల ప్రకృతియో, ఎవతెయే స్వయంగా అనంత రూపాలైన శక్తియో, ఎవతె నిత్యమూ మళ్ళీ మళ్ళీ ఆవృత్తమయ్యే తొమ్మిది రూపాలు (నూతన రూపాలు) కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి జయుంచుగాక. నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను. దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే వచ్చిన సంభాషణ లోంచి దుర్గాదేవి వివరాలు మనకు వరాహ పురాణాం నుంచి ఈ క్రింది విధంగా తెలుస్తుంది. 'ప్రథమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాందేతి చతుర్థకం పంచమ...

PRASEEDA MAMA SARVADAA-07

Image
ప్రసీద మమ సర్వదా మాతా కాళరాత్రి నమోనమః " ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరస్థితా లంబోష్ఠి కర్నికాకర్ణీ తైలాచ్యక్త శరీరిణీ వామపాదోల్లిసల్లోహలితా కంతకా భూషణా వరమూర్థ్వ ధవజా కృష్ణాకాళరాత్రిర్భయంకరీ." జుట్టును చెల్లాచెదురుగా విరబోసుకొని,పెద్దగా వాచిన పై పెదవితో,శరీరమంతా తైల లేపనముతో,ముళ్ళ ఆభరనములను ధరించి,గాడిదపై ఎడమకాలు ముందుకు చాచి,కూర్చున్న కాళరాత్రి మాత మనలను రక్షించు గాక. తల్లి రూపము భయంకరము కాని స్వభావము శుభంకరము.మనకు అసురబాధను తొలగించుటకు ,పరమ శివుడు గరలమును తన కంఠమున నిలుపుకొనినట్లు (మహాకాలుడు) రక్తబీజుని రక్తపు బొట్లను తాను స్వీకరించినది తల్లి.పరహితము కొరకు "పరోపకారాథమిదం శరీరము" అను సూక్తిని నిజము చేస్తూ,తల్లి ఒక్క బొట్టును కూడా కిందపడనీయకుండా సేవించి,తత్ప్రభావమా అనునట్లు లోకములను గజగజలాడించుచు వికృతముగా నాట్యము చేసినది.ఇవేవి నిరాకార-నిర్గుణ-నిరంజన-నిశ్చల తత్త్వమును చేరలేవను సత్యమును చాటినది.దీనిని బట్టి బాహ్యము తాత్కాలికము అశాశ్వతము-లోపలి పరబ్రహ్మము నిత్యము నిర్మలము అని తెలిసికొనుటకు సాధకులు సహస్రా చక్రములో ఆత్మతత్త్వమును అనుసంధించుకొన...

PRASEEDA MAMA SARVADAA-06

Image
ప్రసీద మమ సర్వదా-06 కాత్యాయినిదేవి నమోనమః " చందరహాసోజ్వలకరం శార్దూల వరవాహనం కాత్యాయినీం శుభం ధధాత్దేవి దానవ ఘాతినీ" దుష్టదూరా దురాచార శమనీ దోషవర్జితా" కాత్యాయినీ మాత గుహ్యాతిగుహ్యముల గూఢతత్త్వము.పురుషసూక్త ప్రకారము తల్లి సమస్త విశ్వములోని నాల్గవ భాగమును మాత్రమే ప్రపంచముగా మనకు వ్యక్తముగా ప్రకటించి,మిగిలిన మూడు భాగముల అమృతమయమైన అవ్యక్తమునకును అధిస్ఠాత్రియై అలరారుచున్నది. నామరూపములను పరిశీలిస్తే,దైవకార్యార్థము "కతుడు" అనే ముని పుంగవుని ఆశ్రమములో జన్మించి-పెరిగినందున కాత్యాయినీ నామముతో కీర్తింపడుతున్నది తల్లి.తల్లి స్వభావమును పరిశీలిస్తే జ్ఞాన విజ్ఞతను అందిస్తూనే దానికి ఏల క్రియాశీలకత్వమును అనుసంధిస్తుందో సాక్షాత్తు గాయత్రీ స్వరూపముగా సకల శాస్త్ర విజ్ఞానమును సంహార రూపముతో యోధ గా క్రియాశక్తిని మేళవించి వాటిని సఫలీకృతము చేస్తుంది తల్లి. మరొక్క ముఖ్యమైన విషయము తల్లి తాను క్రోధస్వరూపిణిగా ఆవిర్భవించినది.కాని దానికి అరిషడ్వర్గములు కావు.కామ-క్రోధముల ఫలితములు వానిని ప్రేరేపించిన మూలకారణల బింబ-ప్రతిబింబములు.తల్లి ధర్మము నాలుగు పాదములతో నడువవలెనని...

PRASEEDA MAMA SARVADA05

Image
ప్రసీద మమ సర్వదా-06 స్కందమాత నమోనమః సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదాదేవి స్కందమాతా యశస్వినీ అరవ నవదుర్గ స్కదమాతాదేవి.కూష్మాందా మాత అండరూపములో సమస్తమును తన గర్భములో నిక్షిప్తము చేసునినది కదా.దానిని ధర్మ రక్షనకు ప్రకటించవలసిన సమయమాసన్నమైనందున స్కందమాత గా అమ్మదనముతో మనలనందరిని తారకాసురుని బారి నుండి నెమ్మదింపచేయుటకై తన జాన-క్రియాశక్తులను శివశక్తితో కలిపేసి స్కందుని దేవసేనాధ్యక్షునిగా చేసినది తల్లి. స్కందము చేయబడిన శక్తి నుండి ఆవిర్భవించిన శక్తి స్కందనామముతో సంకీర్తించబడుతున్నది.ధర్మరక్షణార్థము బ్రహ్మ వరమును గౌరవించుటకు,మన్మథ దహన సమయమున వెలువడిన శివతేజము ఆరు భాగములుగా విభజింపబడినదట.ఆ తేజస్సును వాయువు-అగ్ని దాచిన గంగ దేవి ఒడిని చేరినదట.ఆ తల్లి ఆ దివ్యతేజమున రెల్లునందు దాచినదట. రెల్లునుండి తారకుని దుందగములను చెల్లు చేయుటకు అద్భుత బాలురు ఆవిర్భవించిరట.కృత్తిక నక్షత్ర శక్తులు ఆరు ఆ బాలునికి తమ శక్తులను స్తన్యమునిచ్చి యుధ్ధ సన్నధ్ధునిచేసినవి.తారకుని అంతమొందించగల ఆరుగురు బాలురను అమ్మ తన అక్కున చేర్చుకొని అత్యంత సుందర షణ్ముఖునిగ తీర్చిదిద్దినది.షన్ముఖుని ...

PRASEEDA MAMA SARVADA04

Image
ప్రసీద మమ సర్వదా-04 మాతా కూష్మాండా నమోనమః "సురాసుర సంపూర్నకలశం రుధిరా పుత్రమేవచ దధనా హస్త పద్మాభ్యాం కుష్మాండా శుభదాస్తుం " శైలపుత్రీ మాత మనకుబ్రహ్మచారిణి మాతను పరిచయము చేస్తే,బ్రహ్మచారిణి మాత మనకు చంద్రఘంట తల్లి పరిణయమను ప్రసాదగుణమును అందించింది.ఇల్లాలైన చంద్రఘంట తల్లి సూక్ష్మ-స్థూల రూపములతో అండరూపముగా ధరించు కూష్మాండ మాత కరుణరసామృత వర్షిలో మునిగితేలే మురెపమును అందించింది. కు అనగా చిన్న/సూక్ష్మ అను భావమును మనము గ్రహించగలిగితే,ఊష్మాండా అనగా సుందరతత్త్వము.అనగా తల్లి మనలో సూక్ష్మరూపములో నిండి స్థూలతత్త్వమును దర్శింపచేస్తుంది తల్లి.అందుకే ఆమ్మ అష్టసిధ్ధిస్వరూపిణి అయిన అష్టభుజి. పదునాలుగు భువనంబులు కుదురుగ తన కుక్షిలో నింపుకొని,దేవకీదేవి గర్భములో ఒదిగిన శ్రీకృష్ణుని వలె సూక్ష్మాతిసూక్ష్మము కాగలదు.అదే విధముగా ఇందుగలదందులేదని...ఎందెందు వెతికి చూసిన అందందేగలడు చక్రి అని ప్రహ్లాదుడు అన్న చందంబున విశ్వరూపియై విచ్చేయగలది కూష్మాందమాత. ప్రళయానంతరము సర్వము అంధకారబంధురమైన సమయమున "మందస్మిత ప్రభాపూర" తన చిరునప్పు కాంతులతో చీకట్లను చిదిమివేసినది.సూర్యమండలమధ్...

PRASEEDA MAMA SARVADAA-03

Image
ప్రసీద మమ సర్వదా-03 చంద్రఘంట మాతా నమోనమః " పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తమతేహ్యం చంద్రఘంటేతి విశ్రుతా". శైలపుత్రీ మాత మనలను బ్రహ్మచరిణి మాతకు అప్పగిస్తే తల్లి పరమేశుని అర్థాంగిగా పరిణయమాడు సమయమున తాను సౌమ్యరూపియై-తన నాథుని సౌమ్యరూపునిగా ప్రకటించుకొనమని అర్థించి,శివశక్త్యైకరూపిణియై,సౌభాగ్యచిహ్నముగా తానును నుదుటను ఘంటాకృతిలో నున్న చంద్రఘంటను ధరించి,వినూత్న శోభలతో విశ్వేశ్వరుని అర్థాంగి గా మారినది. తల్లి ధైర్యమునకు గంభీరతకు ప్రతీకయైన పెద్దపులినిగాని/సింహమును గాని వాహనము చేసుకొని శివునిశక్తియై శుభములనొసగుచున్నది. తల్లి నామములో చంద్ర-ఘంట అను రెండు పదములున్నవి.ఇవి రెండు విభిన్న స్వభావముల సంకేతములు.అమ్మ ఘోర/అఘోర రూపములను దుష్టశిక్షణకు-శిష్ట రక్షణకు ధరించు విధానమును పరిచయము చేస్తున్నవి. చంద్ర పదము చంచలత్వమును-ఘంట పదమును నిశ్చలత్వమును తెలియచేస్తున్నవి.ఇక్కడ చంద్రుని రూపమును గాక స్వభావములకు సంకేతములుగా పరిగణిస్తే రెండు పరస్పర విరుధ్ధభావములైన చంచలత్వమునకు-నిశ్చలత్వమునకు ప్రాతినిధ్యము వహించుచున్నవి. "చంద్రమా మనసో జాతః" చంద్రుడు మన మనో...

PRASEEDA MAMA SARVADAA-02

Image
ప్రసీద మమ సర్వదా-02 బ్రహ్మచారిణి మాతా నమోనమః "దధనాకర పద్మాభ్యాం అక్షమాలా కమందలా దేవీ ప్రేదతుమయీ బ్రహ్మే చారిణ్యనుత్తమం." ఒకచేత జపమాల-మరొకచేత జలపాత్రతో "అజాయమాన బహుదా విజాయతే" అను సూక్తిని శుభకరము చేస్తూ,తల్లి తన రెండవ దుర్గారూపమైన బ్రహ్మచారిణిగా ప్రకటితమగుచున్నై.ఎంతటి భాగ్యశాలురమో మనము.ఈ తల్లికి ఏటువంటి వాహనముమనకు గోచరమగుటలేదు.దానికి కారణము తల్లి చారిణి.నిరంతరము సంచరించు స్వభావము కల చలనశక్తి. బ్రహ్మచారిణి అను నామము రెండుపదముల ద్వారా రెండు విషయములను తెలియచేయుచున్నవి.అందులో మొదటిది బ్రహ్మము.రెండవది అందులో తల్లి సంచారము. " పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదుచ్యతే" పురుషసూక్త ప్రకారము అపరిమితమైన బ్రహ్మములోని ఒక భాగమును సమస్తచరాచర విశ్వముగా మనము చూడగలుగుతున్నాము.అమృతమయమైన మిగిలిన మూడు భాగములు మనకు అగోచరములు-అనూహ్యములు. నాశనమయ్యే మన దేహములోని నాశరహిత చైతన్యమే బ్రహ్మము.విజ్ఞులు బ్రహ్మమును భగవతత్త్వము అని కూడా భావిస్తారు.వారి సిధ్ధాంతము ప్రకారము "భ" శబ్దము తేజోవంతమైతే"గ" శబ్దము గమనశీలత్వము.తేజోవంత గమన చైతన్యమే బ్రహ...

PRASEEDA MAMA SARVADAA-01

Image
ప్రసీద మమ సర్వదా-01 మాతా శైలపుత్రీం నమోనమః " వందేవాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరం వృషారూఢం శూలధరం శైలపుత్రీం యశస్వినీం' వృషభవాహినియై(ధర్మమును అధిష్టించి) కుడిచేతిలో త్రిశూలమును-ఎడమచేతిలో పద్మమును ధరించి భక్త రక్షణచేయుతల్లికి నమస్కారములు. సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహమను పంచకృత్యములను చేయుతల్లి,తిరోధానము ముగిసిన తరువాత,అనుగ్రహమను ఐదయకృత్య విశేషమే నవదుర్గావిష్కారము.ఇందులో శైలపుత్రీ గా తల్లి ప్రథమ రూపమును ప్రకటించుకొనినది. అమ్మ అవ్యాజ కరుణను నేనేమని వర్ణించగలను? తల్లి తన నిర్హేతుక కృపాకటాక్షమునకు నిదర్శనముగా మనతో తన నవదుర్గా అవతార విశేషములను తెలియచేస్తూ,ఎంతో ఓర్పుతో-నేర్పుతో మనందరి చేయి పట్టుకుని,నవనవోన్మేష మార్గమున మనలను నడిపించదలచినది. మొట్తమొదట మనము ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజున ఆదిపూజలందు తల్లి శైలపుత్రీ లీలా విశేషములను తెలుసుకొనే ప్రయత్నము చేద్దాము. మూలపదార్థము కొత్తరూపమును ధరించు ప్రక్రియను మనము సృష్టికార్యముగా భావిస్తే,దక్షవాటికలో తన అవతారమును స్వఛ్చందముగా ముగించుకొనిన సతీదేవి,సతీదేవి గ్లానియైన ధర్మమును తిరిగి స్థాపించుటకు ,తన శక్తి...