ఓం నమో నారాయణాయ-15

" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే"
ఓం నమో నారాయణాయ-15
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది.
లేమ!" లేత చిలుకతో' పోల్చబడినదైన
పరిణితముగ పలుకుచున్న "పదియవ గోపికలో"
"నీంగళే-నీవల్లే" అను వాదోపవాదములైన
కృష్ణమాయ కమ్ముకునిన " గోపికల సం శయములో"
బంధింపబడిన తలుపు అటు-ఇటు వాక్చమక్కులైన
చక్కని చుక్కల మక్కువ పరిహాసోక్తులలో
" తిరు-పావై" అను వేదబీజ స్వరూపమైన
పదిహేను రోజుల వ్రత పుణ్య పూర్వ భాగములో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
అమ్మచే నిద్రలేపబడుతున్న చిన్ని చిలుకవలె పలుకుతున్న పదియవ గోపికలో,ఇదంతా నీవల్లే అంటే నీవల్లే అని నిందించుకొనుచున్న గోపికలలో,మూసిఉన్న తలుపునకు రెండువైపులనుండి పరిహాసపు మాటలాడుకొనుచున్న గోపికలలో,వ్రతములో సగభాగము పూర్తియైనదన్న విషయములో గోపిక మనసు లగ్నమైనది.(ఇది సామాన్యార్థము.)
తెల్లవార వచ్చెను అనగా నల్లనైన తమోగుణము అస్తమించి,తెల్లనైన సత్వగుణము ఉదయించుటకు సిద్ధముగా నున్నది.అమ్మచే నిద్దురలేపబడుతున్నది పదియవ గోపిక అను పదియవ ఇంద్రియము.(బుద్ధి)కనుకనే "లేత చిలుక" శుక మహర్షి పలుకులను తెలిసికొనగలుగుచున్నది.మూసిన తలుపు భగవంతునికి -భక్తులకు మధ్యనున్న" మాయతెర".చక్కని చుక్కలు అనగా" ఆధ్యాత్మిక పరిజ్ఞానముగల అనుభవజ్ఞులు".వారు "తర్క-మీమాంసాది శాస్త్ర విచారణల" గురించి చేయు చర్చలే నీవల్లే నీవల్లే అని చేయుచున్న వాదోపవాదములు.తెర తొలగించమని చేయుచున్న ప్రార్థనలే పరిహాసోక్తులు.అవి పండితులకు మాత్రమే కాకుండా గొల్లలకు సైతము అందుబాటులో ఉండుటకై" ఆండాళ్ తల్లి" పరమ దయతో అనుగ్రహించిన శ్రీవ్రత పాశురములు అని గ్రహించిన మనగోపిక, అమ్మ గోదాదేవి చేయించుచున్న వ్రతములో తానును,
స్వయముగా పాల్గొనవలెనని సంకల్పించుకొన్నదన్న ఆలోచనలో నిమగ్నమైన నా మనసు,పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించుటకు చెలులారా! కదిలిరండి.తెల్లవారుచున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)