TIRUPPAAVAI-15

  
 ఉంగళ్పుళుక్కడై త్తోట్టత్తు వావియుళ్
 శెంగళ్ నీర్వాయ్ నెగిజింద్ ఆంబల్వాయ్ కుంబినగాణ్
 శెంగల్ప్పొడి క్కూరై వెణ్పల్ తవత్తవర్
 తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్రార్
 ఎంగళై మన్నం ఎజుప్పువాల్ వాయ్ పేశుం
 నంగాయ్ ఎళుందిరాయ్ నాణాదాయ్ నావుడయాయ్
 శంగోడు చక్కరం ఏండుం తడక్కైయన్
 పంగయ కణ్ణానై ప్పాద ఏలో రెంబావాయ్   
 
. ఓం నమో నారాయణాయ-14

విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది

"ముష్టికాసుర చాణూరులను" మట్టికరిపించినవారైన
ఉల్లము ఝల్లనిపించిన " మల్లయుద్ధ క్రీడలలో"

" చింతచెట్టు క్రింద కూర్చున్న" చిత్ప్రకాశరూపమైన
మధురకవితో మాట్లాడిన " శ్రీ నమ్మాళ్వారులో"

"త్రేతా-ద్వాపర యుగముల" రామ-కృష్ణ నామభేదాలైన
భక్తిభావము ఎక్కువైన " చీలిన రెండు వర్గములో"

శ్రీ రామాలింగనమునకు " ధ్యానించిన వారైన"
"శ్రీ కృష్ణ పరిష్వంగమును" కోరుచున్న గోపికలలో

తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె

 తామ్రపర్ణీ నదీ దక్షిణతీరములో కురుకూరులో ఉదయనంగ-కారికి దంపతులకు పుత్రుడుగా ఆదిశేషువు జన్మించాడు.మాటాడుటలేదని గుడికి తీసుకువెళితే చింతచెట్టు తొఱ్రలోనికి పోయి,పద్మాసనుడై యోగ నిష్ఠలో ఉండిపోయెను.తిరుక్కోవలూరునందు పరమభక్తుడైన నారాయణ దీక్షితునకు కుముద ఆళ్వార్ (ముదలి వారికి సంబంధించిన) పుత్రునిగా కరుణించెను.అతడే మధురకవి నామధేయుడుడైన భాగవతోత్తముడు.మధురకవికి మొదటిసారిగా నమ్మళ్వారుతో మాట్లాడించగలిగినమహద్భాగ్యము దక్కినది.అదే విధముగా మన గోపికకు శ్రవణేంద్రియము జాగృతమై వారి సంభాషణను వినగలిగినది.పంచేంద్రియములు పంచభూతములు తానే అయిన పరమాత్మ అవ్యాజ కరుణ శ్రీ వ్రతమును చేయుటకు సంకల్పించినంత మాత్రముననే అవధులు లేనిదై అనుగ్రహిస్తున్నది.

.మల్లయుద్ధములో చాణూర-ముష్టికాసురులను మట్టు పెట్టిన స్వామిలో,చింతచెట్టుక్రింద దివ్యమైన ప్రకాశముతోనున్న(5వ ఆళ్వార్) శ్రీ నమ్మళ్వార్ తన మౌనముద్రను వీడి మొదటిసారిగ శ్రీ మధురకవితో మాట్లాడుటను ,రాముని ధ్యానించిన మునులను,శ్రీకృష్ణుని ఆలింగనమును కోరుచున్న గోపికలను చూచినది.(ఇది సామాన్యార్థము)
ఇక్కడ భవబంధములకు-భగవతత్త్వమునకు మల్లయుద్ధము జరుగుచున్నది.మహనీయుల దర్శనము మహా మహిమోపేతము అనుటకు నిదర్శనముగా,చింత చెట్టుక్రింద భగవత్చింతనలోనున్న మధురకవి -నమ్మళ్వార్ వారిని సందర్శించుటయే కాకుండా, మన గోపికయుస్వామి దయచే (ఆమె) శ్రవణేందియము జాగృతమై వారి సంభాషణను సైతము వినగలుగుతున్నది. రామునిలోను-కృష్ణునిలోను అభేదమును,జీవాత్మ-పరమత్మల అవినాభావ సంబంధమును గుర్తించుటకు ప్రయత్నించుచున్నది.గోపిక సాధనను సఫలీకృతము చేయుట
కు సం స్కారములు జాగృతమగుచుండుటలో నిమగ్నమైన నా మనసు, పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించుటకు చెలులారా! కదిలి రండి.తెల్లవారు చున్నది.

( ఆండాళ్ తిరువడిగళే శరణం)

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)